Search This Blog

Tuesday 3 December 2013

తల వంచిన భారతీయుడు

పాలకులు అవివివేకులు గా ఉండి ప్రజా వ్యతిరేక  నిర్ణయాలు తీసుకొంటే ఆ సమాజం బాగుపడి పురోగతి చెందు తుందా ? ఉదాహరణ కు మన దేశం లో  తెలివితక్కువ వ్యక్తులు కేంద్రం లో  కీలక స్థానాల్లో ఉన్నా, కీలక నిర్ణయాలు తెలివి తక్కువగా తీసుకుంటున్నా ఈ ప్రభుత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ముం దుకు సాగుతున్నాయన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. "మానవ చరిత్రలో వేలాది సంవత్సరాలు కొనసాగిన రాచరిక వ్యవస్థలో, అత్యధిక శాతం రాజులు అవివేకులే అయి ఉండేవారు. అయినా ఆయా రాజ్యాల పురోగతికి ఆ రాజుల అవివేకం అడ్డుకాలేదు''. 

కించిత్ పరిజ్ఞానం లేని,ఏ అంశాన్నీ అవగతం చేసుకోలేని , పైగా భారత సమాజం గురించి కనీస అవగాహన లేని,ఎటువంటి విలువలకూ కట్టుబడి ఉండాలన్న నిబద్ధత లేని  వ్యక్తులు ఇప్పుడు మన దేశాన్ని నిరంకుశం  గా పాలిస్తున్నారు . 
నిరం కుశ పాలకులు,అభద్రతా భావం ఎక్కువగా ఉన్న వ్యక్తులు , తన గొప్పదనాన్ని నిర్ధారించుకోవడానికి  ఎప్పు డూ బలహీనమైన వ్యక్తుల్ని, సులభమైన లక్ష్యాలను ఎంచుకొంటారు. ఫలితంగా ఎక్కడా ఎదురుదెబ్బతగిలే అవకాశం ఉండదు. దేశం లో అత్యంత బలహీనులు తెలుగు వారు . తెలుగు వారిని చీల్చి చెందాడు తున్నా ఎవరూ ఎదిరించ డం లేదు . 
ఈ విశాల భారతదేశంలో, సంక్లిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ కీలక అంశాలపై కనీస  అభిప్రాయాలు, ప్రజల జీవన పద్దతులు , విశ్వసించే విధానాలు,సమాజ నిర్మాణానికి అవసర మైన  సిద్ధాంతాలు -వీటి గురించి  అసలేమీ అవగాహన లేని నిరక్షర కుక్షి  - సనాతన పురాతన వేద భూమిని , వివిధ భాషలతో ,సంప్రదాయాలతో అలరారుతున్న ఒక అభి వృద్ది చెందుతున్న  దేశాన్ని రాచరిక నిరమ్కుశ పద్దతి లో పాలిస్తున్నా రంటే ,భారతీయులు ఎంతటి చేవ లేని సోమరి పోతులో తేట తెల్లమవుతుంది"-అని ప్రతి విదేశీయుడు చెప్పుకొంటున్నారు . 
అశోకుడు ,చంద్ర గుప్తుడు ,కృష్ణ రాయలు , మహాత్మా గాంధీ ,సర్దార్ పటేల్ పాలించిన ఈ  భూమి కి మళ్ళీ   మంగోల్, ఆఫ్ఘన్  ,మొగలాయీ ,బ్రిటిష్ ముష్కర్ల మాదిరి విదేశీ అరాచక పాలన దుస్థితి కలిగి నందుకు ప్రతి భారతీయుడు సిగ్గుతో తల దించు కోవాలి . 

Friday 15 November 2013

Sachin Hangs his boots...

It is hard for a player to concede it is all over.
 the skills not gone but faded to the point where domination is unlikely...

Domination for whose sake ?
A player when plays like as any other player in the team, can we afford to drop down that player ?
For get, the player’s credentials ,past history, awards & rewards.
Just see that player as any other ordinary team player. But not as demi god or genius.
When we see with high expectationary prism, our judgment will be blurred .



Sachin’s career has to be divided in to two phases.
One, when he has full confidence on his skill, young , with out any fitness problems ,and when he is in the pinch hitter post without any burden of expectations- that is 1989 to 1998..
It takes him almost 30 tests to pile an average of 50 runs/ inning !
After that he never looks back ,except for a momentary fitness lacunae and robustly maintaining an average of 55 runs /inning.

The second phase is when the team’s ‘weakness covering’ responsibility burdens him along with his own fitness problems from 1999 on wards.

When we talk about sachin, invariably have to discuss about averages and records, because he is in the habbit of establishing the records regularly. Apart from the records, he is in the position of piling the runs at the middle order position with out any guarnteed support of other team batsmen.
The compulsions, as a sure dependable batsman without any guaranteed support from other batsmen made him cut his flamboyance in his strokes and it leads to the most guarded display of skills.


The man in a “team game “ is as good as his team.

Certainly, we cant compare the batsmen of different teams on same scale as we couldn't of different eras .
Every team has certain weaknesses and to cover those short comings - some strategies has to plan, which have to be carried by senior responsible talented player in a team game.
As a opener in one day format, laying the foundation and piling of runs at good strike rate are necessary. What the team needs is good finisher /pinch hitter who has to 
Finish the game on a winning note. If its not happened,what is the value of the runs piled-up by the opener?  The value of those runs is used to be not noticed by common people.
So, let him play as long as his skill is on par with any younger cricketer .
We cant expect same higher standards from a player every time.
If any indian batsman plays better than him, definitely drop him from the team.
We are not here to judge other’ s life.
We are here for justness in all games with some fair amount of fashion & enjoyment.
"see the sachin as an ordinary player from now onwards."

IN 2005-06 :
On the other hand, his one-day average of these two years - 44.28, and 44.85 last year, are in fact higher than his career average of 44.05.


TEST RUN GETTING PROGRESS:
Tendulkar's progression to 11,000 Test runs is some what bumpy ride.

As Tendulkar's career summary shows, one of the highlights of his career has been his 
Consistency in the period between 2oth.test and 32nd.test and 45th.test to 96th.test. And from 112th.test to 122nd.test.
Clearly his decline of form from 123rd.test onwards glaringly noticed by one and all, as he takes almost 17 tests(28innings) to pile 1000 runs as like for his first 1000 runs.
So, one cycle is completed.
From 122nd. Test to 139th.test his average is dropped from 58 to 55.

We have to wait for positive play from his bat.

Saturday 9 November 2013

యోగ సాధన...

 మనిషి మనస్సు  ను ఎలా అర్ధం చేసు కోవాలి ?  
విశాల విశ్వమ్ లో అంతర్లీనం గా చైతన్యం ఉంటుంది . ఆ అవిచ్చిన్న చైతన్యపు సముద్రం లో  ఓ  శకలం మనస్సు.
మనస్సుని వ్యాపింప చెయ్యడ  మనగా, మనస్సు చుట్టూ ఉన్న బంధనాలని,మాయా మోహపు తెరలను తొలగించు కొని, సువిశాలచైతన్యాన్ని అనుభూతించ డ మే .   మనం ఉపయోగించే  మనస్సు (conscious mind )  చాలా తక్కువ . తెలియని మనస్సుని అంతర్ చైతన్యం ( subconscious and unconscious )అని పిలుస్తాము . యోగి కి అంతా కాన్షస్ మనస్సే .

మనస్సుని ఎలా వ్యాపింప చేయాలి? (how to raise  the Awareness) ?
నాడులను,చక్రాలను శుద్ది చేసుకోవాలి .
ఎలా ? 
ఆసనాల ద్వారా ,ప్రాణాయామం ద్వారా , (హట  యోగ) ;
సాత్విక మైన పద్దతుల ద్వారా మనస్సు  ను ఆధీనం చేసు కోవడం (రాజయోగ ) ద్వారా ...

ప్రాణాయామం లో జరిగేది ,ఒరిగేది ఏమిటి ? 
నీటిని కంట్రోల్ చేస్తూ  ఒక పద్దతిలో టర్బైన్ ల మీద నుండి  ప్రవహింప చేసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది . అదే విధం గా  ఒక పద్దతి లో  ఊపిరి తీస్తూ ,కుంభి స్తూ , వదులుతూ గాలిని,నాడీ చక్రాల పై ప్రవహింప చేసినప్పుడు ప్రాణ శక్తి పుడుతుంది . ఎంత శక్తి కావా లంటే అంతగా ప్రాణాయామం చేయాలి .
ఊపిరి ద్వారా ఊపిరి తిత్తులలో జరిగే ఆక్సిజన్ శోషణ ,తద్వారా జరిగే కణ ప్రక్రియలు గురించి చెప్పడం లేదు .
దీపానికి గాలి - అనగా ఆక్సిజన్ అవసరం . కానీ, ఆక్సిజన్  తో దీపం వెలగదు . ముందు అగ్గి పుల్లతో దీపం వెలిగించాలి . ప్రాణ శక్తి ఒక నిప్పు రవ్వ వలే పని చేస్తూ ఉంటుంది . మన చర్మం  కూడా ఆక్సిజన్  ని  పీల్చు కొంటుంది .  కనుక నే యోగులు కుంభకం లో ఉండి , బయటి గాలి (oxygen ) పై ఆధార పడ కుండా ప్రాణ శక్తి  ని ఆరిపోకుండా చేస్తూ  జీవిస్తారు .
సరే , హట యోగం ,రాజ యోగం ద్వారా శక్తిని పోగు చేసుకొని షట్ చక్రాలను ఉద్దీపనం చేస్తారు . దీనితో ఎలా కాన్షస్ నెస్  ని వ్యాపింప చేస్తారు ?
అంతర్ ముఖం గా మనిషి చేసే పయనం లో కావలసిన శక్తి  పై యోగాల ద్వారా సంపాదించు కొని ,సుషుమ్నా నాడి లో శక్తి సంచాలనం జరిపి తే ,మనస్సు  పరిధి పెరిగి అన్ని మితులలో (Dimensions)ఉన్న వాస్తవాలు అన్నీ అవగాహన లోకి వస్తాయి . ప్రస్తుతం మనకున్న జ్ఞానేంద్రియాలు సత్యాన్ని కొంత వరకే అర్ధం చేసు కోవడానికి పనికొస్తాయి . నిజ మైన సత్య అవగాహనకి కొత్త జ్ఞానేంద్రియాలు కావాలి . అపరిమిత మైన కాస్మిక్ శక్తి తో బంధం ఏర్పరచు కొని నిరాఘాటం గా శక్తిని పొందుతున్న ప్పుడు , ఆ శక్తి తరం గా లు గా సుషుమ్నా నాడి లో ప్రవహిస్తూ సహస్రార చక్రాన్ని చేరి నప్పుడు కలిగే జ్ఞానమే నిజమైన పూర్ణ మైన జ్ఞానం . అదే సత్యావిష్కరణ . అదే మోక్షం .
అది ఓ నిశ్చలా నంద స్థితి . 

