Search This Blog

Friday 30 May 2014

రాజధాని పరం గా ,ఆదాయం పరం గా ,కాలేజీ సీట్ల పరం గా ,ఉద్యోగాల పరం గా ,విద్యుత్ కేటా యింపుల పరం గా ,ఆస్తులు అప్పుల పంపకాల పరం గా సీమాంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దండి ...

  • సెక్రటేరియట్ లో రాష్ట్ర కేడర్ పోస్ట్ లు ఎన్ని ఉన్నాయి ? కేవలం 4417 పోస్ట్ లు .
  • మొత్తం సంయుక్త రాష్ట్రం లో  రాష్ట్ర కేడర్ పోస్ట్ లు ఎన్ని ఉన్నాయి ? 90000 పోస్ట్ లు .
  • అన్ని పోస్ట్ ల లో ఉద్యోగులు ఉన్నారా ? లేరు . 27000 పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి .నికరం గా 47186 రాష్ట్ర కేడర్ ఉద్యోగులున్నారు . 

  • రాష్ట్ర కేడర్ ఉద్యోగులను ఎలా విభజించారు ? 24838 ఉద్యోగులను ఇప్పుడు ఎక్కడ ఎలా పనిచేస్తూ న్నారో అలాగే ఉంచారు . 12,361 మందిని కొత్త ఆంధ్రా కి , మిగతా  9,987 మందిని తెలంగాణా కి పంచారు . అంటే జనాభా ప్రాతి పధికన 58:42 నిష్పత్తిలో పంచారు . అనగా సుమారు 25000 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులకు కొత్త ఆంధ్ర రాజధానిలో నివాస సౌకర్యాలు ఏర్పరచాలి . 

  • మొత్తం సంయుక్త రాష్ట్రం లో  ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు ? 11 లక్షలు .
  • లోకల్ -నాన్ లోకల్  అని ఎలా నిర్ణ యిస్తారు ? వరుసగా 4 ఏళ్ళు ప్రాధమిక విద్య ( 4 నుండి 10 క్లాస్ వరకు) ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికి చెందినా వారిగా గుర్తిస్తారు .
  • నేటివిటి -స్వస్థలం ఎలా నిర్ణ యిస్తారు ? పుట్టిన ప్రదేశాన్ని బట్టి . తెలంగాణా ఉద్యోగులు నేటివిటి ని బేస్ చేసుకొని విభ జించ మంటుంటే ,సీమాంధ్ర ఉద్యోగులు లోకల్ స్టేటస్ ని బట్టి విభ జించ మంటున్నారు .
  • రాజధానిలో ఎన్ని రకాల రాష్ట్ర కేడర్ పోస్ట్ లు / ఉద్యోగులు ఉంటారు ? 
సెక్రటేరియట్ , డైరెక్టరేట్ ,కార్పోరేషన్ లకు సంబంధించిన వారు .
  • సీమాంధ్ర ఉద్యోగులు ఎందుకు బాధ పడుతున్నారు ?
10ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఉండే అనుమతి ఉన్నా , కొత్త సీమాంధ్ర ముఖ్య మంత్రి వేరే చోట రాజధాని నిర్మాణం చేస్తే , సొంత ఇళ్ళు వదిలేసి కొత్త రాజ ధాని కి  వెళ్లి పోవలసిందే అని .

జనాభాని బట్టి ఆస్తులు అప్పులు పంచారు . కానీ విద్యుత్ ని మాత్రం వాడకాన్ని బట్టి పంచుతున్నారు ! ఇదెక్కడి న్యాయం ? 
ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 16000 MW విద్యుత్ మరియు కొత్తగా రాబోయే విద్యుత్ ప్రాజెక్ట్ ల ద్వారా ఉత్పత్తి అయ్యే 4000 MW ల విద్యుత్   లో 54 % తెలంగాణ కి ,46% ఆంద్ర కి ఇస్తున్నారు .
అలాగే అంతర్ రాష్ట్ర కరెంటు సరఫరా ని ఏ  విధం గా ఆజమాయిషీ చేయాలో కేంద్రం చెప్పడం లేదు . ఇది ఇరు రాష్ట్రాల మధ్య గొడవలకు దారి తీస్తుంది . 

అటు విద్యా సంస్థ ల పంపకాలలో కూడా ఆంద్ర కి అన్యాయం జరుగుతుంది . 

ఇప్పటికే తెలంగాణా లో ఉన్న అంతర్జాతీయ   స్థాయి   విద్యా సంస్థలు - ISB,NALSAR,NIFT ,ICFAI  -లాంటివి కొత్త సీమాన్ధ్రలో ఏర్పరచా లంటే ఎంతో  సమయం,డబ్బు కావాలి .

కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు తప్పుకి చెల్లించిన మూల్యం అధికారం కోల్పోవడమే . కానీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య రాచేసిన రావణ కాష్టం కారణం గా , త రతరాల తెలుగు సోదరుల బతుకు బండ లవుతుం ది.
ఇది రాజకీయ నాయకుల వికృత క్రీడ . 

Thursday 29 May 2014

శ్రీ కేసీఆర్ కి చిన్న మెమో

1. రాష్ట్రాన్ని విడదీయా లంటే  రాష్ట్ర చట్టసభల ఆమోదం, అభిప్రాయం సేకరించాల్సి ఉంటుందని ... ఆ తర్వాతే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించాల్సి ఉంటుందని - ఆంద్ర రాష్ట్రాన్ని దారుణం గా విడ గొట్టినప్పుడు సోయ లేదా    శ్రీ కేసీఆర్ గారు ?
2. ఇంకా అధికారికం గా తెలంగాణ ఏర్పడ లేదు . కాబట్టి తెలంగాణ  చట్ట సభ ఆమోదం అనే ప్రశ్న ఎక్కడిది సర్  ? 
3. సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని గేలి చేసి మీ పబ్బం గడుపు కొన్నప్పుడు రాజ్యాంగం గుర్తు రాలే  శ్రీ కేసీఆర్ గారు ?
4. సమైఖ్యాన్ధ్రుల లక్షల కోట్ల  కష్టార్జితం హైదరాబాద్ నుండి ఉన్నఫళం  గా సీమాన్ద్రులను వెళ్ళ గొట్టాలనే  పిలుపు నిచ్చిన మీ కు గిరిజనులను గురించి మాట్లాడే అర్హత ఉందా శ్రీ కేసీఆర్ ?
5. హైదరాబాద్ లోని  150 మండలాలు దోచుకొని మీసాల్ మెలేసి న మీరు, పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్ దృష్టి లో కేవలం 7 మండలాలను ఆంధ్రలో కలిపితే, సూదిమొన ప్రాంతాన్ని కూడా వదలుకోమని శత్రు దేశం లెక్క హుంకరిస్తారా  శ్రీ కేసీఆర్ ?
6. సరే సుప్రీం కోర్ట్ కి వెళ్ళి తేలుస్తానంటున్నారు ...అలాగే చేద్దాం. మెజారిటీ ప్రజలను వారి రాజధాని నుండి ఎలా తరిమేస్తారో ,10  ఏళ్ల  పాటు మాత్రమే హైదరాబాద్ ఉమ్మది రాజధాని ఎలా చేస్తారో,ఆంధ్ర ప్రదేశ్ అస్సెంబ్లి ఆమోదం లేకుండా రాష్త్రాన్ని ఎందుకు చీల్చారో అది కూడా తేలుద్దాం .

Saturday 24 May 2014

An open letter to Sri Narender damodardas Modi -PM-INDIA.

Respected sir
i wish,the history of our nation takes a turn for good, with your  presence in the seat of PM. Mahatma gandhi and many stalwarts of our nation including abdul kalam ji proclaimed about gram swarajya'. 
In this context and out of eagerness,i submit my suggestions humbly for your kind consideration as follows.


