Search This Blog

Tuesday 30 August 2016

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్రియా శీల మయ్యే సమయం ఇదే !

కేవలం 2 ఏళ్లలో 50000 కోట్ల విలువైన పరిశ్రమల ను రాష్ట్రానికి రప్పించి , 1400 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాని స్థిరీకరించి , ఆనతి కాలం లోనే అమరావతికి బీజం వేసి , ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపు ని తీసుకొస్తున్న నాయకుడిని ఓటుకి నోటు అనే తుగ్లక్ కేసుతో సతాయి స్తుంటే మనం చూస్తా ఊరుకుంటే , దిశా నిర్దేశం చేసే కార్యశీలుడైన ఒక మంచి నాయకుడిని కోల్పోవలసి వస్తుంది . దగుల్భాజీ కుంభకోణాలు ఎన్నో చేసి లక్షల కోట్ల దేశ సంపదను లూటీ చేసిన వారు బలాదూర్ గా తిరుగుతూ రైళ్లను తగలబెడుతుంటే ,కులాన్ని అడ్డుపెట్టుకొని ఉగ్రవాదులను వదిలేయమని చెప్పే కుల నాయకులు దొంగ దీక్షలు చేస్తుంటే ఏమీ పట్టనట్లు ఉండిపోవడం ఆంధ్రులు చేస్తున్న చారిత్రిక తప్పు . ఎవరికీ వారు ఒక్క సారి ఆలోచించు కోవాలి . మళ్ళీ ఇంతలా పనిచేసే నాయకుడు మనకు దొరకడు .

లక్షల దోపిడీ జరిగిందనే క్విడ్ ప్రొ  కేసులు నత్త నడక నడుస్తున్నాయని ఎందుకని   ఎవరూ ప్రశ్నించరు ?
కుల దీక్ష పేరు తో రైళ్లు తగలపెట్టిన కేసు లో, పురోగతి ఎందుకు లేదో ఎందుకు ప్రశ్నించరు ?
ఆంద్ర ప్రదేశ్ లో ముఖ్యం గా తెలుగుదేశం పార్టీలో కార్యశీలం గా ఉన్న నాయకులు ,  ఈ కేసులపై సమాచారాన్ని తెప్పించు కొని ,  త్వరిత గతమైన విచారణ చేయమని హైకోర్టు లో ఎందుకు పిటిషన్ లు వేయరు ?
మంత్రులు , MLA లు ఎవ్వరూ ప్రతిభావంతం గా మాట్లాడలేరు . తమ నాయకుడి కి  సరైన  తోడ్పాటును అందించ లేరు . కేవలం వారి వ్యాపారాలు ,కమిషన్ లు చూసుకోవడమే తప్ప , పార్టీపైన , రాష్ట్రం పైన శ్రద్ధ లేదు . ఇలాంటి వాళ్ళ తో ఈదాలను కోవడం నాయకుడి పెద్ద పొరపాటు .  అన్నీ తానే చేయడం తప్పుకాదు . ఎవరితో ఎలా పని
చేయించు కోవాలో ,  నిష్కర్షగా ఉంటూ ఎదుటివారి నుండి  పనిని ఎలా  రాబట్టు కోవాలో కూడా ఆచరణ లో చూపించాలి . 

రాజకీయం ఒక అట . ఈ ఆటలో ఒక పార్టీ ఇంకో పార్టీ ని తొక్కెయ్య వచ్చుఁ .  ఆటలో అంతా ధర్మమే . 
 స్టింగ్ ఆపరేషన్ లు చేసో ,కంఠాన్ని అనుకరించో ఏదో ఒకటి చేసి రాష్ట్ర నాయకుడిని తద్వారా రాష్ట్ర ప్రగతిని కుంటు పరచాలనే కుట్ర మాత్రం సాగ నివ్వ కూడదు . 
ఎందు  కంటే ఈ కేసు లో  కేవలం ఎన్నిక నియమావళి ఉల్లంఘన తప్ప , అవినీతి అనేది లేదు . ఆ విషయం న్యాయ మూర్తులందరికీ తెలుసు . ఏదో ఒక విధం గా ఒక ముఖ్యమంత్రిని బద్నాం చేసి ,రాష్ట్ర పరువు ప్రతిష్టలను బజారు కీడ్చి , వచ్ఛే ఒకటి ,రెండు ప్రాజెక్ట్ లకి మోకాలడ్డి ,  చెల్లించ వలసిన బకాయిలను ఎగ్గొట్టే కుట్ర ఇది . 
నేనేమీ పార్టీ పై అభిమానం తో చెప్పడం లేదు . ఇది చూడండి ... 
ఇదివరకే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి , "ఓటుకు నోటు కేసు ఎన్నికల నియమ నిబంధనల అతిక్రమణ కిందకు వస్తుందే తప్ప అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని, దీని విచారణకు ఏసీబీకి పరిధి లేదని "హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శివ శంకర్‌ రావు తీర్పు ఇచ్చారు. 