Friday 8 November 2013

భారత దేశం హిందువులదే కాదు అందరిదీ ...

జనాభా లెక్కలు  పక్కన పెట్టి ,వాస్తవ ఇండియా ముఖ చిత్రం పరిశీలిస్తే , భారతీయులలో  70 శాతం మాత్ర మే హిందూ  మతాన్ని , 18 శాతం (23 కోట్లు )ముస్లిం మతాన్ని , 10శాతం (13కోట్లు) క్రీస్తు మతాన్ని , 2శాతం ఇతర మతాలను ఆచరిస్తున్నారు .
రా బోయే 30 ఏళ్ళలో హిందువులు బలహీన వర్గాలుగా మారినా ఆశ్చర్య పడ క్కర లేదు . ఇప్పటికే 7 రాష్ట్రాలలో హిందువులు బలహీన వర్గా ల జాబితా లో ఉన్నారు .
ముస్లింల  లో మూడు వంతులు  సున్నీలు  (70శాతం ) . వీరిలో బరేల్వి తెగ (సూఫీ శాఖ) వారు ఎక్కువ ఉన్నారు.

ధ్యానం ఎందుకు చేయాలి?

ధ్యానం ఎందుకు చేయాలి?
మనం రోజూ చేస్తున్న పనులను,నిర్వర్తిస్తున్న బాధ్యతలను ఇంకా బాగా చేయడానికి,మాన సంబంధాలలో మధురిమను పూర్తిగా పొందటానికి,సమాజం లో సమతుల్యతను పెంచడానికి శక్తి కావాలి.ఆ శక్తి నీకు నిరంతరం అందుబాట్లో ఉండాలంటే,ధ్యానం అనే ప్రక్రియ ద్వారా పొందవచ్చు.
ధ్యానం లొ ఏం జరుగుతుంది?
మనస్సు ఒక శక్తి ప్రవాహం. దాని కంపన స్థాయిని థీటా స్థాయికి అనగా 4 నుండి 7hz(frequency)  కి తీసుకు రాగలిగితే,అప్పుడు మనచుట్టూ ఉన్న అంతులేని కాస్మిక్ శక్తి ఎలాంటి నిరోధం లేకుండా మనలోకి ప్రవహిస్తుంది.అంటే,ఆలోచనలతో సతమత మయ్యే మనస్సు నిరోధం లాగా పనిచేస్తూంది.
కాస్మిక్ శక్తి  మనలోకి నాడులు,చక్రాల ద్వారా ప్రవహించాలి అంటే,అవి శుద్దం గా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలి.అందుకే, నాడీ చక్ర శుద్ది కోసం ప్రాణాయామం చేయాలి.
శక్తి   సంచాలనం బాగా జరిగితే  ఇంద్రియాల ద్వారా  ఎలా మనం బయటి ప్రపంచాన్ని అర్ధం చేసు కొంటున్నా మో  ,అదే విధం గా ,లోపలి ప్రపంచాన్ని ,ఇతర మితులలో (dimensions)ఉన్న వాస్తవాలను అర్ధం చేసుకోగలం . వీటినే అతీంద్రియ శక్తులు అని చెప్పు కొంటాం .
లోపలి వాస్తవాలు ఏమిటి ? 
అవి ఎవరికీ వారే తెలుసుకోవాలి.
శరీరం ఎంత వాస్తవ మో ఆత్మ కూడా  అంతే వాస్తవం . కనిపించే మన భౌతిక శరీరమే కాదు , ఇంకా మనకు అనేక శరీరాలు  పొరలు గా ఉన్నాయని, ఆత్మ  అనేది చివరి పొ ర  అని ,పంచ కోశ  శరీరం వాస్తవమని ,యోగులు చెప్పిన  ద్రిగ్ విషయాలను ధ్యానం లో నే తెలుసు కోగలం .
కానీ బాగా గుర్తుంచు కోవలసినది ఏమిటంటే , అతీంద్రియ శక్తులు గానీ ,పంచ కోశ శరీర జ్ఞానం గానీ మన లక్ష్యం కాదు . ఆత్మ జ్ఞానం  సాదించిన తర్వాత ఆత్మను పూర్తిగా కోల్పోవడం ఆఖరి మెట్టు .
మిధ్యా నేను - అనగా అహంకారం పూర్తిగా కరిగినప్పుడు ఆత్మ  అవగాహన కలుగుతుంది .
ఆత్మ  అవగాహన  కలిగిన వారు ఎలా ప్రవర్తిస్తారు ?
కరుణ,నిష్కామ సేవ ,ప్రశాంత చిత్తం -   ఇవన్నీ ఉంటాయి . 

Thursday 7 November 2013

కుజదోషం పట్టించు కోవద్దు.

 కుజ దోషం అనే మాట చాలా మంది మనస్సులో గుబులు పుట్టిస్తుంది .
 'కలౌ పరాశర ' అనేది పండితుల మాట. 
కాబటి ఈ కుజదోషం  విషయం లో ఎంత సత్యం ఉంది?ఎంత అపోహ ఉంది? అనేది తేల్చడానికి పరాశర సంహిత ఏం  చెప్పిందో చూద్దామ్.
1.లగ్నాత్ గానీ,చంద్ర లగ్నాత్ గానీ ,కుజుడు 1,4,7,8,12 స్తానా ల్లో ఉండి, ఎలాంటి శుభ గ్రహ సహవాసం లేదా దృష్టి లేక పోతే ,అప్పుడు మాత్రమే కుజ దోషం ఉన్నట్లు చెప్పాలి.
అలాగే కుజ దోషం రద్దు అయ్యే పరిస్థితులు- (Cancellation of Mars affliction)
అ. కుజుడు సొంత ఇంట్లో ( మేష,వృశ్చికం ) లేదా స్నేహితుల ఇంట్లో ( గురు,చంద్ర, రవి  కుజుని స్నేహితులు ,కాబట్టి ధనుస్సు,మీనం,కర్కాటకం , సింహ రాశులలో కుఝుడున్నప్పుడు దోషం లేదు .
ఆ . గురు,చంద్ర,శని,రాహు,బుధ,రవి -వీరి లో ఎవరితో అయినా కుజుడు  కలిసి ఉన్నప్పుడు ,
ఇ . కర్కాటక,సింహ లగ్నం వారికి కుజ దోషం ఉండదు .
ఈ . కుంభ లగ్న వారికి కుజుడు 4,8 స్థానాల్లో ఉన్నా ,
ఉ . లగ్నం లో గురు లేదా శుక్రుడున్నా ,
ఊ . కుజుడు అధిపతి గా ఉన్న వృశ్చిక,మేష రాశులను శని చూస్తున్నా ,--------   కుజ దోషం ఉండదు .

ఇన్ని సవరణలు ఉండ బట్టే, 90 శాతం జాతకా లలో కుజుడు 1,4,7,8,12 స్తానా ల్లో  ఉన్నా దోషం ఉండటం లేదు . 
గ్రహాల వలన దోషాలు రావు. జాతకుని కర్మ లోని  దోషాలను గ్రహాలు  సూచిస్తాయి . ఎలాగంటే , శరీరం లో వ్యాధి ఉంటే జ్వరం వస్తుంది . జ్వరం వలన వ్యాధి రాదు . జ్వరానికి మండేసుకొన్నా వ్యాధి తగ్గదు . అలాగే గ్రహానికి శాంతులు  చేసినా ఫలితాలు పూర్తిగా రావు . 
మరేం చేయాలి ?
 కారణ శరీరం లో నిబిడీకృతం గా ఉన్న కర్మ  దోషం భస్మం అవ్వాలంటే ,సాత్విక ఆహారం , సత్కర్మాచరణ ,సద్గ్రంధ పట న , దానం , ధ్యానం - ఇవి ఏదో కాసేపు చేసి వదిలేయకుండా , జీవన విధానం లో సమూ లామ్ గా ఆచరణ లో పెడితే ఎలాంటి దోషాలైనా  పోతాయి . 

Saturday 2 November 2013

ధ్యానం

ధ్యానం లో మనస్సుతో ఏమీ చేయం.మనస్సు పనిచేస్తే మనకు ఆలోచనలు,జ్ఞాపకాలు,స్మ్రుతులు,సంకల్పాలు, అలాగే అరిషడ్వర్గాలకు చెందిన స్పందనలు మెదులుతా ఉంటాయి.
ఏకాగ్రతలో మనస్సు పనిచేస్తుంది. ఒకే విషయం పై గాడం గా ఆలోచిస్తుంది.
నిద్రలొ కూడ మనస్సు పని చేస్తుంది. కలలు కనే సమయం లో జరిగిపోయిన వాటిని  నెమరు వేసుకొంటూ ఉంటుంది.అహం కూడ మిగిలే ఉంటుంది.జ్ఞాపకాలను ,సంఘటనల తీవ్రతను,భయాన్ని,కోరికలను బేరీజు వేసుకొని ఏది అవసరం,ఏది కాదు అనే పద్దతిలో ఒక క్రమంలో మన జ్ఞాపకా లేదా స్మ్రుతి సామర్ధ్యాన్ని సునిశితం చేస్తుంది .   గాడ నిద్రలో మనస్సు నెమ్మదిస్తుంది.కానీ అదే సమయం లో ఎలాంటి విషయ అవగాహన ఉండదు.

