Search This Blog

Sunday 31 August 2014

మోడీ మాజిక్

తొలి 100 రోజు ల్లో కొత్త ప్రధాన మంత్రి మన దేశానికి చేసిన పని ,
 దిశా నిర్దేశం ఎలా ఉంది ?

1. ఇంతదాకా చిన్న చిన్న ఉద్యోగులకే పరిమిత మైన  అనగా కేవలం  రూ.6,500 లోపు జీతం ఉన్న ఉద్యోగుల కే అవకాశ మున్న EPF, ఇప్పుడు ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఈ పరిమితి రూ.15,000కు పెరుగుతుంది. దీనివల్ల పదవీ విరమణ చేసిన ఉద్యోగుల నెలవారీ పెన్షన్‌లో కూడా పెరుగుదల ఉంటుంది.  EPF అంటే పదవీ విరమణ సమయానికి కొంత డబ్బు చేతికి వచ్చి, ఆ తర్వాత నెలవారీ పించన్ సౌకర్యం పొందడానికి ప్రతి ఉద్యోగీ తన జీతం లో కొంత భాగం మరియు యజమాని కూడా అంతే మొత్తాన్ని ప్రతి నెలా ప్రభుత్వ భవిష్య నిధి అనే పొదుపు ఖాతా లో పెడతారు . ఉదాహరణకు , 6500/- జీతం ఉన్న ఉద్యోగి తన వాటా గా  రూ.780 + అంతే మొత్తాన్ని యజమాని తన వాటాగా EPF  లో జమ చేస్తున్నారు. ఇప్పుడు 15000/జీతగాడు 1800/- + అంతే మొత్తాన్ని యజమాని తన వాటాగా EPF  లో జమ చేస్తారు . 

2. ఉ ద్యోగుల డిపాజిట్‌ మొత్తంతో అనుసంధానించిన బీమా (ఈడీఎల్‌ఐ) పథకం కింద ప్రస్తుతం అందిస్తున్న ప్రయోజనం సైతం ఇకపై రూ.1.56 లక్షల నుంచి రూ.3.6 లక్షలకు పెరగనుంది . 

3. ఇ న్నాళ్లూ చాలీ చాలని పింఛనుతో కాలం వెళ్లదీస్తున్న బడుగు కుటుంబాలకు పెద్ద ఊరట. చిరుద్యోగులుగా రిటైరై, కేవలం మూడు నాలుగు వందల పింఛనుతో అష్టకష్టాలు పడుతున్న మాజీలకు ఇకపై నెలకు కనీసం వెయ్యి రూపాయల మొత్తం పింఛనుగా అందనుంది. అలాగే భర్తను కోల్పోయిన వారికీ ఇకపై వెయ్యి రూపాయల గౌరవప్రదమైన పింఛను మొత్తం చేతికి రానుంది.
4. జన ధన యోజన :సామాన్యుడిని కూడా ఆర్ధిక ప్రగతిలో కలుపు కొని పోవడానికి ,ప్రతి భారతీయుడికీ ఒక బాంక్ ఖాతా ఉండాలని ,దానిద్వారా ప్రభుత్వ సంక్షేమ పధకాలకు సంబంధించిన నగదు బదిలీ ,ఉపాధి కూలీ, ఇంకా ఇతరత్రా సదుపాయాలూ , అలాగే కనీసం 5000/- అప్పు ,1లక్ష ప్రమాద భీమా ,ముందు ముందు ఆరోగ్య భీమా ,ఇంకా అనేక సదుపాయాలను ఎలాంటి దళారీల ,అధికారుల బెడద లేకుండా కల్పించ బడతాయి . 
   ఈ పధకం ద్వారా బాంక్ ఖాతాలు ,అలాగే ఎలాంటి బాంక్ అప్పులకు అర్హత లేని 
50 కోట్ల మందికి   కొత్తగా బాంక్ ఖాతాలు ఏర్పరు స్తారు . 

5.స్వచ్చ్ భారత్ :  దేశం లో సగం మంది అంటే  సుమారు 60 కోట్ల మంది  టాయిలెట్ లు వాడటం లేదు . సెల్ ఫోన్ లు మాత్రం వాడ తారు .  5ఏళ్లలో వీరందరికీ ప్రభుత్వ మే ఉచితం గా టాయి లెట్ లు కట్టాలని సంకల్పిం చింది . 
స్వచ్చ మైన శుద్ద మైన దేశమే  ఆరోగ్య ప్రదం  గా అభి వృద్ది చెందుతుంది . 

6.  వాణిజ్యం మె రుగుదలకోసం,ఐక మత్య అభివృద్ధి కోసం  పొరుగు దేశాలతో సఖ్యత . 

7. అగ్ర రాజ్యాలతో ముఖ్యం గా బ్రిక్స్ దేశాల సమాఖ్య లో కీలక పాత్ర, బ్రిక్స్ బాంక్ ఆవిష్కారం . 

