Search This Blog

Friday 19 September 2014

3 లక్షల తెలుగు దేశం పార్టీ కార్యకర్తల కు సువర్ణ అవ కాశం .

సుమారు 20000 గుళ్ళ కి , 200 మార్కెట్ యార్డ్ లకు కమిటీ సభ్యులు గా నామినేట్ అయ్యే అవకాశం
రావడం తో , తెలుగు దేశం పార్టీ కార్యకర్తల లో హుషారు వచ్చింది .

రాజధాని వార్తలు -2

కృష్ణా నదికి ఇరు వైపులా -అటు  తాడేపల్లి నుండి అమరావతి వరకు ,ఇటు గొల్లపూడి నుండి ఇబ్రహీం పట్టణం వరకు - ప్రభుత్వ పరిపాలనా భవనాలు , ఉద్యోగుల , MLA,MLC ,మంత్రుల ల నివాసాలు వచ్చే అవకాశం ఉంది. డైరెక్టరేట్ ,కమీషన రేట్ , సెక్రటేరియట్ ,శాసన సభ ,కౌన్సిల్ ,రాజభవన్ ,అలాగే సుమారు 100 ప్రభుత్వ సంస్థల
ఆఫీసులు వస్తాయి . నిజానికి వీటన్నింటినీ కేవలం 1000 ఎకరాలలో మంచి పచ్చదనం తో బహుళ అంతస్థుల భవనాలతో ,సోలార్ శక్తితో ,మురికి శుద్ది ప్లాంట్ మ రియు శు ద్దీకరిమ్చిన జల వినియోగం మొదలగు స్మార్ట్ సాంకేతికత ను ఉప యోగించు కొని ప్లాన్ చేస్తే విజయవాడ ఒక మంచి మోడల్ రాజధానిగా వృద్ధి చెందుతుంది .

సుమారు 500 km బకింగ్ హామ్ కాలువని  జల రవాణాకు అనుగుణం గా అభివృద్ధి చేస్తే అత్యంత చౌక లో సరకులను కాకినాడ నుండి విల్లుపురం వరకు రవాణా చేసుకో వచ్చు .



తల్లి తెలంగాణా కూడా భరత మాత బిడ్డే

 9 జిల్లాల తెలంగాణ లో 80 లక్షల కుటుంబాలు , 3కోట్ల జనాభా ఉన్నారు . 
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో 20 లక్షల కుటుంబాలు ,75 లక్షల జనాభా ఉన్నారు . 
శ్రీ కే .సి . ఆర్ . గారు ఆంద్ర సెట్లర్స్ పట్ల వివక్ష, ఆంధ్ర పెట్టుబడి దారుల పట్ల వైముఖ్యం ,
అలాగే దేశ రాజ్యాంగం పట్ల హేళన , అలుసు -- ఇలాగే కొ న సాగిస్తే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గానో  లేదా ప్రత్యేక రాష్ట్రం గానో  మార్చమని హైదరాబాద్ వాస్తవ్యులందరూ ముక్త కంటం  తో గళం విప్పే రోజు  అతిత్వరలో నే వస్తుంది .

తెలంగాణా ప్రజలందరూ మేల్కొని తమ నాయకులను అదుపులో పెట్టు కోవలసిన అవసరం చాలా ఉంది .
మనం భారతీయులమని,మన ఫెడరల్ వ్యవస్థ లో జెండాని , రాజ్యాంగా న్ని గౌర వించాలని  మరిచి పోతే అంత  కన్నా దౌర్భాగ్యం ఉండదు .

నిజాం నవాబులు దేవుళ్ళని , రజాకర్ల వలనే తెలంగాణా అభివృద్ధి చెందిందని ,
తెలంగాణా పోరాటం ఎంత సబబో కాశ్మీర్ పోరాటం అంతే సబబని --- డంకా వాయించి చెబుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తి నట్లు గా మిన్న కుండటం చాలా ప్రమాదకరం .
దేశానికి ,ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా అదుపు చేయ వలసిన బాధ్యత కేంద్రానిదే . 

Wednesday 3 September 2014

తస్మాత్ జాగ్రత్త

   అందరూ ఉహిస్తు న్నట్లు విజయవాడ ప్రాంతం హైదరాబాద్ లాగా భూమికి సమాంతరం గా వ్యాపించదు .
ఎందు కంటే కొత్తగా  భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు .
నదీ తీరానికి ఎదురుగా ప్రభుత్వ భూము లున్న చోట ,బహుళ అంతస్తుల ప్రభుత్వ పరిపాలనా భవనాలు,
రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు ఇళ్ళు ,కొన్ని విద్య, విద్యాలయాలు వస్తాయి .

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం గా అభివృద్ధి చెందా  లంటే డబ్బు ఒక్కటే సరిపోదు ,
సరిపడా ప్రయాణికుల డిమాండ్ ఉండాలి .
అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఉన్నప్పుడే అది సాధ్య పడుతుంది .

అటు రాయల సీమ,ఇటు విశాఖ ప్రాంతాలు ఉద్యోగ కల్పనలో ,పరిశ్రమల స్థాపనలో  దూసుకు పోతాయి .
ముఖ్యం గా ఐ. టి .,ఫార్మా ,సినీ పరిశ్రమలు విశాఖ లోనూ ; హార్డ్ వేర్ ,సాఫ్ట్ వేర్ ,ఇతర భారీ పరిశ్రమలన్నీ బంగలొర్ కి ,మద్రాస్ కి దగ్గరున్న అనంతపురం , చిత్తూర్ ,తిరుపతి,కర్నూల్ ప్రాంతాలలో స్థా పించే అవకాశాలు హెచ్చు గా ఉన్నాయి .
విజయవాడ ,గుంటూరు ప్రాంతాలు కేవలం పరిపా లనా విభాగాల కే పరిమితమవుతుంది . అంటే నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది . సుమారు 10వేల మంది ఉద్యోగులు కొత్తగా రాజధానికి వస్తారు ,కాబట్టి అపార్ట్మెంట్ ల కు అద్దెలు పెరుగుతాయి .
ఏది ఏమైనా ,హైదరాబాద్ మాదిరి వత్తిడి ఉండదు .
అనవసర మైన స్పెక్యు లేషన్ తో దళారులు  రియల్ ఎస్టేట్ బుడగ ని అమాంతం గా
పెంచు  కొంటూ పో తున్నారు .
విజయవాడ కి 20 కిలోమీటర్ ల దూరం లో  ఎకరా భూమి సుమారు
6 నుండి 10 కోట్లకి పెంచి చెబుతున్నారు . అంటే ,గజం 25000/-లెక్కన
అమ్ముదామని చూస్తున్నారు .
ఇలాగే ప్రజలు వ్యవహరిస్తే ,ఇప్పుడు భూములపై  పెట్టుబడి పెట్టే వాళ్ళు నిండా మునుగుతారు .