కానీ,ధ్యానం లో మనస్సు నెమ్మదిస్తుంది.అహం ఉండదు, సాక్షీత్వం ఉంటుంది.విషయ అవగాహన ఉంటుంది.

శారీరకం గా,మానసికం గా  అలసిఉన్నప్పుడే నిద్ర వస్తుంది. నిద్రని మనం నిర్వర్తించ లేము.నిద్ర ఒక దేహ క్రియ. అది మనలను ఆవహిస్తుంది.
ధ్యానం మనం ఆరోగ్యం గా మెలకువతో ఉనప్పుడు,శక్తి వంతం గా ఉన్నప్పుడు మనం చేయగలం. ధ్యానం లో ఎలాంటి సంకల్ప వికల్పాలు ఉండవు. కానీ ధ్యానాన్ని మనం ఒక సంకల్పం తోనే ప్రారంభిస్తాము.సంపూర్ణ ప్రశాంతత,ఇబ్బడి ముబ్బడి గా శక్తి వస్తుందని,ఈ శక్తి వలన మన కర్మ శరీరం  కూడ  శుద్ద మవుతుందని ధ్యానులు చెబుతారు.

శరీరాన్ని కంట్రోల్ చేయడానికి వ్యాయామాలు చేస్తాము.
ప్రాణ శక్తిని కంట్రోల్ చేయడానికి ప్రాణాయామం చేస్తాము.అలాగే,మనస్సుని కంట్రోల్ చేయడానికి ధ్యానం చేయాలి.

మనస్సు 1hz  నుండి 40 hz పౌన పున్య స్థాయుల్లో కంపిస్తూ ఉండే ఒక శక్తి ప్రవాహం.ఈ కంపనాలను 4hz కి తీసుకు రావడ మే ధ్యానం.మనస్సుని  ఎప్పుడూ 7hz లోపే ఉండేటట్లు చేయడం ధ్యానం.
దైనందిన విషయాలను,పనులను,బాధ్యతలను చేస్తూ వాటికి సంబంధించిన రాగ ద్వేషాలను  మనస్సుకి ఇంకించు కోకుండా మన పని మనం చేసుకోవడ మే ధ్యానం.
రాగ ద్వేషాలు    ఎప్పుడు ఉండవు? మనం చేస్తున్న కార్యాలతో మన అహం మిళిత మవ్వ కుండా ఉన్నప్పుడు.

 మన మనస్సు ఆలోచనల రూపం లో సమాచారాన్ని పంపుతుంది.
అలాగే అది వింటుంది కూడ.
సాధారణ మానవుడు ఎక్కువగా ఆలోచిస్తాడు గానీ వినడు . అలా వింటానికి చేసే ప్రయత్న మే ధ్యానం.

ఒక విద్యార్ధి శాంతంగా  ఉన్నప్పుడే చక్కగా వింటాడు . ఇంకా ప్రశాంతం గా ఉన్నప్పుడు అతనిలోని సృజనాత్మక త పెరిగి అతను  కళాకారుడు అవ్వుతాడు . ఈ  రెండు  దశల లో అహం ఉంటుంది . కాకపోతే సాత్విక ,రాజసిక స్థాయిలో ఉంటుంది . అదే విద్యార్ధి మనస్సు అత్యంత ప్రశాంతం గా,ప్రేమతో,ఎలాంటి రాగద్వేషాలు లేనప్పుడు అతనికి ధ్యానం సిద్దిస్తుంది .

మనసు ఆలోచించి నప్పుడు దాని శక్తి 12hz నుండి 40hz స్థాయిలో అనగా బీట పౌన పున్యం లో ఉంటుంది.
ధ్యానం లో 4hz నుండి 7hz (థీటా స్థాయి) ;
గాడ నిద్రలో 1hz నుండి 4 hz డెల్టా స్థాయిలో  ఉంటుంది.
బీటా కి ,థీటాకి  మధ్య స్థాయి ఆల్ఫా ది.

అనగా,డెల్టా మరియు థీటా స్థాయిలో మనస్సు వింటుంది.
మనిషి బీటా స్థాయి కి బాగా అలవాటు పడిపోయాడు.

మనిషికి నిద్ర రావాలంటే మనస్సు ప్రశాంతం గా ఉండాలి.
అలాగే ధ్యానం చేయాలన్నా మనస్సు ప్రశాంతం గా ఉండాలి.

భౌతిక అవసరాలతో సత మయ్యే వాళ్ళు రిలాక్స్ కాలేరు. అంటే డెల్టా,థీటా స్థాయికి మనస్సు వెళ్ళదు.
ఎలాంటి షరతులు లేకుండా మనిషి ప్రేమించ గలిగితే,గాడ మైన విశ్వాసం తోటి వారి పైన,తన పైన కలిగి ఉన్నప్పుడే గాడ మైన నిద్ర గానీ,ధ్యానం గానీ సాధ్య మవ్వుతుంది .

నిస్సంగత్వే నిర్మోహత్వమ్ 
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం 
నిశ్చల తత్వే జీవన్ ముక్తిహి 

Tuesday 29 October 2013

హిందూ సంస్కృతి అనేది ఒక్క భారత దేశానిదే కాదు,ఇది విశ్వానిది.

భారతీయులు ఆచరించే సంప్రదాయాలను హిందూ మతం  అని పిలవడం తప్పు. 
హిందువులకు మతం లేదు. ఉన్నదంతా మనిషి సుఖంగా,శాంతం గా ఎలా జీవించాలో తెలిపే జీవన విధానం. ఆ పద్దతి నే సంస్క్రుతం లో ధర్మం' అని పిలుచు కొంటాము.ఎప్పటి నుండో పురాతన కాలం నుండి ఉన్న సత్ ధర్మం  కాబట్టి సనాతన ధర్మం అని చెప్పుకొంటా ము .సింధు ప్రాంతపు ప్రజలు ఆచరించే ధర్మం కాబట్టి  పర దేశీయులు హిందూ మతం అని పిలుస్తున్నారు . 

ధర్మం, జీవన సూత్ర సంపుటి. మనిషి ఎప్పుడు ఎలా,ఏ విధం గా ప్రవర్తిస్తే వ్యక్తి తో పాటు వ్యవస్థ కూడ ఆనందం గా సమతుల్యత లో ఉంటుందో తెలిపేది హిందూ ధర్మం.
ఇది చాలా పురాతన మైనది. ఎన్నో వేల ఏళ్ళ క్రితం అనేక మంది మహర్షులు సంఘ గమనాన్ని,మనిషి బలం -బలహీనతలను,తద్వారా దేశ సౌభాగ్యం ఎలా పరివర్తనం చెందుతుంది- మొదలగు సాంఘిక,భౌతిక విషయాలను పరిశీలించి , వివేకం తో విచక్షణ చేసి, నిగ్గు తేల్చిన జీవిత విధానాలు, హిందూ ధర్మం గా పరివ్యాప్తి చెందింది.

 దీని నుండి,ఆయా దేశ,కాల మాన పరిస్థితులకు అనుగుణం గా ఆహార  అలవాట్లు,పండుగలు,నమ్మకాలు,ఆచారాలు,సంప్రదాయాలు వ్యాప్తి చెందాయి.

ప్రపంచం ఇలా దేశాలుగా విడిపోక ముందే,పరిణామ క్రమంలో హిందూ ధర్మం పుట్టి ,వ్యాప్తి చెందింది.
 సిద్దాంతం ఎంత మంచిదైనా, ఆయా మహర్షులు ఎంతగా తపించి  జీవన విధానాన్ని సూత్రాలుగా చెప్పినా,కాల క్రమం లో మానవ సమూహాలు ఆయా సంఘ అవసరాలకు అనుగుణ్యం గా  కొత్త కొత్త భాష్యాలు లేవదీస్తాయి. అలా ఏర్పడినవే, జైన,బుద్ద, వైష్ణవ,శైవ,శాక్తేయ,గాణ పత్య,ఆదిత్య, ఇస్లాం,యూదు,జొరాష్ట్రియన్,క్రీస్తు సూత్రాలు /మతాలు.

సూత్రాలకు,అంటే ధర్మానికి, మతానికి తేడా ఏమిటి?
ధర్మం ఓ జీవ నదీ ప్రవాహం  ఐతే,మతం ఒక దిగుడు బావి లాంటిది.
నదిలో నీరున్నం త వరకే ఏ బావి ఐనా దప్పిక తీర్చుతుంది.

మనిషి ఎలాంటి వాడు?
 మనిషి ఎల్లప్పుడూ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్నో యుక్తులు పన్నుతాడు. అందులో ముఖ్యమైనది,గుంపు ని పోగు చేయడం లేదా గుంపులో కలిసిపోవడం.
జంతువులు కూడ ఈ యుక్తినే పాటిస్తాయి.

సరే,గుంపు లేదా సమూహం ఎలా తయారవుతుంది?
గుంపుకి  ఏదైనా ప్రత్యేకత ఉండాలి. చర్మం రంగు,బలమైన శరీరం, ఆ తర్వాత మతం,కులం, ధనం,క్లబ్బు, వ్రుత్తి,అలవాట్లు- ఇలా ఏదో ఒక దానిని ప్రత్యేక లక్షణం గా చూపుతూ గుంపులు ఏర్పడ తాయి.
ఆ గుంపు లో ఉన్న వ్యక్తుల సంఖ్యని బట్టి ఆ గుంపు కి అంత బలం ఏర్పడుతుంది. గుంపు ఎంత బలం గా ఉంటే ఆ గుంపులోని వ్యక్తి కూడ అంత బలం గా ఉంటాడు.