1. commissioning of "mobile farm produce buying vehicle" manned with quality checking machine,smart  phone to display the current market movements. this vehicle -(a lorry) can commute to the farm fields and there it self the person belonging to concerned authority can buy the produce after explaining the current market trends and govt's supporting price,etc... and make payment by check on the spot and enter the transaction details in the smart phone to send it to the district and state server.
it will prevent the hard hassles now faced by farmers at market yards.
2. construction of paddy&pulses storing granary(prefabricated using HD plastic or cement),mini cold storage kiosks in each and every village with the partnership of "village farmers commune" or NGO or in Public private partnership.
3. seed procurement at village level by "village farmers commune".
4.establishing the house or micro-industries in every village depending on the availability of resources- mills dealing with pulses,paddy,cotton,maize,jowar,millets,red chilly,coconut,etc...
5. Forming  "village workers commune" in every village to be contacted by farmers,industrialists and NREGE for their work.
6. consider and study for the prospects to establish"PURA"s in every mandal/taluk.(Sri A.P.J.Abdul kalam ji's suggestion)
7.DWACRA, village workers commune and village farmers commune can amalgamate as one society to run microfinance,mutual benefit schemes and enter in to various types of insurances as group- crop,health,life,childrens education,disaster loss,etc...
8.commissioning of chain of mobile virtual labs for school&college students.
9. commissioning of healthcare on net (Mobi-health) -telemedicine- telediagnostics,teleinterpretation,teletreatment to facilitate right medicine in right time at the doorsteps of the people.
10.All PHC s must be manned by 3 MBBS doctors,1 Dentist, 1 AYUSH physician, 6 ANMs, 3 MPHW,x-ray technician,lab technician and 3 nurses and having storage facility for blood,essential medicines,vaccines and facilities for emergency resuscitation.
11. school children can participate/involve to get hands-on training in farm field work,post office,banks,hospitals,police stations,market yard,near by industries to develop awareness and aptitude.
12. the colleges near to villages, can monitor the parameters of village development  and the collegiates can submit their monthly or quarterly reports to near by mandal or district authorities.
13.commissioning of renewable energy resources' in every village - solar,wind mill,biomass,tidal,biodiesel -depending on availability and cost index.
14.free distribution of LED bulbs to all households in village.free commissioning of capacitors and remote monitors using simple cheap  feature phone for all agri pump sets.
15.using hydrophonics technology every village household can grow fodder crop in their houseyards.the govt can create the awareness and distribute the needy equipment at 50% subsidised cost.
16.Control and Regularise all statues (except of freedom fighters and renowned persons of yester era) erected in our country  on or after 1975, by slapping Rs.1000/- per anum.
Thank you

Friday 23 May 2014

పోలవరం ..నిజమ్ గా వర మేనా ?

కృష్ణమ్మ ని గోదారి తల్లిని ముడి వేసే ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ , అదేనండి  'పోలవరం వలన లాభం ఉందా ? 
నౌకా యానం తో పాటు అన్ని ప్రయోజనాలు ఒన కూడే టట్లు దీని డిజైన్ మార్చి ఇంకా చౌకలో ,తక్కువ సమయం లో  పూర్తీ చేసే అవకాశం ఉందా ? 
అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవ్ తుంది ?
ఈ ప్రాజెక్ట్ వలన ఎవరు ఎలా ప్రభావితం అవుతారు ?

నష్ట పోయే వారు : 

  • ఎగువ పాటు లో ఉన్న 3 రాష్ట్రాల వారు - ఒడిశా ,చత్తీస్ ఘడ్ మరియు ఖమ్మం జిల్లాలో (తెలంగాణా ) ఉన్న భూభాగం ముంపు వలన కొండ రెడ్లు నిర్వాసితు లవ్వడమే కాదు వారి తరతరాల జీవనోపాధిని కూడా కోల్పోతారు.
  • గత కొంత కాలం గా ఏటికి ఏడు ,వరద నీరు అపరిమితం గా పోటెత్త డం వలన మట్టి తో కట్ట బోయే పోలవరం డాం వలన ,దిగువన ఉన్న గోదావరి డెల్టా వారికి ముంపు ప్రమాదం . 

లబ్ది పొందే వారు :

  • గోదావరి ,కృష్ణా డెల్టా పొలాలకు రబీ కాలం లో నికరమైన సాగు నీరు లభ్యత .
  • రాయలసీమకి కొద్దిగా సాగునీరు ,వైజాగ్ కి త్రాగు నీరు ,పరిశ్రమలకు నీరు లభ్యత .
  • ఆంద్ర రాష్ట్రానికి 1000 MW విద్యుత్ లభ్యత . 
  • గోదావరి లో నౌకా యాన వృద్ది . 

కొన్ని ప్రశ్నలు ?

  • 18000 కోట్లకి బదులు  కేవలం  8000 కోట్లతో నే ,ఎలాంటి ముంపు సమస్యలు , అంతర రాష్ట్ర వివాదాలు లేకుండా , పోలవరం ప్రయోజనాలు అన్నీ ఒన కూడితే ఎవరి కైనా అభ్యంతరమా ?
  • 75 TMC ల నీరు నిలవ చేసే మట్టి డాం కన్నా 30 TMC ల నీరు నిల్వ ఉంచే 3 చిన్న బారేజీలు కట్టుకొని కూడా అన్ని ప్రయోజనాలు చక్కగా చౌకలో ,తక్కువ సమయం లో పొందే అవకాశం ఉంటే ఎవరైనా వదులు కొంటారా ?
  • 750 km పొడవు ఉన్న గోదావరి నది పై ఒక క్రమ పద్దతిలో చిన్న చిన్న బారేజీలు కడితే ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు పోరుపెడుతున్నా కేవలం కాంట్రాక్ట్ పనులను పందేరం చేయడానికి భారీ డాం లు ప్లాన్ చేశారా ? 
  • ఉదాహరణకు ,అమెరికాలోని మిసిసిపి నది పై 27 బారేజీలు కట్టి  భారీ నౌకా యానం కూడా అమలు చేస్తున్నారు .అలాగే గోదావరి పై కూడా 3 బారేజీలు ఎందుకు కట్ట కూడదు ? 
మరి కొంత సమాచారం :

  • ప్రాజెక్ట్ స్థలానికి అనుమతి ? - 2005 లో వచ్చింది . 
  • పర్యావరణ అనుమతి ? - 2005 లో వచ్చింది . 
  • పాపికొండల అభయారణ్యం అనుమతి ? - 2005 లో వచ్చింది . 
  • గిరిజనులకు  నష్ట పరిహారం ,భూమి,ఇళ్ళు ,ఉపాధి చూపే అనుమతి(R&R CLEARANCE ) ? - 2007 లో వచ్చింది . 
  • కేంద్ర నీటి యాజమాయిషీ (central water commission )అనుమతి ? -2009  లో వచ్చింది . 
  • ప్రాజెక్ట్ పై పెట్టుబడికి ప్లానింగ్ కమిషన్ అనుమతి - 2009 లో వచ్చింది(25.02.2009 for Rs. 10151.04 Crore ). 
  • చత్తీస్ గడ్ , ఒడిశా లో ముంపు ప్రాంతాల ప్రజల సాధక బాధలను విని(public hearings) ,ఆయా ప్రాంతాలలో వరద గట్లు (flood banks) పటిష్టం చేసే   దెప్పుడు ? - చత్తీస్ గడ్ , ఒడిశా ఒప్పు కొన్నప్పుడు  . 
  • ప్రాజెక్ట్ కి ఎంత  ఖర్చు అవుతుంది ? - 16000 కోట్లు . 
  •  గత 10ఏళ్లలో జరిగిన కాల్వల పనులకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు ?- 4000 కోట్లు 
  • ప్రాజెక్ట్ లో చేయ వలసిన పనులే మిటి ?- 75 TMC ల నీళ్ళు నిల్వ చేయడానికి గోదావరి నది కి అడ్డుగా 45 మీటర్ల ఎత్తు ,సుమారు 2 km పొడవు డాం , దీనికి అనుబంధం గా 1000 MW విద్యుత్ ఉత్పాదన , కుడి ఎడమ కాల్వ ల ద్వారా గోదావరి ,విశాఖ జిల్లా లలోని 7 లక్షల ఎకరాలకు గారం టీ నీరు ,అలాగే ప్రకాశం బారేజి కి  80 TMC ల నీరు . 
  • ఎంత మంది నిర్వాసితు లవుతున్నారు ? - సుమారు 250 గ్రామాలు, 2 లక్షల జనం డాం వలన ; 15000 ఇళ్ళు 50000 జనం కాల్వల వలన నిర్వాసితులు అవుతారు . 
  •  మీరు చెపుతున్న 7లక్షల ఎకరాలలో మూడొంతుల భూమికి అంటే  5లక్షల ఎకరాలకు ఆల్రెడీ 1999 నుండిసాగు నీరు అందుతుంది గదా ? మరి ఇంత  ఖర్చు పెట్టి కడుతున్న ఈ ప్రాజెక్ట్ వలన కొత్తగా  ఏమైనా లాభం ఉందంటారా ? -కుడి కాల్వ ద్వారాసుమారు 1 లక్ష ఎకరాలకు కొత్తగా సాగునీరు, మరో  2లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ; ఎడమ కాల్వ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ;
  • ఇప్పటికే , పుష్కరం ,తాడిపూడి ,చాగల్నాడు ,ఏలేరు ,తొర్రిగెడ్డ  పంపింగ్ స్కీమ్ ల ద్వారా సాగు చేయ బడుతున్న గోదావరి ,విశాఖ పొలాలకు గారంటీ సాగునీరు అందే అవకాశం . 
  • ఏది ఏమైనా డాం మాత్రం  ఉదృతం గా వచ్చే వరద నీటి( మాక్సిమం 250,000 cumecs ) ని తట్టు కొనే విధం గా ఉండాలి . కానీ ప్రస్తుత డిజైన్ మాత్రం కేవలం 10000 cumecs  కి సరిపోతుంది . ప్రభుత్వం ఈ  విషయం సరి చూసుకోవాలి . అలాగే డిజైన్ మార్చి తక్కువ వ్యయం ,తక్కువ టైం లో అన్ని ప్రయోజనాలతో ప్రాజెక్ట్ పూర్తి అయ్యే అవకాశం ఉందేమో మరొక్కసారి సాంకేతిక నిపుణులతో ఆలోచించాలి. 