8. ఫాస్ట్ ట్రాక్ పై వాణిజ్య ,పారిశ్రామిక ఉత్పాదకత అభివృద్ధి. 

9. ఉల్లి,ఆయిల్ , అలాగే అన్ని వస్తువుల రిటైల్ ధరల స్థిరీకరణ అతి పెద్ద విజయం . దీ ర్ఘకాలంలో ధరలను అదుపులో ఉంచేం దుకు ధరల స్థిరీకరణ నిధి.  

10.  కాశ్మీర్ పండిట్ ల కు పునరావాసం . 

11. డిజిటల్ భారత్ , 100 స్మార్ట్ సిటి పధకం, నల్ల ధానం వెలికి తీతకు సిట్ ,24/7 విద్యుత్ సరఫరా, 
జల,రోడ్,రైల్ పబ్లిక్ రవాణా  మెరుగుదల , రక్షణ పరికరాల ,రైలు వాగన్ ల తయారీలో విదేశీ పెట్టుబడుల కు స్వాగతం . 

12. మంత్రుల శాఖల పై ప్రధాన మంత్రి మంత్రి ఆఫీస్ కి పూర్తి  పట్టు . 

13.అనవసర దుబారా తగ్గించి నిర్ణయాలను వేగిర పరచడానికి మంత్రిత్వ శాఖల కుదింపు , మంత్రుల కమిటీల(GoM) రద్దు , ప్రణాలికా సంఘ రద్దు , ఆఫీస్ పని వేళ లను కటినం గా అమలు చేసి దస్త్రాలు త్వరగా కదిలే టట్లు చేయడం . 

14. అన్నింటి కంటే అతి ముఖ్యం -ప్రజలు అప్ప చెప్పిన బాధ్యతా ను ఎక్కడా ఎలాంటి తొందర లేకుండా ,హడావిడీ గందర గోళం కనబడ కుండా , సుక్షితుడైన సైనికుడిలా పధకాలను రచిస్తూ సాగిపోతున్న విధానం,గారంటీగా దేశానికి మంచి రోజులోచ్చాయనే నమ్మకం  కలిగిస్తుంది . 

Wednesday 20 August 2014

Clean India@Modi.

మనదేశం లో పల్లెలు పరి శుభ్రం గా ఉండా లన్నా , అంటువ్యాధులు అరికట్టా లన్నా ,
స్త్రీలపై అత్యాచారాలు నిరోధించా లన్నా, టాయిలెట్ ల కొరత తో ఇబ్బంది పడుతున్న ,
11కోట్ల కుటుంబాలకు, 1 లక్ష ప్రభుత్వ పాట శాలలకు, యుద్ద ప్రాతి పదిక పై  టాయిలెట్ లు
నిర్మించ డానికి సుమారు 2లక్షల కోట్లు కావాలి .
ఈ పధకం ఎంతో  మందికి ఉద్యోగ అవకాశాలు కలగ చేస్తుంది .
సిమెంట్ ,ఇటుక,శానిటరీ  పరిశ్రమలకు గట్టి ఊతమ్ ఇస్తుంది .
ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందా లంటే ఈ క్రింది షరతులు పెట్టాలి.
1.టాయిలెట్స్,సెప్టిక్ టాంక్ ఉండి, విధి గా వాడకంలో ఉండాలి.
2.కానుపు సమయంలో సమాచారాన్ని ప్రాధమిక వైద్య  కేంద్రంలొ నమోదు చేయాలి.
3.విధిగా కాయగూరలు ఇంట్లో పండించాలి.

Sunday 17 August 2014

The leader of New state ???

నాయకుడికి,ముఖ్యం గా ప్రభుత్వం నడిపే వారికి సమస్య ల పై ఖచ్చిత మైన అవగాహన,
ముందు చూపు ,విజ్ఞత , ప్రజల పై అభిమానం ఉండాలి .

కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు,మీడియాలో కొద్ది కాలం పాటు సంచలనం కలి గించే  ప్రకటనలు , ప్రజలను వర్గాలుగా చీల్చి ఒక రి పై ఒకరిని ఉసి కొల్పే చర్యలు -ఇవన్నీ ఆ నాయకుడిని ,పార్టీని కొంతకాలం అందలం ఎక్కించ వచ్చేమో గానీ,ప్రజలు అష్ట కష్టాలు పడి భవిష్యత్ లో సాధారణ జన జీవన స్రవంతి కి దూర మవుతారు .
అంటే ఒక తిక్కర్ నాయకుడి వలన కోట్ల మంది ప్రజలు తమ అవకాశాలను కోల్పోతారు .
 వారి భవిష్యత్ ప్రమాదం లో పడుతుంది .