ప్రస్తుత భారత దేశం లో మత సామరస్యత పేరుతో ఒక మతాన్ని పూచిక పుల్ల లా చూస్తూ ,మరి కొన్ని మతాలను ప్రోత్సహిస్తున్నారు. అది తప్పు . 
 ప్రజలందరి మనోభావాలు ఎలాంటి వివక్ష లేకుండా కాపాడట మే ప్రభుత్వ ధర్మమ్. 
కానీ జరుగుతుంది ఏమిటంటే,మతం పేరుతో ప్రభుత్వాలు ప్రజల మధ్య పొరపొచ్చాలు కలుగ చేసి అధికారాన్ని అందుకోవడం ఒక దుర్మార్గపు ఆనవాయితీ ఐంది .
అజ్ఞానం ముదిరితే మూర్ఖత్వం అవుతుంది . 
శాస్త్ర జ్ఞానం వేరు -నిజమైన ప్రజ్ఞ వేరు .
 తర్కం , స్పందన  వేర్వేరు గా ఉండొచ్చు .  . 
భావం,ఆలోచన,కార్యా చరణ ఒకే రకం గా ఉండటమే సమతుల్యత. 

ఎవరైతే సనాతన ధర్మ సూత్రాలకు అనుగుణం గా ప్రవర్తిస్తారో ఏ మతం లో ఉన్నా  వారందరూ హిందువులే. వీరు మంచి అనేది ఎక్కడున్నా స్వీకరిస్తారు. సమాజ హితవు కోరే ఏ భావ జాలాన్ని ఐనా గౌరవిస్తారు. వారు అన్ని వర్గాల వారి నమ్మకాలను సహ్రుదయం తో గౌరవిస్తారు.
మతాలను మాత్రమే  నమ్మేవారు చాందస వాదులుగా ఉండిపోయి ఇతరుల భావాలకు విలువ ఇవ్వరు.దాని వలన ఎన్నో యుద్దాలు,మారణ కాండలు జరిగాయి.జరుగుతున్నాయి.

నిజమైన హిందువు ఎల్లప్పుడూ తన బుద్దిని పదును పెట్టుకొంటూ, తనూ,తనతో పాటు అన్ని జీవులు,14 మితులున్న(dimensions) సకల చరాచర విశ్వం(14 లోకాలు) సుఖం గా,శాంతం గా ఉండటానికి ,దానికి తోడ్పడే ఆలోచనలు ఎక్కడినుండి వచ్చినా స్వీకరిస్తాడు. గాయత్రి మంత్ర అర్ధం కూడ అదే.

మనిషి గమ్యం - మళ్ళీ జన్మ లేకుండా, జనన మరణ చక్రం నుండి విముక్తి.

గమ్యం చేర్చే మార్గం: సాధన.

ఏమి  సాధన చేయాలి?
వయస్సుకి,బాధ్యతలకు  తగ్గ ధర్మ కార్యా చరణ. ధర్మ సమ్హితం గా కోరికలను అధిగమించి (కోరికలను అణచుకోవడం కాదు),అర్ధాన్ని సంపాదించుకొని మోక్షం పొందటమే హిందువుల చతుర్విధ పురుషార్ధ సాధన.

అలాగే,అష్టాంగ యోగ సాధన అనేది సంచిత కర్మలను భస్మం చేసుకొని,ఆగామి కర్మలను లేకుండా చేసుకొని,ప్రారబ్ద కర్మలను సహించే బలాన్ని పొందటానికి చేసే శారీరక,మానసిక క్రియలు.

సర్వేషాం స్వస్తిర్భవతు ;  సర్వేషాం  శాంతి ర్భవతు ; 
                                      సర్వేషాం పూర్ణం భవతు ;   సర్వేషాం  మంగళం భవతు. 
                                 ఓం శాంతి

Friday 18 October 2013

if i am in the shoes of Sonia.....

1.As a leader of the national political  party,i have to set it right for my party. Recent poll results and surveys denote that congress loosing the ground in both regions.so,what could be done to gain?
           i may be reasoned in my mind,that it is better to win one region by keeping a promise rather than losing in both the regions by violating it. Even if the promise to the people of Telangana is broken, there is no guarantee that the Congress would sweep in Seemandhra with YSJ and TDP coming first and second in successive opinion polls.So,out of compulsion,i may opt for bifurcation of the state for the sake of congress party... 
           But,taking the cue from reports of  first SRC ,JVP committee,Sri krishna committee and indira gandhi's remarks in parliament---  as statesman, i definitely go for ---
1. commissioning of "autonomous regional development board" to look after the backwardness of all backward regions in A.P. state.
2. to address divisive demands in our country , Commissioning of the second SRC 
3. power sharing rights for telengana political leaders.

Wednesday 16 October 2013

బువ్వ కావాలి... రైతన్న లారా మీరు మారాలి...

జనాభా పెరుగుతోంది! పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రత పెరగాలంటే.. రెండే పరిష్కారాలు!! అయితే, సాగు విస్తీర్ణం పెరగాలి! లేదంటే.. ఎకరా  ఉత్పాదకత పెరగాలి! సాగు విస్తీర్ణం పెంపు అనేది దీర్ఘకాల ప్రక్రియ! దీనికి వ్యయమూ ఎక్కువే! కానీ, ఉత్పాదకతను పెంచడం మన చేతుల్లోనే ఉంది! 
ఇప్పుడు  60 లక్షల హెక్టార్లలో మాత్రమే ఆహార ధాన్యాలను సాగు చేస్తున్నారు 
బువ్వ కావాలంటే.. భూమి పండాలి! 
భూమి పండుతోంది! కానీ, అందరికీ బువ్వ ఎందుకని   అందడం లేదు ?
భు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే వరి ఉత్పాదకత మరింత తగ్గే ముప్పు ఉంది . 
నేటికీ ,వరి ఉత్పాదకత హెక్టారుకు 30 క్వింటాళ్లుగా ఉంది.

సన్న రకాల సాగుకు ఖరీఫ్ అనుకూలం. రబీలో పండేవి దొడ్డురకం ధాన్యమ్ . 
కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌లో సుమారు 13 లక్షల ఎకరాల్లో వరి వేస్తారు. ఇందుకు 180 నుంచి 200 టీఎంసీల నీటిని వాడుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వంద టీఎంసీల నీళ్లు సరిపోతాయి. అలాగే, నాగార్జున సాగర్ కింద 22 లక్షల ఎకరాల మేరకు వరి సాగవుతుంది. ఇందుకు సుమారు 260 టీఎంసీల నీటిని వాడుతున్నారు. ఇక్కడ 110 టీఎంసీల నీరు వృథా అవుతున్నట్లు చెబుతున్నారు. పుష్కలంగా నీరుండి, అధికస్థాయిలో వాడినప్పటి కంటే...ఆచితూచి నీరు విడుదల చేసినప్పుడే 'బంపర్ క్రాప్' వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఖరీఫ్ లో సూర్య రశ్మి తక్కువ . కాబట్టి నీరు ఎక్కువ పెట్టినా లాభం లేదుః 


System of Root Intensification -  శ్రీ వరి సాగు 

 నారు మాళ్ళు పోయడానికి వాడే విత్తనాలలో సగం నేరుగా దమ్ము చేసిన పొలం లో నాటి ,నారు కొద్దిగా పెరిగాక, పాయల మధ్య ఓ పది అంగుళాల ఖాళీ ఉండేటట్లు చూసుకోని,ఇప్పుడు మన రైతులు పెట్టే నీటిలో 5 వ వంతు నీటి తో కొద్ది మోతాదుల్లో సేంద్రియ ఎరువులు వాడుతూ ,కలుపు లేకుండా పైపాటు చేస్తుంటే ఎకరానికి 50 బస్తాల ధాన్యం పండుద్ది. అందరి కడుపూ నిండు ద్ది .  

Monday 14 October 2013

పంచ కోశ శరీరం

పంచ కోశ శరీరం :
The human body consists of two primary systems. The first is the “biological body,” - second system is known as the “Human Energy System,” and consists of a finer grade of matter called “anti matter.” You cannot perceive physically this body, because it has a higher frequency and wavelength (beyond the 3rd dimension). 
Our spirit bodies can be compared to radio waves:
§         they’re normally imperceptible,
§         they each have a unique frequency or vibration that keeps them distinct from each other,
§         the different frequencies let them coexist independently in the same space, and
§         we can learn to tune in to the various bodies separately with certain techniques and technologies.
In other words, we are made up of several bodies that are superimposed over each other. The physical body is the densest
మనలో ఉన్న ధ్వని ప్రధాన మైన శరీరం- ఆస్ట్రల్ శరీరం 
-జీవ కాంతి ప్రధానమైన శరీరం- కుండలినీ చక్ర నాడీ వలయం -ఈ ధర్ శరీరం . 
ధ్వని,కాంతి ద్వారా ఈ  రెండు శరీరాలను ప్రభావితం చేయ వచ్చు. 

మంత్రాలు,తంత్రాలు,భావనా మయ సజెషన్ లు  ఇవన్నీ ఆస్ట్రల్ , ఈ ధర్  శరీరం లను ప్రభావితం చే స్తాయి . 
 

Friday 30 August 2013

why our own federal queen expelling 5 crore telugus from their capital city?

In the good olden days,if any body commits severe crime,the king punished by expelling the culprit from the capital city .
But, what grave mistake the telugus committed to be expelled from their capital city?
As far as one's knowledge,the telugus committed major blunder of electing the congress party to the federal throne.
They are the main culprits of not only for  degradation of indian economy but also for  failure of total system of the country.
1.unplanned or ill planned economical regulations.
2.sheer negligence of  farming & manufacturing industry.
3.ill conceived and vote bank centric welfare schemes.
4.failure in controlling the imports of unnecessary or luxury items.
5.utter failure in controlling  the large scale  corruption.