Wednesday 21 May 2014

శివోహం ... చిదంబరం

File:Chidambaram Shiva.jpg 

ఈ మధ్య నేను చిదంబరం వెళ్లి నటరాజ స్వామిని దర్శనం చేసుకొన్నా .
పై నున్న చిత్రం లో 'సత్య జ్ఞాన సుందర ఆనంద స్థితికి'  నటరాజ ఆకార మిచ్చి ,శక్తి కి శివకామి అని పేరు పెట్టి , నిరాకానికి గుర్తుగా ఓ చిన్న స్ఫటిక లింగం,  ప్రక్కనే ఉన్న బిల్వ దళ పరివేష్టిత యంత్రమే ఆకాశ తత్వానికి సంకేతం గా అన్వయించి- కొలిచే గర్భా లయ విమానం బంగారు పూతతో  ప్రకాశిస్తూ పొన్నాంబలం గా వినుతి కెక్కింది . 
ఇంకా వ్యాఘ్ర పాదుడు ,పతంజలి మహర్షి సన్నుతి చేస్తుం టే ,నటరాజు అవిద్య ని అదిమి,  ఇచ్చ -జ్ఞాన - క్రియా శక్తి రూపమైన శివకామి తో కలిసి ఈ సకల  చరాచర సృష్టి ని పుట్టిస్తూ ,పోషిస్తూ ,లయం చేస్తూ జనన మరణ మోక్ష చక్రాన్ని నడుపుతున్నాడు . 

మీకు తెలుసు ,తమిళ నాడు అంటే శివ మయం . 63 నాయ నార్లు , 18 సిద్ధ పురుషులు ప్రకటిత మై అణువ ణువు శివోహం గా సన్నుతి చేసిన పుణ్య దేశం .
 సంగమ కాలం లో ని  సంగం సాహిత్యం లో  ముఖ్యం గా సంబంధర్,సుందర్,అప్పర్  వ్రాసిన  తేవారం , అలాగే మాణిక్య వాచికర్ వ్రాసిన తిరువాచికం లో చిదంబర నటరాజ స్వామి  స్తోత్రం లు   ఉంటాయి .

 పంచ భూత లింగాల వరుసలో చిదంబరం ఆకాశ తత్వాన్ని ప్రభోదిస్తుం ది .
కాళ హస్తి ,కంచి , చిదంబరం గుళ్ళు మూడు ఒకే వరుసలో ( a straight line exactly at 79 degree 41 minutes East longitude ,other wise called as divine axis) ఉంటాయి . 
ఈ భూ మండలం లో కొన్ని ప్రదేశాలు దైవ శక్తి కి ప్రేరణా మరియు ప్రకటిత మయ్యె స్థలాలుగా ఉంటాయి . 
అలాంటి శక్తి స్థానముల నే 'తీర్ధములు ' అంటాము. 

అమాయకత్వం వేరు . అవిద్య వేరు . సరళం గా చెప్పా లంటే మూర్ఖత్వమే అవిద్య .
ప్రతి విషయములో  అహం తో మమేక మవ్వడం అవిద్య .
మన కళ్ళకు కనిపించేదే సత్యం అనుకోవడం అవిద్య .

  మన మూల ప్రక్రుతి సత్య జ్ఞాన ఆనందం అనీ , మిగతావన్నీ మన మనస్సు (-మాయ) ఆడించే కల్పితాలనీ తెలుసుకోవడమే శ్రీవిద్య .
'దుఃఖాలన్నీ కల్పితాలే.., ఆనందమొక్కటే సత్యం'. 
కల్పితాలంటే మనిషి కావాలని(మాయలో పడి ,మొహం లో పడి ,బంధం లో చిక్కి ) చేసినవి. తన స్వార్థంతో, విద్వేషంతో కుత్సిత బుద్ధితో, క్రూర మనస్తత్వంతో చేసినవి . 
శివం :
ప్రతి పర మాణువు , అలాగే క్వార్క్ లు ఇవన్నీ నిత్యమూ స్పందన లోనే ఉంటాయి . 
శక్తిని ధరించి శక్తిని పంచి ఈ సర్వ సృష్టి స్థితి లయములకు ఆది మూలం పరమ శివుడు . 
ధ్వని శక్తి , కాంతి శక్తి , స్థితి శక్తి ,గతి - చలన శక్తి ,ఐస్కాంత శక్తి ,విద్యుత్ శక్తి , ఫోటాన్ శక్తి ,అణు శక్తి -ఇవన్నీ వేర్వేరు గా స్పందించే స్పందనలే . 
శివారాధన ?
శరణా గతి లేని ప్రార్ధనలు ,ఆరాధనలు , క్రతువులు,మంత్ర సాధన ,జప తపాలు అన్నీ నిరర్ధకం . 
వాటి వల్ల మోక్షం కలుగదు. 
హిందూ దేవాలయాల్లో శుభ్రత ? 
 ఏ గుడి చూసినా ,ఆ గుళ్ళకు ఎన్ని మడులు మాన్యాలున్నా శుచీ శుభ్రత లేకుంటే సామాన్యుడికి నచ్చదు . 
ఆధ్యాత్మిక మార్గం లో ఉన్న వారికి ఎలాగున్నా నచ్చుతుంది . ఎందు కంటే వారు చూసేది వేరు . 
40 ఎకరాలలో కొలువై  ఉన్న చిదంబర దేవాలయం స్వామికి 5000 ఎకరాల పొలం ఉంది. 

నిజమైన భక్తుడు దైవం పట్ల తన కృతజ్ఞత ని ప్రకటించు కోవడానికి గుడికి వస్తాడు. ఆ కృతజ్ఞతా భావా న్నే భక్తి అంటాము .  
ప్రార్ధన ,నాట్యం ,సంగీతం ,పంచోపచార పూజ ఇలా వివిధ పద్దతుల (ఆగమ శాస్త్ర విధానాలు లేదా వైదిక క్రతువులు) లో తనలోని భక్తీ ని శరణా గతి భావం తో సమర్పణ చేస్తాడు . 
చిదంబరం లో దీక్షితార్ లు అనే వారు ఆలయ పర్య వేక్షకులుగా ,పూజార్లుగా వైదిక పద్దతి లో స్వామిని సేవిస్తారు. 