 రాజకీయ నాయకులు ఆడే అట వలన ప్రజాధనం లూటీ కాకూడదు . దేశానికి దెబ్బ తగల కూడదు . 
 గత 50 ఏళ్లుగా  పార్టీ ఫిరాయింపులు కళ్ళ ముందు జరుగుతా ఉంటే , రాజ్యాంగం ప్రకారం తప్పని తెలిసీ  ,  
న్యాయ వ్యవస్థ గానీ, రాజ్యాంగ వ్యవస్థ గానీ ,ఎలక్షన్ కమిషన్ గానీ ఎవ్వరూ మాట్లాడరు . 
రాజద్రోహం ,దేశ  ద్రోహం వేరు . పార్టీ ద్రోహం వేరు .  దీనివలన , పార్టీ ఫిరాయింపులనేవి అనైతికమే గానీ నేరమని ఎవ్వరూ నమ్మడం లేదు .  ప్రజలు కూడా ఇదంతా రాజకీయ పార్టీలు ఆడుకొనే క్రీడ గా భావించి నిర్లిప్తం గా 
ఉంటున్నారు .  ఫిరాయింపులు చేయలేదని ఏ పార్టీ గుండె మీద చెయ్యేసి చెబుతుంది ? 
 ప్రజలే నేటి రాజులు . కాబట్టి ప్రజాద్రోహం జరిగితే కఠిన శిక్షలు ఉండాలి . ఓటుకి నోటు కేసు అనేది  కేవలం రాజకీయ పక్షాల మధ్య న  జరిగిన   ఒక  ఆట . దానివలన ప్రజలకు, దేశానికి  జరిగిన నష్టం ఏమీ లేదు .
కానీ , సూట్కేసు సంస్థల పేరిట  విదేశాల్లో దొంగ సంస్థలు స్థాపించి , విదేశీ ద్రవ్యాన్ని హవాలా ద్వారా దేశానికి రప్పించి  క్విడ్ ప్రో చేయడం రాజ్య ద్రోహం . ఇసుక మాఫియా  , భూగర్భ సంపద లూటీ  , భూ దందా ల ద్వారా  వేలకోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేయడం ప్రజా ద్రోహం . రైళ్ల ను ,మనుషులను తగలబెట్టి కాలర్ ఎగరేయడం ప్రజాద్రోహం .   పట్టపగలు కళ్ళ ముందు జరుగుతున్న నేరాలపై  ముందుగా ఫోకస్ పెట్టండి . నల్ల ధనాన్ని ఎలా అరికట్టాలో ఆలోచించండి .    ఫోన్  ల ద్వారా చేసే స్టింగ్ ఆపరేషన్ లతో  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇరికిస్తే పక్క రాష్ట్రం చంక నాకి పోతుందనే రాక్షస బుద్ధి తో , రాష్ట్ర భవిషత్ కి విఘాతం కలిగించే వారి కుట్రలను తిప్పి కొట్టాలి . ఇది మీడియా ,ప్రజలు, విద్యార్థి సంఘాలు ముందుకు వఛ్చి క్రియా శీల మవ్వ వలసిన సమయం .  
తప్పు చిన్న దైనా తప్పే ! కానీ నేటి పరిస్థితులలో , ఎక్కువ పెద్ద  తప్పు ఎవరు  చేశారో ముందు వారికి శిక్ష పడాలి .