Monday 26 August 2013

ధర్మ చక్రం

ధర్మానికి విరుద్దం గా నడిచే వారు  మిత్రులు,బంధువులు,శిష్యు లు ఎవరైనా సరే అదుపు చే యాలి.
అదే అహింస . దానికి విరుద్దం గా మీరు పలాయనం చేస్తే అది హింస అవుతుంది .
జీవులను చంపడం హింస కాదు . అది రాక్షసత్వం .
హింస  అంటే ధర్మాన్ని చంపడం , ధర్మాన్ని రక్షించ లేక పోవడం. 
అసలు ధర్మం అంటే ఏమిటి ?
మన బాధ్యత ని ఎలాంటి ప్రలోభాలకు  ,సోమరితనానికి ,భయాలకు తావివ్వ కుండా చే యడ మే ధర్మం  .
స్వ ధర్మం , పర ధర్మం, స్థూల ,సూక్ష్మ ధర్మం - ఇలా ఎన్నో స్థాయీ బేధాలు .
తల్లితండ్రులను ,భాగ స్వామిని , పిల్లలను ప్రేమతో సాకటం కర్తవ్యం .
ఇరుగు పొరుగు వారిని,జీవులను,ప్రకృతిని రక్షించడం బాధ్యత .
వ్యక్తి స్థాయి నుండి కుటుంబ స్థాయికి ,తద్వారా సంఘ స్థాయికి తమతమ బాధ్యతలను విస్తరింప చెయడ మే
మనిషి విధి.
ఈ  క్రమం లో తన శారీరక,మానసిక,ఉద్వేగ ,ప్రాణ ఆరోగ్యాన్ని కాపాడు కొంటూ ,తన హితాన్ని,సమాజ హితాన్ని ఆచరణ లో అమలు చేస్తూ ,తన కర్మలను భస్మం చేసుకొని,కొత్త కర్మలు అంట కుండా ఆత్మ  గత అనువర్తనం తో జీవనం సాగించడ మే , మనిషి స్వ ధర్మం . 

Sunday 25 August 2013

భ వాఘ్ని ఆరామ ప్రారంభోత్సవ శుభా కాంక్షలు ...

భగవద్గీ త:

 ఎన్నో ఏళ్ళుగా సమాజం లోని బలాన్ని,బల హీనతని గమనించి మనిషి ఎలా జీవిస్తే ఆనందం గా ఉంటాడో  , తద్వారా  సమాజం ప్రశాంతం గా ఉంటుం దో ఆ జీవన మార్గా న్ని భోధించే పవిత్ర మార్గ దర్శక గ్రంధం .


సంకట పరిస్థితిలో మనిషికి కలిగే వైరాగ్యం,నిర్వేదం ,నైరాశ్యం మొదలగు తామస భావాలను ,
అత్యాశ,సుఖ లాలస, కీర్తి కాంక్ష,ధన వ్యామోహం  మొదలగు రాజస భావాలను,
క్రొధం,కార్పణ్యం,కక్ష,అసూయ,దురాశ,హింస,మొదలగు రాక్షస భావాలను,
మూడ భక్తి,మిధ్యా వాదం అనే పలాయన వాదం, మూడ నమ్మకాలు,సోమరితనం,మొదలగు అపరిపక్వ భావాలను,-----------మనిషి  అధి గమించి, అర్ధ,కామా లను ధర్మ బద్దం గా  సాధించి మోక్షం ఎలా పొందా లో తెలిపేది గీత.

మనిషికి గమ్యం : చతుర్విధ పురుషార్ధ సాధన, చావు పుట్టుకల చక్రం నుండి విముక్తి. 

భావాలను సాత్వికం గా మార్చు కొని,ఆ తర్వాత ఆయా భావాలకు పునాదిగా ఉన్న చిత్తాన్ని అధిగమించి సంకల్ప రహితం చేసుకోవడం,
మన అవగాహనను , మెట్టు మెట్టు గా కర్మ ఫల సన్యాసం ,ఇంద్రియాలను అధిగ మించే రాజయోగం ,శ్రద్ద-ఓర్పు -విశ్వాసం అనే నవ విధ భక్తి యోగం,సాక్షీత్వం -స్థిత ప్రజ్ఞత్వం-ప్రజ్ఞ అనే జ్ఞాన యోగం --- ఇలా సాధన చేస్తూ మనిషి భౌతిక పరంగా,భావ పరం గా,ఆత్మ పరం గా నిరంతర  ఆనంద స్థితి కి చేరడ మే మనిషి జీవన పధం.
ఇదే మనిషి ధర్మం.

ప్రశాంత మైన,సంతోష మైన జీవితం కావాలీ అనుకొంటే మనం ఎలా నడవాలో తెలిపే కర దీపిక, భగవద్గీ త. 

అందరూ  చదివి,ఆ సారాన్ని తమ తమ జీవితా ల్లో అన్వయించుకొని , పది మందికి తెలప వలసిన బాధ్యత భారతీయుల మైన మనందరి పై ఉంది . 

ఈ గురుతర బాధ్యత ని తమ భుజ స్కందాలపై వేసుకొని అమరావతి దగ్గరే ఉన్న వైకుంట పురం లో భ వాఘ్ని మర్మ యోగ విద్యాలయాన్ని, భ వాఘ్ని ఆరామాన్ని నిర్మించి, గీతా  చైతన్యాన్ని వ్యా పింప చేస్తున్న భ వాఘ్ని గురు దేవులకు,తమ జీవితాలను గీతా ప్రచారానికి అంకితం చేసిన గురుకుల ఆరామ భ వాఘ్నిసభ్యులకు   ఆయురారోగ్య భాగ్యాలు కలగాలని, ---
 నిరాకారుడు ,నిర్గుణో పేతు డు, గీతా కారుడైన శ్రీ కృష్ణుణ్ణి, 
గీతని గానం చేసిన వేద వ్యాస మహర్షిని ,
గీతని గ్రంధస్తం చేసిన గణేశుని - ప్రార్ధిద్దామ్ . 

Friday 9 August 2013

ఇది తేలేది కాదు !

ప్రక్రుతి వనరుల పరంగా, భౌగోళికం గా,  నదీ ప్రవాహ పరంగా ,  సాంస్కృతిక  పరంగా ,జన సాంద్రత పరంగా, జిల్లా విభజన పరంగా ,రాజధాని లో కేంద్రీకృత  అభివృద్ధి  పరంగా - ఇలా ఏది చూసినా ,ఏ రకం గా  చూసినా,   చీల్చడానికి వీలు లేని ప్రాంతం ఏదైనా మన దేశం లో ఉందీ అంటే  అది ఆంద్ర ప్రదేశ్ .
ఒక ప్రాంతాన్ని చీల్చి తే ఎన్నో కష్టాలు వస్తాయని అందరికీ తెలుసు.
సుమారు 30 సంవత్సరాలు, అంటే రెండు తరాల ప్రజలు కష్టాలు పడా లసిందే .

దేశం ఆర్ధికం గా చాలా క్లిష్ట స్థితి లో ఉంది . కొత్త పరిపాలనా యంత్రాంగానికి, ఎన్ని కోట్లు కావాలో? నిధుల కొరత,వనరుల అసమతుల్యత , ఇచ్చి పుచ్చు కోలేని ధోరణి ,కొద్ది గా కూడా త్యాగాలు చేయలేని స్వార్ధం - ఇవన్నీ
కొత్త రాష్ట్ర ఏర్పాటుకు ప్రతి బంధ కాలు.

యువత ఉద్యోగాలకు హామీ ,ఉద్యోగులకు భద్రత ,నదుల పంపకం,ప్రాంతాల పంపకం, ఆస్తులు అప్పుల పంపకం,వనరుల పంపకం -ఇవన్నీ చాల శ్రమ తో త్యాగాలతో ముడిపడ్డ విష యాలు.
నేటి కాలపు మనస్తత్వాలతో ,కుహనా నాయకులతో జరిగే పని కాదు .
అందరి మనోభావాలను  నమ్మాలి ,గౌర వించాలి.
కానీ , అంత  కన్నా ముందు సమాజ భద్రతా, కనీస అవసరాల  సరఫరా,  ,దేశ  సమగ్రత చాలా ముఖ్యమ్.
సుఖం గా అభివృద్ధి పధం లో దూసుకు పోతున్న సమాజాన్ని నిర్ధా క్షిణ్యమ్ గా సమస్యల కూపం లోకి తోసి వేయడం మంచిది కాదు.
నిజం చెప్పా లంటే ఇది తెలంగాణ ప్రజల సమస్య కానే కాదు. కొన్ని ప్రాంతాల వెనక బాటును ఎరగా చూపించి ఆత్మ గౌ రవం,ఆత్మాభిమానం, అనే రంగుటద్దా లలో ప్రాంతీయాభిమానం అనే సంకుచితాన్ని మెల్లగా మనస్సు ల్లోకి జొప్పించి, ప్రజలను ముఖ్యం గా  యువత ని తప్పు దారి పట్టించి తద్వారా సమాజ ఆర్ధిక స్థితిని కునారిల్ల చేస్తున్న రాజ కీయ పార్టీల అధికార  సమస్య.
తెలంగాణ నాయకుల సమస్యలకు సరైన పరిష్కారం ,వారికి రాష్ట్ర పగ్గాలు అప్ప చెప్ప డ మే . 

Monday 3 June 2013

మత సామ ర స్యం అంటే ఇదేనా ?

భారతీయులకి, ముఖ్యం గా హిందూ మతాన్ని ఆచరించే వారికి పరమత సహనం ,అలసత్వం , కర్మ సిద్దాంతం , అలవి మాలిన ఓర్పు  చాల ఎక్కువ .
తమ మనోభావాలను హేళన చేసినా , తమ ప్రార్ధనా వాటికలను ,దేవాలయాలను , వాటీ ఆస్తులను నాశనమ్ చేస్తున్నా ,  ఏమీ చేయ లేని  బద్ధకం ,సోమరితనం ,స్వార్ధ పరత్వం నర  నరాల్లో జీర్ణిం చు కొన్న ప్రజలు
ఈ  భూమండలం లో  మరెక్కడా ఉండరు.