అర్ధ క్రాంతి !

ప్రజలను ఎంత గా కష్ట పెట్ట వచ్చో ,దేశాన్ని  ఎంత అధ్వాన్నం గా  పాలించ వచ్చో , వ్యవస్థని ఎంతగా నాశనం చేయ వచ్చో మీరు తెలుసు కోవాలంటే -గడచిన 10 ఏళ్లలో మీరొక్క సారైనా భారత దేశం వచ్చి ఉంటే చాలు .

ప్రాంతీయ వేర్పాటు వాదాలు ,అవినీతి కుంభ కోణాలు  పేట్రేగి  దేశ సమగ్రతకే ఎసరు తెచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు,
పతన మవుతున్న రూపాయ్ , రాకెట్ లా దూసుకు పోతున్న ధరలు ,నిరుద్యోగం ,కుంగి కునారిల్లుతున్న యువత - ఇవన్నీ ఒక మార్పు -ఒక క్రాంతి ,కోరుకొన్నాయ్ .

ఆ మార్పు వస్తుందని , తమ జీవితాలలో క్రాంతి వెల్లి   విరుస్తుంద ని  ప్రగాడ నమ్మకం కలిగించే  పార్టీని అందలం ఎక్కించ డా నికి 80 కోట్ల ఓటర్లు ముఖ్యం గా 12 కోట్ల మంది యువత   ఉవ్విళ్ళూ రుతున్నారు .

అన్నా హజారే నడిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమం , నయా లొహ్ పురుష్ మోడీ  కలిగించిన నమ్మకం  పునాది వేసాయ్ .
ఇక జరగవలసిన కార్యక్రమం చూద్దాం . 
ప్రభుత్వం  ఏటా సబ్సిడీల రూపం లో ఆయిల్ కి 13లక్షల కోట్లు ,విద్యుత్ కి 4 లక్షల కోట్లు , ఎరువులకు 6 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది . అయినా ,70శాతం పల్లెలు ఇంకా బయోమాస్ నే వాడుతున్నాయ్ .
40 శాతం ప్రజల కు ,నేటికీ కిరోసిన్ దీపాలే గతి .

పేద వారు ఎంత మంది ఉన్నారు ? వారి కి కూడు -గుడ్డ - నీడ కల్పించ దానికి ఎంత కావాలి ? ఎంత మంది కి  విలువలతో కూడిన ప్రాధమిక విద్య  (up to 7th class) , మంచి ప్రాధమిక వైద్యం , సత్వర న్యాయం అందు బాటులో ఉంది ? అనే నిఖార్సైన లెక్కలు వేయాలి .
6 లక్షల గ్రామాలు , 600 జిల్లాలు గా ఉన్న విభిన్న భారత్ కి  ఒకే అభివృద్ధి ఫార్ములా సరిపోదు .
ప్రతి జిల్లాకి ఆయా  ప్రాంత భూ , పంట ,ఖనిజ ,మానవ వనరుల ప్రాతి పాదిక పై ఒక ఫధకం తయార్ చేయాలి .
ఉదాహరణకు ఆహార భద్రతా పేరుతో ఏటా 1 లక్ష కోట్లు కేటాయించి అందులో కేవలం 50 వేల కోట్లు పేదల ఆహారానికి ఖర్చు పెట్టి మిగతాది మింగే ద్దా మనే దౌర్భాగ్యపు ఎత్తుగడ కాంగ్రెస్ ప్రభుత్వానిది .
సరైన లెక్క లుంటే ఇలాంటి దోపిడీని అరి కట్ట వచ్చు .
అలాగే పోషకాహార లోపం అనేది మన దేశం లో ప్రమాద కర మైన రీతి లో ఉంది . దీనికి కారణం ఆహార కొరత ఒక్కటే కాదు , సరైన శుభ్రత లేక పోవడం , బహిరంగ మల విసర్జన , దానితో కలిగే ఇన్ఫెక్షన్ ల వల్ల తిన్నది వంట బట్టక పోవడం ...

ఎనర్జీ స్వయం సమృద్ధి ఉంటేనే అర్ధ క్రాంతి . 
విద్యుత్ లేక పోతే ఉత్పత్తి లేదు . 
1965 వరకు చైనా ,భారత్ ఒకే స్థితి లో ఉండేవి . అప్పటి నుండి చైనా - భారీ,మధ్య ,కుటీర  పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడి గా పెంచు కొంటూ ప్రపంచం లో ఉన్న గాస్, ఆయిల్ వనరులను చౌక ధరల కే దొరక బుచ్చుకొని జాతీయ స్థూల ఉత్పత్తి ని పరుగులు పెట్టిస్తుం టే ,భారత్, సేవా రంగం లో నే చతికిల పడి వ్యవసాయ ,పారిశ్రామిక రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎనర్జీ స్వయం సమృద్ది ని గాలికి వదిలేసింది .

బర్మా అంగోలా , కజకిస్తాన్ లలో ఆయిల్ నిక్షేపాలను చౌకగా స్వాధీనం చేసుకొన్న చైనా ,
పాకిస్తాన్ ,ఇరాన్ లలో ఓడ రేవులు నిర్మించడానికి కూడా  ఆర్ధిక సాయం చేసి గాస్ సరఫరాకి మార్గం సుగమం చేసు కొంటుంటే, మన దేశం  ఈసురో మంటూ సంస్కరణలు పేర పిల్లి మొగ్గలేస్తుంది .

ఏటా కోటి మంది యువత ఉద్యోగాల మార్కెట్ కి వస్తున్నారు . కానీ మన దేశం లో అత్యంత ఆకర్షణీయ సేవా రంగం  కేవలం 20 లక్షల మంది కి మాత్రమే ఉద్యోగాలు ఇస్తుంది .
గత పదేళ్ళలో కేవలం 50 లక్షల మంది కి మాత్రమే ఉద్యోగాలు దొరికాయి .


భవిష్యత్ భారతానికి అణు విద్యుతే దిక్కు అని చిన్న పిల్లోడికి కూడా తెలుసు .
 అణు ప్రమాద ము వస్తే పరికరాలు సరఫరా చేసిన సంస్థలే బాధ్యత వహించా లనే చట్టం మనం పెట్టు కోవడం వలన ,ఏ  కంపనీ ముందుకు రావడం లేదు .

అర్ధం కాని విషయం ఏమిటీ అంటే ,మన దేశానికి వనరుల కొరత లేక పోయినా ఎందుకు వెనుక బడి ఉంది ?
సరైన దిశా నిర్దేశం చేసే నాయకులు లేకనా ?
ఉన్న నిధులను ,వనరులను దొంగ చాటుగా విదేశాలకు ఐయిన కాడికి తెగ నమ్మేసి ప్రజలను ,వ్యవస్థలను లూటీ చేస్తున్న అధికార నాయక గణా ల ధన దాహమా ?
అపారమైన బొగ్గు , తరగని ధోరియం , 3మిలియన్ చ కిమీ ల లో  గాస్ నిల్వలు ,సౌర విద్యుత్ కి పనికి వచ్చే భూ ప్రాంతం , మేధా వులు , మానవ వనరులు - ఇన్ని ఉన్నా మన బద్ధకం ,మూర్ఖత్వం , స్వార్ధం  ముందు పనికి రాకుండా పోతున్నాయ్ .