Tuesday 2 August 2016

అందరూ ఆలోచించండి ....ముఖ్యంగా మోడీ గారు కొంచెం మనస్సు పెట్టాలి

గాడ్గిల్ -ముఖర్జీ ఫార్ములా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పొందే  అర్హత లేదని తెలిసీ , రాష్ట్రాన్ని చీల్చి పడేసే హడావిడిలో ,ఆంధ్ర ప్రాంత ప్రజలను బుజ్జగించ డానికి కాంగ్రెస్ ,భాజాపా రెండూ కూడా రాజ్యసభలో హామీలు గుప్పించాయి . అంతే కాదు ,ఎన్నికల వేళ మోదీ కూడా ఆంధ్రుల కు అరిటాకులో వడ్డనచేస్తా నని  ఆశలు రేపాడు .

14 వ ప్రణాళికా సంఘాన్ని వేసి ,నీతిఆయోగ్ అనే అభివృద్ధి సంఘాన్ని కూర్చి ,  పన్నుల్లో రాష్ట్రాలవాటా ను 32 % నుండి 42% పెంచామని ,కాబట్టి ఆంధ్రాకి వేరే సాయం అనవసరం అని నేడు బల్లగుద్ది ఉభయసభల్లో చెబుతున్నారు.  .
కేంద్రం,  రాష్ట్రాలకు సాయం చేయడం అనేది రాజ్యాంగ నియమం . అది 30% ఉచిత సాయం రూపం లో ,70% అప్పు రూపం లో ఉంటుంది . కానీ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రం ,90% ఉచిత సాయం ,10% అప్పు రూపం లోనూ ఉంటుంది . అంతే కాదు ,ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల లో  కార్పోరేట్ పన్ను , ఆదాయం పన్ను ,తయారీ
పన్ను ,అమ్మకం పన్ను మొదలగు ప్రత్యక్ష, పరోక్ష పనులలో రాయితీలు ఉండటం వలన పరిశ్రమలు ,కంపెనీలు ,సేవారంగపు సంస్థలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో స్థాపించ డానికి  మొగ్గు చూ పుతారు . దీని  వలన నిరుద్యోగం పోయి, రాష్ట్ర GDP పెరిగి,  ప్రజల కొనుగోలు సామర్ధ్యం పెరగడం వలన వినియీగా దారుల మార్కెట్ కూడా ఇబ్బడి ముబ్బడి గా పెరిగి పోతుంది .

రాష్ట్రాలకు కేంద్రం అందించే సాయం ఒక పద్ధతిలో ,ఒక ఫార్ములా ప్రకారమే ఉంటుంది గానీ ,ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు దోచి పెటేయడం జరగదు .
ఉదాహరణకు ,  రాష్ట్రాలకు అందించడానికి కేంద్రం దగ్గర 100 రూపాయలు ఉన్నాయి . ఇందులో కేవలం 30 రూపాయలు (30%) మాత్రమే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలన్నింటికీ సర్దాలి . ఇప్పటికే 11 ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి . వీటి మధ్యన ఈ 30% ని సర్దాలి గదా . ఏది ఎలా పంచుతారంటే , ఆయా రాష్ట్ర ప్రణాళిక మరియు ఖర్చు ని ఆధారం చేసుకొని పంచుతారు . ఇప్పుడు ప్రత్యేక హోదా  ఇస్తే గిస్తే ఆంధ్ర 12 వ రాష్ట్రం  అవుతుంది .

మిగతా 70 రూపాయలను ( 70% ) ని మిగతా రాష్ట్రాలకు అందిస్తుంది .
ఆంధ్రా ఎందుకు డిమాండ్ చేస్తోంది ?
5 కోట్ల ఆంధ్రుల మనోభావాలకు వ్యతిరేకం గా విభజన చేశారు .
వారి జీవనాడి ,ఆర్ధిక నాడీ కేంద్రమైన రాజధాని నుండి బలవంతం గా గెంటేశారు .
 హైదరా బాద్ నుండి వచ్ఛే రెవెన్యూ లో భాగం ఇవ్వకుండా కేవలం 10ఏళ్లపాటు తెలంగాణకి వివిధ పన్నుల రూపం లో అద్దె చెల్లించు కొంటూ  ఉండటానికి ఒప్పుకోవడం పుండుమీద కారం చెల్లినట్లే !
గత 60ఏళ్లలో మూడు మౌలిక రంగాల లో ఒక్క వ్యవసాయం తప్ప రాష్ట్ర GDP  ని శాసించే సేవా ,తయారీ రంగాలకు చెందిన సంస్థలన్నీ పోగొట్టుకొని ఒక రకం గా నడివీధిన పడ్డారు .
కృష్ణా , గోదావరి నదులకు చిట్ట చివరి అట్టడుగు రాష్ట్రమైన ఆంధ్రాకి న్యాయం గా అందవలసిన హక్కులను కాపాడటానికి "నదీ పరిరక్షణ కమిటీ ని" కేంద్ర పరిధిలో వేస్తేనే ఆంధ్రాకి అన్యాయం జరగకుండా కాపాడు కోవచ్చుఁ .
కానీ అదీ జరగలేదు . అంతే కాదు, నదీ దిగువ ప్రాంతం గా గుర్తింపు హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని విభజించడం వలన ఆంధ్రా పూర్తిగా అన్యాయం అయిపోయింది .