దేశం లో ని గుళ్ళ ఆదాయాలను దారి మళ్ళించి నా ,
కోట్లాది విలువైన దేవాలయ ఆస్తులను అమ్మివేసినా ,
లక్షలాది గుళ్ళను పాడు పెట్టినా ,
వైదిక సాహిత్యాన్ని ,వైదికులను ,వేద ఘనా పాటీలను ఆకలితో మాడ్చినా ఏమీ అనని మతస్తులు వీరు.

తమ గుళ్ళ  బాగోగుల కోసం , పురోహితుల యోగ క్షేమాల కోసం ప్రజలు  ముడుపులుగా చెల్లించు కొన్న ధనాన్ని
మరో ప్రయోజనానికి దారి మళ్లిస్తూ ఉంటే ఏమీ అనలేని మీడియా వారు ,గుడిలో జరిగే  చిన్న చిన్న పొ ర  పాట్లను
భూ తద్దాలలో చూ పిస్తారు .

మన భారతీయులెవ్వరూ కనిపెట్టి చెప్ప  లేని నగ్న సత్యం , ఒక అమెరికా పరిశోధకుడు ( steeven knapp ) ద్వారా వెలుగు లోకి వచ్చిన కొన్ని పచ్చి నిజాలు వింటున్నప్పుడు మన మతం పై , ప్రజల పై జాలి వేస్తుంది .
--- ఎందుకు ఇవన్నీ చెప్పుకొని  భాద పడుతున్నా  మంటే ,  మతం అంతరిస్తే దానిని నమ్ముకొన్న జాతి అంతరిస్తుంది . అలా జరగా కూడదు అంటే , ప్రతి భారతీయుడు నడుం బిగించ  వలసిన సమయ మిదే .

ఆంద్ర రాష్ట్రం లో  ఎండో మెంట్ శాఖ పరిధిలో ఉన్న 45000    గుళ్ళ ఆదాయం ( 4000 కోట్లు ) లో 85 శాతం దారి మళ్ళిస్తున్నారు .
కర్ణాటక రాష్ట్రం లో 79 కోట్ల  దేవాలయాల ఆదాయం లో 60 కోట్లు మసీదులకు , 13 కోట్లు చర్చిలకు ధారాదత్తం చేసి
మిగతా 6 కోట్లను గుళ్ళకి ఎంగిలి పడేస్తున్నారు . ఈ దోపిడీ వలన 50000 గుళ్ళు మూత పడ్డాయి .
ఒడిశాలో జగన్నాధుని 70000 ఎకరాల భూమిని   అమ్మటానికి  ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది .
అలాగే కేరళ , మహారాష్ట్ర లో కూడా  దేవాలయాల ఆస్తుల  లూటీ జరుగుతుంది .
సనాతన మత  ప్రియులు , ముఖ్యం గా క్షత్రియులు మేలుకొని ఈ అరాచకా న్ని ఆ పాలి.


Saturday 11 May 2013

వైశాఖం ...

అన్ని మాసాలు పవిత్రమైన వైనా , వైశాఖ -మాఘ -కార్తీకాలు అత్యంత శ్రేష్ట మైనవి . 
ముఖ్యం గా విష్ణారాధన ,జల దానం ( చలి వేం ద్రాలు ) ,మొక్కలు నాటి పోషించడం ,ఈ మాసం లో తప్పక ఆచరించాలని రుషి వాక్యం . 
అక్షయ తృతీయ ,ఆదిశంకర జయంతి ,నరసింహ జయంతి ,బుద్ద  జయంతి , స్కంద జయంతి , దత్త 
జయంతి - ఈ  నెల లోని పవిత్ర మైన పండుగ రోజులు . 
శరీర శుద్ది తో పాటు చిత్త  శుద్దిని అలవాటు చేయడ మే మన పర్వ దినాల విశిష్టత  . 

చిత్త శుద్ది తో చేసే పూజలు మనస్సుకి ప్రశాంతత ను , బుద్దికి వివేకాన్ని  ఇచ్చి 
అహంకార నిర్మూలనకు తోడ్పడ తాయి . 
ఎప్పుడైతే అహంకారం తగ్గుతుందో , అప్పుడు  మానవ సంబంధాలు 
మెరుగవుతాయి. తద్వారా మనిషి భౌతికం గా ఎదగడానికి అవకాశం  ఉంటుంది . 

Thursday 25 April 2013

గ్రహణ సమయం లో ఏం జరుగుతుంది ?

This combination photo illustration shows a partial lunar eclipse in 2008. (China Photos/Getty Images) 
చంద్ర గ్రహణం సమయం లో ఏం జరుగుతుంది ?
సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి అడ్డుగా రావటం వలన మనకు చంద్రుడు కనపడడు .
సూర్య కాంతి లోని  ఎర్ర రంగు తరంగాలు ఒక ప్రత్యేక కోణం లో   చంద్రుని తాకుతాయి . ఎందు  కంటే
భూ వాతావరణం సూర్య  కాంతి లోని నీలి తరంగాలను చెల్లాచెదురు చేయడం వలన ఎక్కువగా
ఎరుపు తరంగాలు చంద్రుని పై పడి , మన భూ వాతావరణం లోనికి ఒక విధమైన శక్తి తరంగాలు
పరా వర్తనం చెందు తాయి .
  • మనస్సుకి సంకేత మైన చంద్రుడు ,ఆత్మకి సంకేత మైన సూర్యుడు ఒకే సరళ రేఖ లోకి రావడం ఒక విధం గా  అదొక యోగం . ధ్యాన లక్ష్యం కూడ మనస్సు ఆత్మా వైపు గా నిలిచి ఉండటమే గదా .
  • సూర్య నాడి , చంద్ర నాడి కూడ ఒకే విధ మైన స్పందన లో ఉన్నప్పుడు సుషుమ్నా( - అగ్ని నాడి )బాగా పని చేస్తుంది . అనగా అగ్ని నాడి ద్వారా కుండలినీ శక్తి ప్రసరణ అతి తేలికగా జరిగే అవకాశంఉంది .

అందుకే గ్రహణ సమయం లో జప , మంత్రసాధన , ధ్యానం చేస్తే ఎక్కువ ఫలితాలు కలిగే
 అవకాశం  ఉంటుంది .

అందుకే గ్రహణం రోజున ముఖ్యం గా ఉపవాసం  లేదా సాత్విక మితాహారం,ప్రాణాయామం , వీటి ద్వారా శరీర శుద్ది జరుపు కొని భూమి పై పరిడ విల్లె కుండలినీ శక్తిని మన శరీర కోశాల లోని సుషుమ్నా నాడీ ద్వారా ప్రవహింప చేసు కొనే శక్తి పాతానికి అందరూ సమాయత్త మవ్వాలని మన ఋషుల ఆశీస్సు . 
గ్రహణ కాలం లో ఆహార పదార్ధాలకు , జీవులకు హాని చేసే కిరణాలు  ఎక్కువగా భూమికి వస్తాయి . 
వీటి నుమ్డి రక్షణ పొందా లంటే మన శరీర కోశాలను శుద్దమ్ గా ఉంచు కోవాలి. 
అందుకే , స్నానం , దానం ,మితాహారం ,ప్రాణాయామం , దైవ స్మరణం మొదలగు గ్రహణ విధులను 
అమలు చేయాలి .  

Sunday 21 April 2013

why & how to do meditation?

మనుషులెందుకు ధ్యానం చేయాలి ?
తిరిగి తిరిగి వచ్చి కాసేపు విశ్రాంతి తీసు కొంటామ్ .  
చదివి చదివి కూసేపు కునుకు తీస్తాం . 
భావ సంచలనం కలిగి నప్పుడు కాసేపటికి ఒక  స్థిమిత స్థితి కి వస్తాం . 
అందుకే శరీరం త్వరగా అలసి పోకుండా , ఎంత పనైనా అలవోకగా చేయ దానికి శరీర సామర్ధ్యాన్ని 
పెంచు కోవడానికి ఎన్నో వ్యాయామాలు నిరంతరం చేస్తాం . 
అలాగే మెదడు చురుకుగా ఉండ టానికి ఎన్నో రకాల మైండ్ గేమ్స్ ,పజిల్స్ సాధన చేస్తాం . 
భావ జాలాన్ని అలాగే మన భావాలను అదుపులో ఉంచడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తాం . 
రకరకాల శ్వాస పద్దతుల ద్వారా ప్రాణ శక్తిని అదుపులో ఉంచు కొంటాం . 
ఇదే విధం గా మన చైతన్యా న్ని అనగా అవగాహన తో కూడిన ఎరుకను విస్తరింప చేసుకొని ,మన చైతన్యం యొక్క నిజ స్థితి ని ఆవిష్కరిమ్చు కోవడానికి ధ్యానం అలవాటుగా చేసు కోవాలి . 

"control over the physical,emotional,mental,praanic bodies and then expansion of real consciousness through contemplation,meditation leading to liberation from wheel of 
karma".

అంతర వ్యక్తిత్వ వికాసానికి ,  జీవన వికాసానికి ,జీవితాన్ని ప్రశాంతం గా జీవించడానికి , అన్ని రకాల పరిస్థితులను ఒకే విధమైన మానసిక స్థితి తో స్వీకరించే సమ స్థితి అలవాటు చేయడానికి , మనలోని
 వాసనా గుణాలను సమూ లమ్ గా మార్చుకొని సత్వ నిర్మల స్థితిలో ఉండటానికి , శ్రద్ద , ఓరిమి ,క్షమ ,ప్రేమ తదితర సాత్విక గుణాలను పెంచు కోవడానికి ,జీవిత పరమావధి ఐన ముక్త స్థితి ని చేరు కోవడానికి ---
 ధ్యానం చేయాలి . 