వనరులు  ఎప్పుడు , ఎట్లా ఉపయోగించాలో తెలిసేది మార్కెట్ కదలికల బట్టే గానీ , ప్రభుత్వ పాలసీల ద్వారా కాదు .
గనులు,ఆయిల్ ,గాస్ ,ఖనిజాలు - వీటిని తవ్వి ప్రాసెస్స్ చేసి వినియోగిం చాలీ అంటే, పెట్టుబడి , సాంకేతిక నైపుణ్యం చాలా అవసరం . ఇవన్నీ ప్రైవేట్ రంగం లోనే సాధ్యం  గానీ ప్ర భు త్వ రంగం లో సాధ్యం కాని పని .
Therefore, it is necessary to expand production capacities by allowing private participation. 
Given the right mix of incentives, market forces will usher in new capital and technologies for fuel extraction, carbon sequestration, and gasification.
 "ఇంధన వనరుల ఉత్పత్తి -సరఫరా -ధరల నియంత్రణ  సంఘం " అనేది స్వయం సంచలిత అధికారాలతో ,ప్రపంచ ఇంధన రంగ కదలికలకు అనుగుణ్యం గా ,ఎలాంటి రాజకీయ వత్తిళ్ళ ప్రమేయం లేకుండా పని చేసిన నాడు 125 కోట్ల మందికీ  అర్ధ క్రాంతి ఫలితాలు అందుతాయి . 

Monday 19 May 2014

ఒకే పౌర చట్టం అత్యంత అవసరం .

అందరి అంచనాలనూ అందుకొంటూ ,మరికొందరి ఆశ లను అడియాసలు చేస్తూ సీమాంధ్ర ఓటర్లు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం .
అనాధలా  మిగిలిన రాష్ట్ర పునర్నిర్మాణం , అవినీతిరహిత సమ సమాజం ,చేతి నిండా  పని,కడుపుకి కూడు ,నిలవడానికి గూడు ,నిరుద్యోగులకు , వృద్దులకు పెన్షన్ లు - ఈ కోరికలన్నీ ఈడేర తాయనే కొండంత ఆశ తో ఇక్కడ చంద్ర బాబు కి ,అక్కడ 'నమో' కి పగ్గాలు ఒప్ప చెప్పారు .

రికార్డ్ స్థాయి లో 26కోట్ల టన్నుల ఆహార ధాన్యాలే  కాదు, పదేళ్ళు ప్రతి పక్షం లో రేయనకా పగలనకా కష్ట పడ్డ రాజకీయ సైనికుడి కలల   పంట కూడా పండింది .
అంతే కాదు ,120 కోట్ల భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు కూడా వచ్చ్చెశా యి .
మోడీ అంటే మోత . మోడీ తోనే మోక్షం - ఇదీ నేటి భారతం . 
ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరును బిజెపి గత సెప్టెంబర్‌లో ప్రకటించిన నాటి నుంచి భారత మార్కెట్‌లోకి ఎఫ్ఐఐలు లక్ష కోట్ల రూపాయలకు పైబడిన పెట్టుబడులు తెచ్చారు . మోడీ మంత్రంతో సెన్సెక్స్ 2014 సంవత్సరం ముగిసే నాటికి 29 వేలకు చేరుతుందని,  మోదీ పెట్టుబడుల వాతావరణాన్ని పునరుజ్జీవింపచేయడం ఖాయమని అందరి ఆశ . 

విభిన్న  ఆచారాలు , పద్దతులు   ఆచరించే వివిధ మానవ సమూహాలు ఒకే త్రాటి పై నిలబడి సమాజం లో పురోగమించ  లంటే ఒకే పౌర చట్టం అత్యంత అవసరం . 
వివాహం,సంతానం , వారసత్వం ,విడాకులు -ఇవన్నీ సున్నిత మైన విషయాలు . వీటిలో సమానత తెస్తే సమాజం లో తేడాలు భేదాలు తగ్గి అందరూ ఒక్కటే అనే భావం వెల్లివిరుస్తుంది . 
ఉదాహరణకు ,గోవా రాష్ట్రం లో ఇదే చేశారు . 
Goa is the only state to have implemented the directive principle on the Uniform Civil Code and converted it into a law called the Goa Civil Code or the Goa Family Law.  It is the set of civil laws that governs all the Goans irrespective of the religion or the ethnicity to which they belong. 

లింగ వివక్షత , స్త్రీ అణచివేత సమసిపోవాలన్నా ,
దేశం లో ఉన్న విభిన్న మతాల వారు సౌహార్ద్రత తో కలిసి జీవించాలన్నా ,
దేశ జనాభా స్థిరీక రింప బడాలన్నా ,
దేశ జాతీయోత్పత్తి సమాన నిష్పత్తిలో పంచ బడాలన్నా  -
అందరికీ ఒకే పౌర చట్టం - కుల మతాలకు అతీతం గా భారత పౌరులకు- సమాన హక్కులు , సరిసమాన బాధ్యతలు ఉండాలి . 


Some reject Uniform Civil Code,saying no religion can dictate others. Point of UCC is not to divide by religion,but to unite by nationality.

Monday 12 May 2014

రైతన్న లారా ఏకం కండి

మనదేశం బాగు పడా లన్నా , మన రైతు సుఖ పడా లన్నా రైతులందరూ గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సంఘటితం అవ్వాలి . 

గ్రామీణ రైతు సంఘం తో , ప్రభుత్వమూ ,ప్రైవేట్ సంస్థలు కలిసి  చేయవలసన కనీస విధి విధానాలు . 

1గ్రామీణ  విత్తన శుద్ది ,విత్తన విక్రయ కేంద్రాలు
2. గ్రామీణ ధాన్యం గిడ్డంగులు
3. గ్రామీణ ధాన్యం నాణ్యతా పరీక్ష మరియు రాష్ట్ర వ్యాప్త మార్కెట్ ధర వరలు తెలిపే అంతర్జాల కేంద్రం
4. మొబైల్ ధాన్య విక్రయ వాహనం  - రైతు కల్లం వద్ద కే విక్రయ వాహనం వచ్చి ,అక్కడే ధాన్య నాణ్యత  పరీక్ష చేసి , రైతుకి మార్కెట్ ధర ,ప్రభుత్వ ధర గురించి అవగాహన కలుగ చేసి చెల్లింపులు కూడా అక్కడే పూర్తీ చేయాలి .
5. ఆయా గ్రామాలలో ఏ రైతు దగ్గర ఎంత ధాన్యం ఏ ఏ ధరకి కొనుగోలు చేసిందీ పూర్తీ వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర సర్వర్ కి ఫీడ్ చేయాలి .
6. ప్రక్రుతి సేద్యం , ఆర్గానిక్ సేద్యం , సాగునీటి పొదుపు ,జీవాల పెంపకం , పంట మార్పిడి ,వాణిజ్య పంటల సాగు ,సమగ్ర వ్యవసాయ పద్దతులు మొదలగు ప్రక్రుతి సమతుల్యతా విధానాలను (cost effective and ecosafe methods) ప్రతి రైతుకి చేలోనే శిక్షణ ఇచ్చే వ్యవస్థని ఏర్పాటు చేయాలి .
7. రైతు పండించే పంటలో 30శాతాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసు కొనే వెసులు బాటు ప్రభుత్వం , ప్రైవేట్ సంస్థల భాగ స్వామ్యం తో కలుగ చేయాలి .
8. ప్రతి గ్రామంలో ఆయా పంటల ఉత్పత్తులకు విలువ జోడించే(value addition) కుటీర పరిశ్రమలు - కారం,ధాన్యం ,పిండి ,పప్పుల మిల్లులు ,బెల్లం ,ఖండసారి , ప్రత్తి జిన్నింగ్ ,మొక్కజొన్న వలిచే యంత్రాలు , తృణ  ధాన్యాలను శుభ్రం చేసి ప్యాక్ చే యడం .
9. ప్రతి విద్యార్ధి 30రోజులు వ్యవసాయంలో ప్రత్యక్షం గా పాల్గొనాలి .
10.ప్రతి  కాలేజీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పై న చెప్పుకొన్న విధి  విధానాలు సవ్యం గా అమలు అయ్యే టట్లు మానిటర్ చేయాలి .

Saturday 10 May 2014

దరిద్ర దోపిడీ భారతం లో కొన్ని కోలా వెర్రి ప్రశ్నలు ...

