Search This Blog

Monday 5 February 2018

Andhra Pradesh State Reorganisation, 2014

 చట్టప్రకారం చేయవలసిన పనులు కూడా చేయడం లేదు మోడీ ప్రభుత్వం అని ఆంధ్రుల ఆరోపణ. ఈ చట్టంలో ఏముందో ఒక్కసారి పరిశీలిద్దాం...
  • ఆదాయము,ఆస్తుల పంపకం : జనాభా నిష్పత్తిని ఆధారం చేసుకొని పంపకాలు చేయాలి. పంపకాలలో గొడవలొస్తే కాగ్ సహకారంతో పరిష్కరించి ఉత్తర్వుల ద్వారా  పరిష్కరించాలి తప్ప ఆలస్యం చేయకూడదు. ఏడాదిలోపే ఈ పంపకాలు పూర్తి చేయాలి. 
  • పోలీసువ్యవస్థ : గ్రే హౌండ్ మరియు ఆక్టోపస్ లాంటి శిక్షణా సంస్థలను 3ఏళ్లలో ఆంధ్రాలో స్థాపించాలి. 
  • Center must give Helping hand to A.P. state. సాయం : 
  1. తొట్టతొలి సంవత్సరంలో (2014-15)  ఉన్న లోటుబడ్జెట్ కి  సరిపడా నిధులివ్వాలి.  
  2. అలాగే కేంద్రం గ్రాంట్ రూపంలో ప్రతి ఏటా  సాయం అందించాలి. 
  3. పరిశ్రమలను ఆకర్షించడానికి అవసరమైన సాయాన్ని  అందించే రీతిలో కొత్త ఆంధ్ర రాష్ట్రాన్ని  ప్రత్యేకంగా చూడాలి. (special package). 
  4. మౌలిక సదుపాయాలను ఏర్పాటు  చేయాలి . విద్యా /  వైద్య / సాంకేతిక /  పరిశోధనా సంస్థలను 5ఏళ్లలో ఏర్పాటు చేయాలి . 
  5. రోడ్ ,రైల్ ,ఎయిర్ నెట్వర్క్  ని బాగా విస్తరించాలి. అంతేకాదు దుగరాజపట్నం ఓడరేవు, కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి. మూడుప్రధాన నగరాలలో మెట్రో సదుపాయం ఇవ్వాలి. వీటన్నింటికీ సరిపడా నిధులను కేంద్రం 5ఏళ్లలో అందివ్వాలి. 
  6. పోలవరం జాతీయప్రాజెక్ట్ గా ప్రకటించి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతిచ్చిన    హంద్రీ నీవా లాంటి మిగతా సాగునీటి ప్రాజెక్ట్ లన్నీ కేంద్రమే పూర్తి సాయం ఇవ్వాలి.   
పరిశీలించి చూడండి . ఇప్పటికే 4 ఏళ్ళు అయిపోయింది.  పైన ఉన్న చట్టంలోని ఏ విషయాన్ని కూడా మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు. కేవలం డ్రామా ఆడుతూ కాలం వృధా చేశారు . మిగతా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఇస్తున్నారు తప్ప,స్పెషల్ గా ఏమీ సాయం ఇవ్వడం లేదు. పైపెచ్చు ఎక్కడ ఎలక్షన్ లు ఉంటే ఆ రాష్ట్రానికి వేల కోట్లు గుమ్మరిస్తూ, తానూ ఒక సాదా రాజకీయనాయకుడి మాదిరి ప్రవర్తిస్తున్నారు. 
ఇలా  ఏడిపిస్తున్నారనే ,  వివిధ కేంద్ర పథకాలనుండి కొద్దికొద్దిగా నిధులను పోలవరానికి,ఇతర సాగునీటి ప్రాజెక్ట్ లకు మల్లించి తన తిప్పలు తాను పడుతుంది ఆంద్ర ప్రభుత్వం. 
కేంద్రంలోని మోడీ &కో , ఇంకా మాయమాటలతో మోసం చేదాం అని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. 
అఖిల పార్టీ మీటింగ్ పెట్టి గొడవలు చేస్తేనే కేంద్రం దారికొస్తుంది. 
సమయం మించిపోతుంది.. 
సరైన నిర్ణయం సరైన సమయంలో ఆచరణలో పెట్టాలి చంద్రబాబు. 

No comments:

Post a Comment