ధ్యానం లో ఏం జరుగుతుంది?
జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే సమాచారాన్ని ,చిత్తం లో కలిగే  ఆలోచనలను  , జ్ఞాపకాలలో దాగిన
 సమాచారాన్ని , పాత అనుభవాలను   ---  మనస్సు అసలు పట్టించు కోదు . అంటే , మనస్సు (-బుద్ధి)
దేనినీ  బేరీజు వేయదు . మమేక మవ్వదు .  అనుభూతి చెందదు . (అహం లేదు).
పింగాణీ పెంకు పై ఏ దైనా రంగు వేసినా పీల్చు కోదు . కాబట్టి రంగు ఏమీ మారదు . అదే ఒక బ్లాట్టింగ్
పేపర్ ఐతే రంగు ని మొత్తం పీల్చు కొని రంగు మారుతుంది .
అలాగే మన మనస్సు కి  ఎన్ని రకాల సంఘటనలు - అవి సుఖం లేదా దుఖం -కలిగించినా  ఎలాంటి
అనుభూతి లేకుండా సాక్షి గా సమ స్థితి లో ఉండటం అలవాటు చేయాలి .

చైతన్యాన్ని , అనగా మన ధ్యాస ను ఇంతకూ ముందు మనం చెప్పుకొన్న శక్తి ప్రవాహ గొలుసు లో
ఎక్కడైన నిలిపి ధ్యానా న్ని సులభం చే సు కోవచ్చు .
(చైతన్యం  ---- విశ్వ శక్తి (కుండలినీ శక్తి ) ---- మనస్సు ---- ప్రాణ శక్తి ----దేహం ) .

ధ్యానానికి కావలసిన కనీస అర్హత ఏమిటి ?
ఒక్క మనిషికి మాత్రమే నిరంతర ఆలోచనా వృత్త సామర్ధ్యం  ఉంటుంది .
మనిషి కి మనస్సే ఒక వరమూ , అలాగే శాపమూ  !
ఆరోగ్య వంతమైన శరీరం అనగా  పంచ కోశ శుద్ది ఉండాలి .
అందుకే పతంజలి రుషి అష్టాంగా యోగం ద్వారా -
యమ ,నియమ ,ఆసనాల  ద్వారా- శరీర , మానస శుద్ది
ప్రాణ యామం ద్వారా - ప్రాణ శక్తి శుద్ది ,తద్వారా ప్రాణ శక్తి పై అదుపు -
ప్రత్యాహారం అనగా సాక్షిగా వైరాగ్య భావం తో అన్నింటినీ గమనించడం -(ఇది మంచి ఇది చెడు , ఇది సుఖం ,ఇది దుఖం అనే ద్వంద అనుభూతి లేకుండా )అలవాటు చేసు కోవాలి . - ఇంద్రియాలు , చిత్తము ,
జ్ఞాపకాల సంచి ,మానసం -వీటన్నింటి గురించి మనకు కలిగే జ్ఞానం తద్వారా  మనస్సు పై అదుపు .
ఎప్పుడైతే మనకు  శరీరం ,ప్రాణ శక్తి , మనస్సు పై అదుపు వచ్చిందో అప్పుడు -
ధారణ ,ధ్యానం తద్వారా సమాధి స్థితి ....

ధ్యానం కూ డ ఒక పని లాగే ఉంది . దాని  వలన ఎలాంటి ఆనందం కలగడం లేదు .
 మరి నేను ధ్యానాన్ని మాని వే య వచ్చా ?
ధ్యానం అంటే  ఓ మూల కాసేపు కూర్చుని  నామా న్నో , మంత్రా న్నో జపం చేయడం కాదు . దానిని
సంస్మరణ  లేదా జపం  లేదా ప్రార్ధన  అనవచ్చు .
అహాన్ని త్యాగం చేస్తూ , శూ న్యం పై గానీ , దైవ రూపం పై గానీ దృష్టి కేంద్రీక రించి చేసేది అసలైన
ధ్యానం . మిగతావ న్నీ కామ్య కర్మల నే చెప్పు కోవచ్చు .
కర్మ లెప్పుడూ ఆనందాన్ని ఇవ్వవు . ధ్యానాన్ని ఒక సకామ కర్మలాగా చేస్తే అలాగే ఉంటుంది .
అలాగని ధ్యానాన్ని మాన వద్దు . అసలేమీ చేకుండా ఉండటం కన్నా ఏదో ఒకరక మైన ప్రయత్నం చేస్తూ
ఉంటే అసలైన ధ్యానం మనకు కుదురుతుంది . కనీసం మానసిక ప్రసాంతత కలుగుతుంది . 

Thursday 18 April 2013

రామో విగ్రహవాన్ పరమో ధర్మః

శ్రీ సీతా రాముల కల్యాణం భారతీయుల జీవన స్రవంతిలో ముఖ్యం గా హిందూ వివాహ చట్రానికి 
ఒక సూత్రం గా ఎలా ,  ఎందుకు భాసిల్లుతుంది ? 
మన దేశ సంఘ  వ్యవస్థ ఒక విధం గా మన వివాహ వ్యవస్థ పైనే ఆధార పడి ఉంది . 
చెక్కు చెదరని వివాహ వ్యవస్థ ద్వారా  పిల్లల పెంపకం , ఉమ్మడి కుటుంబాలు , సామాజిక సుస్థిరత -ఇవన్నీ ఒక దానిపై ఒకటి ఆధార పడి ఉన్నాయి . 
రాముడు  తదితర రామాయణ కాలపు వ్యక్తులు నిజం గా ఈ భూమి పై నడయాడిన వారేనా ?
లేక , కొత్తగా భూమి పై నివాసం ఏర్పరచు కొంటున్నఇతర గ్రహాల వారా ?
లేక వాల్మీకి సృష్టించిన పాత్రలా ? ----  ఇలాంటి సందేహాలతో ఎంతో  మంది సతమవుతూ ,
అందరినీ తికమక పెడుతూ  ఉన్నా, ఈ  దేశం లోని సామాన్య జనులు మాత్రం రామాయణాన్ని వారి
గుండె లలో పెట్టుకొని , జీవన విధానానికి ,జీవిత గమ్యానికి చుక్కాని లాగా  అన్వయించు కొంటూ
ప్రతి క్షణం పండుగ చేసుకొంటూ నే ఉన్నారు .

దేవ లోకపు వారా ? ఇతర గ్రహాల వారా ? అసలు మనుషులేనా ? అప్పటి నాగరికత అంతగా వృద్ది
పొందిందా ? ఇలాంటి సందేహాలని శాస్త్ర కారులకు వదిలేసి , మనం చూడ వలసింది రాముని నడత ,
సీతమ్మ దైర్యం &అనువర్తత , లక్ష్మణుని అంకిత భావం , భరతుని కర్తవ్య పాలన ,హనుమ పాండిత్యమూ ,
 సేవా భక్తీ  ... ,
 భర్త గా  ,అన్నగా ,కొడుకు గా , అన్నింటినీ మించి ప్రజలను పాలించే రాజుగా - ఎలా నడవాలో ,
నడవడిని ఎలా మార్చుకోవాలో  అంటే  మనిషి తన ధర్మాన్ని  ( అవసరమైన కార్యం ) ఎలా నిర్వర్తిం చాలో
చూపించిన మార్గ దర్శి రాముడు .
ధర్మం అంటే - మనిషి జీవనానికి కి అత్యవసర మైన వన్నీ సాధించు కోవడం మనిషి కనీస ధర్మం .

నేడు మనలో లోపించిందీ ధర్మమే . అనగా మన కేది అత్యవసరమో తెలియక అన్నింటినీ కోరు కోవడ మే 
అధర్మం .
 రావణుడు , శూర్పణఖ , వాలి , కైకేయి , - వీరు , వారికి అత్యవసరం కాని వాటి పై మోజు పడి అధర్మం బాట పట్టి వారి జీవనాన్ని ,వారితో పాటు ఇతరుల జీవితాలను బ్రష్టు పట్టించారు .

మనిషి తను ఉన్న ఆశ్రమానికి ( విద్యార్ధి, గృహస్తు , వానప్రస్థ, సన్యాసి ,రాజు ,నాయకుడు  తదితర ఆశ్రమాలు ) అనుగుణం గా , తన కనీస అవసరాలను గుర్తించి సాధించు కోవడం , ఆ క్రమం లో ఇతరులకు , ప్రకృతికి  ఎలాంటి హానీ కలుగ కుండా జాగ రూకత తో మెలగడం ---- ఇదే మనిషి ధర్మం .

మతం గురించి , దైవం గురించి చెప్పడం లేదు .
రాముణ్ణి ,రామాయణాన్ని ఒక మతానికి పరిమితం చేయడం సంకుచిత్వం . 
 మనిషి జీవన నాదం ఎలా శ్రుతి  చేస్తే  స్వర లయ బద్దం గా ఉంటుందో వాల్మీకి చెప్పాడు . భారతీయులే కాదు ,
ఈ సమస్త భూమండలం లోని మనిషన్న వాడు, నడవ వలసింది రాముని బాట ,స్మరించ వలసింది రామ నామం , తరించ  వలసింది రామాయణ పారాయణం ... 
అప్పుడే సీతా రామ కల్యాణం విశ్వ కల్యాణానికి నాంది అవుతుంది . 
           రామో విగ్రహవాన్ పరమో ధర్మః 



Saturday 6 April 2013

ఇప్పుడే ధ్యానం ప్రారంభించండి .

ధ్యానం అంటే ఏమిటి ?
మన ధ్యాసను ఒక విషయం పై ధారణ చేయడాన్ని ధ్యానం అంటాము .
ఏకాగ్రత కి ధ్యానానికి తేడా ఉందా ?
ఏకాగ్రత లో అహం మిగిలే ఉంటుంది .
ధ్యానం లో అహాన్ని దాట టానికి ప్రయత్నం ఉంటుంది .
మనస్సు గాడ నిద్రలో తప్ప అన్ని వేళలా అతి చంచలం గా కంపిస్తూ ఉంటుంది .
శాస్త్రకారుల పరిశోధనలలో ,  మనిషి ప్రతి రోజూ సుమారు 60000 రకాల ఆలోచనలు  సంకల్పిస్తాడు .
ఆలోచన పుట్టాలంటే సంకల్పం , భావ పరిపుష్టి ఉండాలి .
సంకల్పం ఎలా కలుగుతుంది ?
మనలో అంతర్లీనం గా ఉన్న గుణాల ( సత్వ ,రజో , తమో ) వలన ,
ఆ గుణాల కు బయట ఉన్న విషయాలకు కలిగే సంపర్కం వలన
సంకల్పం ఏర్పడుతుంది .
ఇంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలను క్రోడీకరించి , పాత సమాచారం తో బేరీజు వేసి
మనస్సు భావ పరిపుష్టత ని పొందుతుంది .