మన దేశంలో  బంగార మే , కాదు బంగారు మనుషులున్నారు . అవును నల్ల బంగారం ,నల్ల నోట్లు అన్నీ కలిపి స్విస్ బాంక్ ల్లో దాచి దేశాన్ని అడ్డం గా నిలువు గా కోసుకు తింటున్నారు .
ఆదాయ పన్ను లెక్కల ప్రకారం , 120 కోట్ల భారత దేశం లో కేవలం 600 మంది కి మాత్రమే 100 కోట్ల పైబడి సంపద ఉంది .

మన దేశం లో 30కోట్ల మంది రైతులు పండించే పంటని ,అమెరికాలో కేవలం 9లక్షల రైతులు పండిస్తున్నారు .
రైతుకి కేజీ చె రకుకి 2/-రూపాయలు ఇచ్చి ,పంచదారని 40కేజీ /- కి అమ్ముతున్నా
ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన భూ స్వాదీన చట్టముతో రైతుల భూమి లాక్కుం టున్నా
ఏటా అర లక్ష రైతులు ప్రాణాలు తీసుకొంటున్నా
రైతుల పేరు చెప్పి బాంక్ లకు, శీతల గిడ్డంగులకు లక్షల కోట్లు దోచి పెడుతున్నా ----
                    మన రైతులు, ప్ర భుత్వాలను ఎందుకు నిలదియ్యరు? 

 పనిచేసే సత్తువా ఉన్న 30కోట్ల మంది  పనీ, పాటా - ఉద్యోగం, సద్యోగం లేదు .
రోజు కి  కనీసం  10రూపాయలు సంపాదన లేని వాళ్ళు  ఇంకా 20కోట్ల మంది ఉన్నారు .
ప్రపంచ బాంక్ దృష్టి లో 75 కోట్ల మంది ఇండియన్స్ రోజు వారీ ఆదాయం 50 రూపాయలు కూ డా లేదు .
మురికి వాడ లలో ఇంకా 10కోట్ల మంది కునారిల్లు తున్నారు .
(As per Multi-dimensional Poverty Index (MPI), About 645 million people or 55% of India’s population is poor as measured by this composite indicator made up of ten markers of education, health and standard of living achievement levels.)

మరి , ఏటా 100 రోజుల ఉపాధి హామీ పధకం పేరుతో 50 వేల కోట్లు ,
ఉచిత ఆహార పధకం పేరుతో లక్ష కోట్లు -ఖర్చు పెడుతున్న ప్రభుత్వ సొమ్ము ఏమవు తుంది ? 

 మన దేశ రుణాలు ,జాతీయ స్థూల  ఉత్పత్తి ని మించి పోతున్నా ,
హవాలా ద్వారా   దేశం దాటి న  నల్ల డబ్బు పార్టిసి పేటరీ నోటు  రూపం లో తెల్లగా మారి షేర్ మార్కెట్  కి వస్తున్నా ---- 
స్విస్స్ బాంకు ల్లో మూలుగుతున్న భార తీయుల దొం గ  డబ్బు  సుమారు 1500 బిలియన్ డాలర్ లు ఎప్పు డ య్యా  స్వాధీనం చేసు   కొంటారు ? 


Thursday 8 May 2014

జగమెరిగిన దోపిడీ జనానికి బురిడీ




మన్నూ మిన్నూ జనులూ గ నులూ
కాదేదీ లూటీ కనర్హం
జన్మ భూమిని దోచేసి  నే ల తల్లిని పిండేసి 
వ్యవస్థలను అవస్థల పాలుచేసి
అణగారిన బతుకుల్లో ఆణువణువూ ఆరగించి
తగుదునమ్మా ఓ దార్చ వచ్చి ఓటు కూ డ ఊ డ్చేయగ
వస్తున్నాడోస్తున్నాడు .....

Tuesday 6 May 2014

సకల చరాచర సృష్టి ,మానవ సంబంధ బాంధవ్యాలు , మానవ జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞ - సర్వమూ విశ్వ చైతన్య లీల

అండపిండ బ్రహ్మాన్డాలతో  ,కృష్ణ బిలాలతో ,నెబ్యులాలతొ ,వాయుధూళి  తో నిరంతరం వ్యాపిస్తున్న ఈ సువిశాల అంతరిక్ష ము అలాగే ఈ విశ్వ సృష్టి వెనక ఎంతో తెలివైన చైతన్యము ఉందని ,విశ్వము ,మన మెదడు నిర్మాణం ఒకే రకం గా ఉందని నేడు శాస్త్ర వేత్తలు అంగీకరిస్తున్నారు .
మనం ఎలా ఐతే ఆలోచిస్తామో ,ఎలా ఐతే కల లు కంటామో -అలాగే విశ్వ చైతన్యం -అనగా మనం వ్యవహార పరం గా పిలిచుకొనే దేవుడు చేస్తున్న ఆలోచనలే -లీలలే- ఈ సువిశాల సృష్టి  -అని నేటి శాస్త్రజ్ఞులు ఒప్పుకొంటున్నారు .
Scientists always talk about consciousness being the underlying fabric of the universe from which all things emerge (M-theory, string theory, Unified Field Theory, etc. see work of Dr. Amit Goswami and Dr. John Hagelin). 
So not only is the fabric of the universe conscious like a brain, it is growing like a brain as well. 
But here’s a question…a brain to what? Is it possible we exist as a thought within the mind of some Super Intelligence? 
Are we just brain cells operating within a Cosmic Mind? Maybe, maybe not, but it’s fascinating to think about. - See more at: http://www.spiritscienceandmetaphysics.com/physicists-find-evidence-that-the-universe-is-a-giant-brain/#sthash.2McIOe3o.dpuf.

Researchers report in a new study  that they have found regions of the brain that seem to impact a person's level of spirituality. కానీ మనం తెలుసు కోవలసింది ఏమిటీ అంటే ,మన కారణ శరీరం అనగా మన సంచిత కర్మ వాసనా గుణాల బట్టే మన మెదడు రూపు దిద్దుకొంటుంది . 
యద్భావమ్ తద్భవతి . ముందు భావం -ఆ తర్వాత పదార్ధం . ముందు చైతన్యం - ఆ తర్వాత విశ్వ సృష్టి . 
ముందు కర్మ వాసనా కారణ శరీరం - తర్వాత మన పంచ భౌతిక శరీరం . 

లేవండి . మనలోని ప్రేమ జ్యోతిని జ్ఞానం తో వెలిగిద్దాం

ప్రస్థాన త్రయా లైన భగవద్గీత ,ఉపనిషత్ లు ,బ్రహ్మ సూత్రాలు ;
పంచ సంప్రదాయ భాష్య కారులు - మధ్వాచార్య ,రామానుజాచార్య ,వల్లభాచార్య ,నింబార్క ,శంకరాచార్యులు - నుడివిన పూర్ణ ప్రజ్ఞ భాష్యం ,శ్రీ భాష్యం,సర్వజ్ఞ భాష్యం,పారిజాత సౌరభ భాష్యం,శరీరక భాష్యం---- ఇవన్నీ భగవంతుడు   అనగా  సంపూర్ణ ప్రజ్ఞ - అని చెబుతూ జీవుడికి ,దేవుడికి మధ్యన ఉండీ లేనట్లు ఉన్న  సన్నటి గీత పైనే విబేదిస్తారు .
మనిషి ఎలా తి రగనియ్యి . అరిషద్వార్గాలతో ఎంతగా కు త కుత లాడనియ్యి . మరింతగా బ్రష్టు పట్టి పోనియ్ .
కాని చివరకు -రోజులు,ఏళ్ళు .యుగాలు- గడిచినాక అయినా -ఆ మనిషిలో -ఆ జీవిలో , ఉన్న ప్రేమైక దైవ స్వరూపాన్ని ఆవిష్క రించు కోక తప్పదు .
pure love of god is eternally situated in every one's heart and it only needs to be awakened!

