Search This Blog

Wednesday 7 February 2018

మట్టికొట్టి పోయిన మోడీ - Modi's Betrayal.

మామూలుగా అయితే , కేంద్రపాయిజిత  ప్రాజెక్ట్ లకు కేంద్రం 60% ఉచిత నిధులు, రాష్ట్రాలకు  ఇస్తుంది. కానీ ప్రత్యేక సాయం అందించవలసిన రాష్ట్రాలకు 90% ఉచిత నిధులు ఇస్తుంది.
విదేశీ సాయంతో (EAP) చేపట్టె  ప్రాజెక్ట్ లకు విదేశీ బ్యాంకులు ఋణాలిస్తాయి . ఈ ఋణాలు అంతతేలికగా రావు. విదేశీ బాంక్ లు, కేంద్రాన్ని  కౌంటర్ గారంటే అడుగుతాయి. ఇవన్నీ జరగడానికి చాల సమయం పడుతుంది.

కేంద్రపాయిజిత పథకాలకు  మాత్రమేకాదు విదేశీ సాయంతో (EAP) చేపట్టె  ప్రాజెక్ట్ లకు కూడా 90% ఉచిత నిధులు రాష్ట్రానికి  ఇవ్వాలని చంద్రబాబు కోరిన మీదట,కేంద్రం 2016లో ఒప్పుకొంది. సరే అని, చంద్రబాబు 18000కోట్ల విలువైన ,13 ప్రాజెక్ట్ లు ( విదేశీ సాయంతో (EAP) చేపట్టె  ప్రాజెక్ట్ లు )  తెచ్చుకొని ఫైల్ ని కేంద్రానికి పంపారు. కానీ ,కేంద్రం కొర్రీ లపై కొర్రీ లు వేస్తూ కాలయాపన చేయడంతో ఇప్పటికే 4 ఏళ్ళు గడిచి పోయాయి.

 ప్రత్యేకప్యాకేజి  వెసులుబాటు మనరాష్ట్రానికి కేవలం 5ఏళ్ళు మాత్రమే ఇచ్చింది కేంద్రం. అనగా 2020 తో గడువు పూర్తై పోతుంది. అంటే, ఇంకా 2 ఏళ్ళు మాత్రమే సమయముంది. అందుకే చంద్రబాబు కనీసం నాబార్డ్ ద్వారా రుణాలిప్పించమని కేంద్రాన్ని అడిగాడు.
ఆలా నాబార్డ్ ద్వారా ఇస్తే  రాష్ట్ర ద్రవ్యలోటు పెరిగిపోయి, రాష్ట్రం రుణాలుపొందే సామర్ధ్యం తగ్గిపోతుందని జైట్లీ అంటున్నారు. అనగా , ప్రపంచ బాంక్ నుండి ఋణాలు పొందితే రుణ సామర్ధ్యం తగ్గ దని జైట్లీ గారి అభిప్రాయమా?
ప్లానింగ్ కమిషన్ అని కొంతకాలం,,నీతిఆయోగ్ అని కొంతకాలం, అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కావాలని కొంతకాలం, ప్రాజెక్ట్ లో క్లారిటీ రావాలని కొంతకాలం , DPR  పంపలేదని కొంతకాలం,  పుణ్యకాలం గడిపేసింది కేంద్రం.
 హోదా బదులు ప్యాకేజి ఇస్తున్నట్లు  అటు ప్రకటించి , ఇటు ఆ ప్యాకేజి  ప్రయోజనాలకు గండికొట్టాలనే కుతంత్రం చేస్తుందని సాక్షాత్ ఆంద్ర అధికారులే వాపోతున్నారంటే, మోడీ రాజకేయం ఇలా ఉంటుందా?అని ప్రజలు విస్తుపోతున్నారు.
రాజకీయప్రయోజనం లేనిదే మోడీ&కో పైసా విదిల్చరు .
 రాష్ట్రం మట్టికొట్టుకు పోవాలనే,...  అమరావతి శంకుస్థాపన కి  విచ్చేసి కాస్త మట్టి కొట్టి వెళ్లాడు  మహానుభావుడు.

No comments:

Post a Comment