ముందుగా ప్రకటన చేయడం, ఆ తర్వాత వివరణ ఇచ్చుకోవడం, ఆ పిమ్మట సవరించుకోవడం . 
 ఇప్పటి వరకు శ్రీ కేసీఆర్‌ తీసుకున్న 13 నిర్ణయాల్లో తడబాటు తప్ప, ఎందులోనూ స్పష్టత, 
కచ్చితత్వం కనిపించడం లేదు . కేవలం రెచ్చ గొట్టే ధోరణి ,రాజ్యాంగ ము పై అవగాహనా రాహిత్యం 
కనిపిస్తుంది . 

ఏమనిపిస్తుం దంటే ఒక వర్గాన్ని ఒక ప్రకటనతో బెదరించి ,వారి తో లాలూచీ పడతు న్నా రేమో అనిపిస్తుంది . 
కేంద్రం తో గొడవ పెట్టు కోవడం , కేంద్రానికి మిగతా రాష్ట్ర ముఖ్య మంత్రులకి ఉత్తరాలు రాసి పలుచన అవ్వడం 
అవసర మైతే తెలంగాణ పౌర ముద్రికలు బట్వాడా చేసి ఒక కొత్త దేశం లెక్క అమాయక ప్రజలలో దేశ ద్రోహ భావాలను పెచ్చ రిల్ల  చేయడం - ఇవన్నీ చౌకబారు రాజకీయ విన్యాసాలు తప్ప , మంచి నాయకత్వ లక్షణాలు మాత్రం కావు . 


 పేకాట క్లబ్బులను నడవనివ్వమని చెప్పారు
 ప్లేబాయ్‌లాంటి క్లబ్బులకు అనుమతి ఇచ్చారు
 వాహనాల నెంబర్ల మార్పు అన్నారు
 అమలు చేయడం లేదంటూ కోర్టుకు వివరణ ఇచ్చారు! 
 అక్రమ కట్టడాలను సహించేది లేదని కొన్నిటిని కూల్చివేశారు
 ఇప్పుడు కూల్చివేతలపై ముందుకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు
 సమగ్ర కుటుంబ సర్వేలో అందరూ వివరాలు చెప్పాల్సిందేనని చెప్పారు
 కాదు.. కాదు.. స్వచ్ఛందమని కోర్టుకు వివరణ ఇచ్చారు! 
 మెట్రో రైలు పనులు సాగనివ్వమని చెప్పి
మళ్లీ పనులకు పచ్చజెండా ఊపారని, పైగా 200 కిలోమీటర్ల వరకు పొడిగిస్తామంటున్నారని గుర్తు చేశారు 
 విద్యార్థులందరికీ ఫీజులు చెల్లిస్తామని, ఎంత మొత్తమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
 ఇప్పుడేమో లేని పోని నిబంధనలు విధిస్తున్నారు’
 రాష్ట్ర విభజన బిల్లుని పూర్తిగా సమర్ధిమ్చారు. 
 ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు . 

Tuesday 12 August 2014

వ్యవసాయ భారతం

స్వాతంత్రం వచ్చిన ప్పటి  నుండి ఇప్పటి వరకు  గణాంకాలు పరిశీలిస్తే , రైతులు(అనగా అంతో ఇంతో భూమి ఉన్న వారు) జనాభా లో 50% నుండి  25% కి తగ్గిపోయారు .
అంటే సంఖ్యా పరం గా 7 కోట్ల నుండి 12 కోట్ల కి  రైతులు పెరిగినా జనాభా పరం గా చూస్తే వారి శాతం సగానికి పడిపోయింది .

ఇదే కాలం లో ,రైతు కూలీలు అనగా వ్యవసాయ పై ఆధార పడి  పని చేసే వారు 20% నుండి క్రమం గా పెరుగుతూ ఇప్పుడు 30% ఉన్నారు . అంటే  రైతు కూలీలు సుమారు 3 కోట్ల నుండి 14 కోట్లకు పెరిగారు .

అంటే మన దేశం లో రైతులు క్రమం గా తమ భూములను కోల్పోయి , రైతు కూలీలుగా ఆర్ధిక నిచ్చెన లో క్రిందకు జారి పోతున్నారు .

గడిచిన దశాబ్దం లో ముఖ్యం గా కాంగ్రెస్ పాలించిన 10 ఏళ్లలో  కొత్తగా 4 కోట్ల మంది, ఆర్ధిక స్థితులు దిగజారి రైతు కూలీలు గా మారారు .
మొత్తం మన రైతు మరియు రైతు కూలీల సం ఖ్య 26 కోట్లు మాత్రమే . అంటే జనాభా లో కేవలం 22% వ్యవసాయ రంగం లో పని చేస్తున్నారు .

వ్యవసాయం రంగం తో పాటు అనుబంధ శాఖ లైన పౌల్ట్రీ ,చేపలు ,డైరి ,పూలు పండ్ల  రంగం కూడా లెక్కిస్తే 60 కోట్ల మంది వీటి పై ఆధార పడి  ఉన్నారు .