Friday 2 May 2014

ఇదే యదార్ధం - తత్ సత్ -ఓం తత్సత్

 ఆత్మ అనగా అర్ధం ఏమిటి ?
సవిస్తార చైతన్య  సముద్రం లో ఓ చిన్న కెరటం ఆత్మ . 
శక్తి  కి త్రిగుణాలుంటాయి . మూడు గుణాలు సమ స్థితిలో  ఉండే శుద్ద స్వరూపం ఆత్మ .
అలాంటి స్థితిలో ఉన్న శక్తి లో గుణ సమ స్థితి తప్పినప్పుడు కలిగేది మాయ .
దానినే మనిషి లో మనస్సు అని అంటాము .
పదార్ధానికి  ఒక్క  ఆకర్షణ మాత్రమే ఉంటుంది .( గ్రహాలకు ,అణువులకు మధ్యన ఆకర్షణ )
కాని శక్తికి ఆకర్షణ ,వికర్షణ రెండూ  ఉంటాయి . ఈ  తత్వ మే శక్తి స్వరూపమైన మనస్సుకీ ఉంటుంది .
ఇదే ద్వందం . రాగము ద్వేషము ;సంకల్పము ,వికల్పము .

పదార్ధమే  పూర్తి  యదార్థం  కాదు .(either material or energy are  not absolute truth)
పదార్ధం , మనస్సు , ఆత్మ ఇవన్నీ కలిసి చైతన్యం లో ఇమిడి ఉంటాయి .
 అంటే చైతన్యమే యదార్ధం . అదే శుద్ద సత్యం .

                                 ధ్యాన సాధన - ధ్యాన స్థితి 
Be a witness:
భౌతిక విషయాలను , ఇంద్రియాల లో కలిగే స్పందనలను  సాక్షీభూతం గా గమనించడ మే సాధన . ఆ  విధం గా సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక క్షణం లో ధ్యానం సిదిస్తుం ది .
ఆ ధ్యాన స్థితి లో  యదార్ధ స్థితిని అనుభూతిస్తామ్ .
  ధ్యానం లో మనస్సు పని చేయదు . అలాంటప్పుడు అనుభూతి ఎలా కలుగుతుంది ?
పుట్టి బుద్దెరిగినాక మన దైనందిన వ్యవహారాలన్నీ మనస్సుతో చేస్తాము . మనస్సుతో అనుభూతిస్తాము. 
మనస్సు లేకపోవడం ,మనస్సుని అధిగమించడం అనేది మన అనుభవంలో లేనిది . 
ప్రతిదీ 'మనస్సు తో' అలవాటైన మనకు ఆత్మ గత అనుభూతి గురించి ఏమీ తెల్వదు . 
ఎంత చెప్పినా ,చదివినా ,ఉపన్యాసాలు విన్నా సాధన చేయకపోతే ఎప్పటికీ ఆత్మ ని గుర్తించ లేము . 

మన శరీరం , మనస్సు ,ప్రాణం  -ఇవన్నీ ఆత్మ ప్రకాశం వలనే పని చేస్తాయి .
ఆత్మ చైతన్యం తో నే మనస్సు పని చేస్తుంది . ఆత్మ ప్రకాశం తో నే ఆత్మను అనుభూతిం చడం ధ్యానం .
మనస్సు పని చేస్తే ద్వందం ఉంటుంది . మనస్సు పనిచెయ నప్పుడు మిగిలేది ఒక్కటే . అదే ఆత్మ . అదే చైతన్యం . అదే ఎరుక . అదే సత్ చిత్ ఆనందం . ఆ స్థితిలో చూడ బడేది ,చూసేది ,చూపు - ఇవన్నీ విడి విడి గా ఉండక అన్నీ కలిసి ఏకమవుతాయి .
మనస్సు పైన చిత్తం , దాని పైన బుద్ది ,దానికి పైన అహం - ఇలా పదార్ధం వివిధ స్థాయులలో స్పందనలు చేస్తుంది .
అరిషడ్వర్గాలు , సమస్త కోరికలు ,రాగ ద్వేషాలు అన్నీ మనస్సులోనే రూపు దిద్దుకొంటా యి . కానీ వీటికి మూలం చిత్తం లో ని వాసనలు ,తత్వాలు ,గుణాలు . కాబట్టి చిత్తాన్ని శుద్ది చేయకుండా మనస్సుని నియంత్రించు కొనే సాధనాలు ఎన్ని చేసినా సరైన ఫలితం ఉండదు .
చిత్తాన్ని ఎలా శుద్ది చేసుకోవాలి ? 
వివేకము తో కూడిన వైరాగ్య భావనలను, సాక్షీ త్వం ను  ప్రతిరోజూ ,ప్రతి క్షణమూ అభ్యాసం చేయాలి .
నవ విధ భక్తీ మార్గాలు కూడా చిత్తాన్ని శుద్ది చేస్తాయి .
ఎన్నో యుగాల నుండి పేరుకుపోయిన కర్మ వాసనలను సమూలం  గా భస్మం చేయాలి .
సాక్షీ భూత కర్మాచరణ ,కర్మ ఫల అనాసక్తి వలన మనస్సులో స్పందనలు తగ్గుతాయి . చిత్తం లో ఎలాంటి కర్మ పోగు పడదు .
ఎన్నో యోగ క్రియలు ,ఆసన ముద్రలు ,నాడీ శుద్ది క్రియలు ,ప్రాణ శుద్ది క్రియలు - ఇవన్నీ పంచ కోశ శు ద్దీకరణ లో భాగాలే .
చిత్త  శుద్ది  లేని శివ పూజ లేల ?భాండ శుద్ది లేని పాకమేల ?
కాబట్టి ముందు  చిత్త శుద్ది . తర్వాతే ఆత్మావిష్కరణ .
మోహం క్షయ మవ్వడమే మోక్షం .
అహం అణిగి సోహం గా మిగలటమే  శరణాగతి .
ఓం ప్రధమం మనకు శ్రద్ద ,ఓర్పు పుష్కలం గా ఉండాలి .


క్షత్రియ భారతం -మొదటి భాగం .

 సనాతన భారతావని లో  వేద కాలం లో 'కులము' అనే పదం లేదు . ఉన్నదల్లా వర్ణ మే . వర్ణ మనేది ఆయా మనుషుల గుణాలు , చేసే వ్రుత్తి ,ప్రవ్రుత్తి పైన ఆధారపడి యుండేది . అది కర్కశమ్ గా ఉండేది కాదు . శూ ద్ర వృత్తిలో ఉన్నా  వాడి సంతానం బ్రాహ్మణ్యం చేసుకోవచ్చు . వైశ్యుడు క్షత్రియుడి గా మార వచ్చు .
  • ప్రజలను కన్న  బిడ్డల మాదిరి పాలించి కాపాడే వాడు క్షత్రియుడు . 
  •  ఎలా బతికితే సుఖ సంతోషాలు ఉంటాయో  బుద్ది చెప్పి,పరానికి పనికొచ్చే ధర్మాలను చెప్పే వాడు బ్రాహ్మణుడు . 
  • అవసరాలకు కావలసిన వస్తు సామగ్రిని పైకానికి అందించే వాడు వైశ్యుడు . 
  • పాడి  - పంట పండించి , పనులు చేసే వాడు శూద్రుడు . 
  • పరం కోసం ,సత్య శోధనకి మౌనం గా తపం చేసుకొనే వారు మునులు . 
  • శాస్త్రాలను శోధించి , నిజాలను కనిపెట్టి సామాన్యులకు వాటి ఫలాలను అందించే వారు ఋషులు . 
  • విద్య అంగడి సరుకు కాదు . 
  • అన్నం అమ్మే వస్తువు కాదు . - ఇదీ వేద కాలం నాటి సంఘ స్థితి . 
భారత వర్షం అంటే అటు రష్యా లోని ఓల్గా నదీ తీరం నుండి ఇటు మధ్య ఆసియా లోని టైగ్రిస్ యూఫ్రటిస్ తీరాలను చుట్టి  మన గంగా సింధు సరస్వతీ మైదానాల మీదుగా గోదావరి,కావేరి దాటి అటు బ్రహ్మ పుత్రా , బర్మా లోని ఇరావతి , ఇండోనేసియా లోని బాలి ,కాలిమంతాన్ నదుల మీదుగా కంబోడియా లోని మెకాంగ్ నది వరకు వ్యాపించి ఉన్న మహా ప్రాంతం .