అఖండ సాగరం చుట్టూ ఉన్నా తాగడానికి చుక్కనీరు లేదనే సామెత లెక్క 1000 కి . ఎం . సముద్ర తీరం ఉన్నా సరైన ఓడరేవులు లేవు .
పెరట్లో కాచిన కూరలన్నీ ఇరుగు పొరుగు పట్టుకు పోయిన చందం గా , మన తీరంలో ఉన్న గ్యాస్ ని మనకి ఇవ్వకుండా దోచు కెళుతున్నారు .
డబ్బు పోతే మళ్ళీ సంపాదించు కోవచ్చుఁ . విద్య లేకపోతే ఎట్లా ? ఒ క  విద్యా సంస్థని స్థాపించాలంటే కనీసం 5ఏళ్ళు పడుతుంది . ఎంతమంది ఆంధ్రా విద్యార్థులు ఇబ్బందులు పడతారో ఆలోచించండి .
చదువు ,తెలివి ఉన్నా  సరైన ఉద్యోగాలు  లేకపోతే ఎలా ? ఉద్యోగాలు ఇచ్ఛే సంస్థలన్నీ హైదరాబాద్ లో ఉంటే ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అంటూ తెలంగాణ వాళ్ళు తరుముతుంటే ,స్థానికత పేరుతొ అవకాశాలు లేక ఆంధ్రా విద్యార్థులు  మల మల మాడాలసిందేనా ?
ఇప్పుడు ఆంధ్రాకి కావలసింది నిధుల సాయం కాదు . ఉద్యోగాలిచ్ఛే పరిశ్రమలు ,సంస్థలు కావాలి . యువత పక్కదారిపట్టి సమాజం ఛిద్రం కాకూడదు అంటే ఇది వెంటనే జరగాలి .
ఒక పక్క కేంద్రం 3.9 % లోటుతో కుంగి పోతుందని అంటున్నారు . అలాంటప్పుడు ప్రత్యేక పాకేజీ మాత్రం  ఎలా ఇవ్వగలరు ?
 జీవాధారాలైన నీటిని , జీవనా ధారా లైన రాజధానిని ,ఆర్ధిక పరిపుష్టిని కోల్పోయి  ... ఇలా మూడు విధాలుగా చెడ గొట్ట బడ్డ ఆంధ్రులు ఇంకా ఇలా ఉన్నారంటే అప్పుడు ఎం టి రామారావు ,ఇపుడు చంద్రబాబు చలవ , ఆంధ్రుల కార్య శురత్వం తప్ప మరోటి కానే కాదు .
స్వాతంత్రం వఛ్చిన తర్వాత ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాలు, ఇతరుల కెవ్వరికీ  జరగలేదు .
మరీ ఇంత  అన్యాయం ఏ రాష్ట్రానికి జరగలేదు . జరగకూడదు కూడా !
ఎందుకంటే ,అప్పుడు కాంగ్రెస్ ,ఇప్పుడు భాజపా పై ఆక్రోశం ,ఆవేశం ఉండటం పెద్ద విషయం ఏమీ కాదు . కానీ అసలైన అత్యంత  విషమ మైన  మార్పు ... భారతదేశ సార్వభౌమత్వం పైన ,రాజ్యాంగం పైన ఏహ్యత , ఆంధ్రా ప్రజలలో వస్తే అది దేశానికే , దేశ సమగ్రతకే  ప్రమాదం !