ద్వాపర యుగపు ఆఖరి రోజులు . కలియుగం ఆరంభం లో జరిగిన మహా భారత యుద్ధం లో సమస్త భూమండలమ్ లోని క్షత్రియులు నశించి  పోగా ,బతికిఉన్న సైనికులు ,దళపతులు చిన్న చిన్న జన పదాలను ఆక్రమించుకొని రాజులుగా చెలామణీ అయ్యారు . కానీ వారికి రాజ నీ తి లో గానీ , రాజ ధర్మం పై గానీ ప్రవేశము లేదు . పట్టు లేదు .
బలవంతుడే రాజు . తెలివున్న వాడే అధికారి . కాస్త కండ ఉన్నోడే బంటు . 

 ఎప్పుడైతే రాజ ధర్మం నశించి , ఒక ధర్మం , పద్దతి లేని మనుషులు రాజులుగా - పాలకులుగా మారి రాజ ధర్మం తప్పి నప్పుడు , అలాగే సంఘం లోని ఇతర  వర్ణాల వారు కూడ ఆయా సంఘ నియమాలు పాటించ నప్పుడు ,బ్రాహ్మణ వర్ణం వారు తిండికి మాడి పోయారు . అప్పుడు ,కొందరు బ్రాహ్మణులు పొట్టకోసం అనేక నియమ నిష్టలు , వేద ప్రామాణికం కాని  క్రతువులు , మూడ నమ్మకాలు ప్రచారం చేసి ,వేదము లోని మర్మాలను ,జ్ఞానాన్ని కప్పిపుచ్చడానికి అవాకులు చెవాకులు ప్రవేశ పెట్టారు .
బ్రాహ్మణులు తప్ప మరే ఇతర వర్ణం వారు వేదాలు చదవకుండా అలాగే జ్ఞాన విజ్ఞాన ధార అందరికీ అందకుండా ఎన్నో తప్పుడు పనులు చేశారు .
ఎప్పుడైతే జ్హ్నాన  ధార పది మందికీ అందకుండా పోయిందో అప్పుడే భారత జాతి జవజీవాలు ఉడిగిపోయాయి .
ఒక జాతిని నిర్వీర్యం చేయా లంటే వారిని చంప వలసిన పని లేదు . వారికున్న జ్ఞాన సంపదను వారి తర్వాతి తరాలకు అం ద కుండా చేస్తే చాలు . 
విద్య లేని వాడు వింత పశువు అనే సామెత అలా వచ్చిందే . 
బల వంతపు మత మార్పిడులు చేసి భుజాలు చరచు కొనక్కర లేదు . 
మత గ్రంధాలను  అంద  కుండా  చేస్తే చాలు -ఆ మతం క్రమేణా కనుమరు గవుతుం ది. 

శాస్త్రాలు , వేదాలలోని నిజాలను మరుగు పరిచి కర్మ కాం డలు ప్రవేశ పెట్టి ఆనాటి జీవ సంపదను -గోవులు,మేకలు,బర్రెల ను -దానము రూపమ్ లో లేదా హోమ క్రతువుల బలి రూపం లో స్వీకరించే వారు .
సంఘ శాంతికి తోడ్పడ వలసిన వారి జ్ఞానం పక్క దారి పట్టి మొత్తం సంఘాన్ని బ్రష్టు పట్టించింది . విద్యని అమ్మకానికి పెట్టినది అప్పుడే .

మహా భారత యుద్ధం మొత్తం జాతిని, అప్పటికే బ్రష్టు పట్టిన వ్యవస్థను నాశనమ్ చేసింది .

పాలించే వారి ఆకృత్యాలు మితి మీరినప్పుడల్లా  భగ వంతుడు ఏదో ఒక రూపమ్ లో వచ్చి లెక్క సరిచేస్తాడు .

వేద కాలం నుండి క్షత్రియ ,బ్రాహ్మణ వర్ణాల మధ్య జరుగుతున్న ఆధి పత్య  పోరులో జరిగిన  సంఘటనలు భారత దేశ చరిత్ర ని రకరకాలుగా మార్చి వేశాయి .
సమాజం లో రెండు వర్గాల మధ్య పోరు నాడు ఉంది . నేడు ఉంది .ఎప్పుడూ ఉంటానే ఉంటుంది .
వేద కాలంలో  మొదటి స్థానం లో ఉన్న క్షత్రియులు క్రమం గా రెండో స్థానానికి జారారు . ఋగ్వేద కాలం లో పుట్టుకతో కాక , గుణాలను బట్టి వర్ణం ఉండేది .

త్రేతా యుగం లో పరశురాముడు క్షత్రియ వంశాలను సమూలము గా నిర్మూ లించిన తర్వాత ఏర్పడిన అరాచకాన్ని అరికట్టే టందుకు చేసిన హోమాగ్ని నుండి 4 రాజపుత్ర వంశాలు -పరమార్ ,చౌహాన్ , ఉద్భ వించాయి . వీరే రాజపుట్ క్షత్రియులు లేదా అగ్ని వంశ క్షత్రియులు .

ఆం ధ్ర  క్షత్రియులు :

క్రీస్తుశకం 2వ శతాబ్దం లో శాతవాహనుల  తర్వాత  ఉత్తరా పధ మునకు చెంది కాలక్రమం లో దక్షిణా పదానికి వలస వచ్చిన  ఇక్ష్వాకులనే వారు, వారి  రాజ్యాలను  కృష్ణా నదీతీరమైదానాలలో స్థాపించారు . నాగార్జున కొండ రాజధానిగా భట్టిప్రోలు ,జగ్గయ్య పేట ,అమరావతి ప్రాంతాలను పాలించారు .
వాయు పురాణమ్ ప్రకారం ఇక్ష్వాకు 100 మంది సంతానం లో 48 మంది దక్షిణా పదానికి వలస వచ్చి చిన్న చిన్న రాజ్యాలు స్థాపించు కొన్నారు .
 బౌద్ద జైన సాహిత్యాన్ని తిరగేసినా ,అస్మక ,ములక,వేంగి రాజ్యాలు, వీరు స్థాపించిన వే .

ఇక్ష్వాకుల తర్వాత శాలంకాయనులు పల్లవ సామంతులుగా కృష్ణా గోదావరి ప్రాంతాన్ని పెదవేగి రాజధానిగా పాలించారు . వీరి తర్వాత విష్ణుకుండినులు, మిగతా క్షత్రియ వంశా లైన పరిచేది ,కోట , చాళుక్యలు గుంటూరు గోదావరి ,కృష్ణా సీమలను 300 ఏళ్ళ  పాటు పాలించారు .(5 నుండి 7 శతాబ్దం వరకు ).

చంద్ర వంశ క్షత్రియులైన తూర్పు చాళుక్యులు నే వేంగి చాళుక్యులు గా  పిలిచే వారు . వీరు పూర్వమ్   శాతవాహనులకు సామంతులు గా ఉండే వారు . వీరు ఎలమంచిలి , పిఠాపురం , ముదిగొండ ప్రాంతాలను పాలించారు .

మత్స్య రాజులు ముఖ్యం గా మత్స్య ప్రాంతం అనగా నేటి ఒరిస్సా కి చెందినా వారు .

చేది రాజులు కోణ ప్రాంతం అనగా నేటి కోన సీమ ని పాలించారు . తర్వాత కాలం లో చాళుక్య చోళ రాజులకు సామంతులుగా మారి చోడ రాజులుగా వ్యావహ రింప బడ్డారు . వీరి గోత్రం కాశ్యపస .

కాలచూరి,హైహేయ రాజులు మధ్య భారతానికి చెందినవారు .

ధనంజయ గోత్రీకులైన కోట వంశపు రాజులు ధరణికోట ని రాజధానిగా చేసుకొని 11,12 శతాబ్దం లో పాలించారు .

చాగి లేదా సాగి వంశ రాజులు చాలా కాలం చాళుక్యులకు సామంతులుగా ఉండి పోయారు .
ఆ తర్వాత కాకతీయులు , తర్వాత విజయనగర రాయలు పెద్ద రాజ్యాలు పాలించారు . కానీ వీరు క్షత్రియ వర్ణం నకు చెందినవారు కాదు .