చైతన్యం  .
---> అహం -----> బుద్ది ---- జ్ఞాపక శక్తి ---- చిత్తం
= ఇవన్నీ శక్తి కి వివిధ రూపాలు . వీటన్నింటినీ కలిపి మనస్సు ' అని మనం వ్యవహరిస్తాం .
అంటే మనస్సు - ఒక శక్తి ప్రవాహం .
మనస్సు ఒక పక్క చైతన్యం తో మరో పక్క దేహం తో కలప బడి ఉంటుంది .
చైతన్యం  ---- విశ్వ శక్తి (కుండలినీ శక్తి ) ---- మనస్సు ---- ప్రాణ శక్తి ----దేహం .
ఈ గొలుసులో ఎక్కడ స్పందనలు ఎక్కువైనా గొలుసు మొత్తం దాని ఫలితం భరించాలి .
ఆ స్పందనలను నియమితం చేసు కోవడ మే ,ఒక సమ తుల్య అవస్థలో నిలపడ మే యోగ సాధన .
అనగా , దేహాన్ని ,ప్రాణాన్ని , మనస్సుని , కుండలినీ ప్రవాహాన్ని  మాయా చైతన్య మనే అహంకారాన్ని
అధిగమించి శుద్ద చైతన్యం వైపు మళ్ళించేది ధ్యానం . ఈ మార్గం లో కలిగే అనుభవాలు
జ్ఞానం . మార్గం చివర వచ్చే లేదా మిగిలే అనుభూతి ప్రజ్ఞ .
మన జీవనం , జీవితం ప్రశాంతం గా ఉండాలంటే ధ్యానం చేయాలి . 
ఇప్పుడే ధ్యానం ప్రారంభించండి . 

Wednesday 13 March 2013

ఆదిత్య హృదయం

Solar power for the people
iఇదీ నిజమైన సూర్యారాధన . భూమి కెలాంటి నష్టం లేకుండా మన దైనందిన జీవితావసరాలకు 
శక్తి ఎలా పొంద వచ్చో ఒ క్క సారి పై చిత్రాన్ని చూచి 
ఆచరిద్దాం . 

Sunday 10 March 2013

శివ రాత్రి ప్రత్యేకత ఏమిటి?

                       శివ రాత్రి ప్రత్యేకత ఏమిటి?
శివ రాత్రి , శివ శక్త్యాత్మకానికి ప్రతీక . శుద్ద జ్ఞాన స్వరూపం శక్తి తో ప్రకటిత మైన రోజుగా చెప్పు కొంటారుతనలో నిద్రాణమ్ గా దాగి ఉన్న శక్తిని అవగాహన లోకి తెచ్చు కోవడమే శివ రాత్రి నాడు మనిషి చేయ వలసిన విధి.


తమ కుండలినీ శక్తిని ఊర్ధ్వ ముఖం గా వేగ వంతం చేసి సహస్రార  శక్తి 
ప్రవాహం లో కల పడమే సాధకుల విధి

Symbols &logos:
శివ లింగం శుద్ద సత్వ జ్ఞాన ఆనంద రూపానికి చిహ్నం . దానికి కాలం తో ,వేగముతో ,ప్రదేశం తో ,పని లేదు . గుణమూ  లేదు . అనగా త్రిగుణాతీతమ్ .  త్రి కాలాతీతం . స్పందన లేని శుద్ద తత్వానికి ఒక గుర్తు గా శివ లింగం ,తలచుకోవడానికి ఒక పేరుగా శివం . అనగా అంతటా వ్యాపించి ,అన్ని  కాలములందు ఉంటూ ,అన్నింటినీ లయం చేసు కొంటూ ఉన్నది ఏదైతే ఉందొ , దానిని వ్యవహార పరంగా, మనం తేలికగా అర్ధం చేసు కోవడానికి  తత్ ' అనీ ,దైవం' అని చెప్పుకొంటాము .

ఇలాంటి తత్త్వం లో స్పందన (సంకల్పం -will)ఏర్పడి నపుడుశక్తి " గా మనకు ప్రకటిత మవుతుంది .
అనగా తత్' నుండే శక్తి ఉత్పన్న మై సకల చరా చార సృష్టి కి మూల కారణం అయింది .
'శక్తి తో ఉన్న  తత్ ' కి రూపం ,  రూపానికి ఒక పేరు  మనుషులకు కావాలి .
వేలాది సంవత్సరాల నుండి శక్తి కి గుర్తుగా సర్పిలాకారాన్ని  అనగా  twisted  structure ని
మనిషి (మహర్షులుఏర్పాటు చేసు కొన్నాడు .అందుకే లింగం చుట్టూ సర్పం చుట్టు కొన్నట్లుగా పాన వట్టాన్ని తయారు చేశారు .

మనిషి జ్ఞానం రక రకాలుగా వృద్ది చెంది, ఒకే  విషయాన్ని ఎన్నో రకాలుగా అర్ధం చేసు కొనే
ప్రక్రియలో అర్ధ నారీశ్వర రూపము , యోని - లింగ రూపము , ఇలా మనిషి బుద్దికి ,
 తర్కానికి తోచి నట్లుగా చిహ్నాలను తయారు చేసు కొన్నాడు .

అండాండమ్ లో ఉన్నదే పిండాండమ్ లో , అదే బ్రహ్మాండం లో ఉంటుంది .
మనిషిలో ఉన్న వెన్ను పూస ని ఆవరించి ఉన్న సుషుమ్నా నాడీ శక్తి ప్రవాహాన్ని లింగం గా ,
ఇడా  పింగళా శక్తి ప్రవాహాలను సూర్య చంద్ర శక్తులుగా  , రెండు నాడుల

 సంగమ ప్రదే శంలో  ఉన్న ఆజ్ఞా చక్ర మును  అగ్ని శక్తి గా, మూలాధారం లో ఉన్న
శక్తి ప్రవాహాము   సర్పా కారం లో ఉన్నట్లుగా  మన ఋషులు భావించారు .
వారి భావనలను ఎన్నో కధల రూపం లో పురాణాలుగా , స్త్రోత్రాలుగా ,స్తుతులుగా ప్రకటించారు .
మనిషి గానీ, జీవి అయినా పైకి కనబడే పదార్ధ దేహాన్ని వలిచి చూస్తే మన కంటికి ఏమీ కనబడదు. కానీ, శక్తి ప్రవాహం అనేది ఒకటి ఉంటుంది. బ్యాటరీ కి ఉన్నట్లే  దానికి భిన్న ధృవాలు ఉంటాయి. ఆజ్ఞా చక్రము పాజిటివ్ ధృవమైతే,మూలాధారం నెగిటివ్ ధృవం గా అర్ధం చేసుకోవాలిఇంతవరకు క్లాసికల్ ఫిజిక్స్ సహాయం తీసుకున్నాం. ఇంకా లోతుగా అనలైజ్ చేయడానికి క్వాంటం ఫిజిక్స్ అవసరం అవుతుంది. ఇప్పుడది అప్రస్తుతం


మనిషి ఎన్నో రకాలుగా వ్యవహార పరంగా ,తంత్ర సాధన ,హట యోగ , జ్ఞాన యోగ ,భక్తీ యోగ పరంగా దైవాన్ని చేరు కోవడానికి ప్రయత్నించే దిశలో ఎన్నో భావాలు , మరెన్నో గుర్తులు .

వ్యవహారిక సౌలభ్యం కోసం "తత్' ని  సత్ చిత్ ఆనందం ' గా , శక్తి ని  వివిధ పేర్ల తో
 పిలుచుకొంటాం .తేలిక గా అర్ధం చేసుకొంటా నికి  ఇచ్చా , జ్ఞానక్రియా శక్తులుగా విడ దీసి

పలుకుతాం .

మనిషి, తనలో కలిగే ప్రతి స్పందనకు ,చేసే ప్రతి కార్యానికి ప్రతీకగా , అలాగే  
తన కోరికలు తీరటానికి ఏమేం కావాలో అన్నింటికీ విడి విడి గా ఎన్నో రూపాలను,నామాలను తయారు చేసుకొని ప్రార్ధనలు ,ఆరాధనలు ,కామ్య కర్మలు , సకామ హోమాలు ,వ్రతాలు , ఎన్నో రకాల యోగాలు చేస్తాడు .
సంపద కావా లంటే లక్ష్మీ దేవి శక్తిని , యుద్ధం లోవిజయమ్ సాదించా లంటే దుర్గా శక్తిని  - ఇలా ప్రతి కార్యానికి ,  క్రియకూ  ఒక పేరు ,రూపం ఏర్పాటు చేసుకోవడం మనిషి నైజం .

Inter dependent relationship between Mind & Pranic energy ,just like electricity and magnetism!

భారతీయ ఋషులు మనిషి మానసానికి ,ప్రాణ శక్తికి , ఊపిరికి ఉన్న సంబంధాన్ని , అలాగే మనిషి లో ఉన్న శక్తికి ,  చుట్టూ ఉన్న ప్రక్రుతి  శక్తులకు ఉన్న కార్య కారణ అవినాభావ  సంబంధాన్నికని  పెట్టారు

అదే విధం గా   భూ మండలం లో కొన్ని ప్రదేశాలలో  అత్యధిక శక్తి ప్రకటిత మయ్యె కేంద్రాలను ( ఉదాహరణకు - స్వయంభూ క్షేత్రాలు ),అలాగే 
అంతరిక్షం లో జరిగే గ్రహ నక్షత్ర గమనాలకువిశ్వ శక్తికి ,మనిషి లోని ప్రాణ శక్తికి ఉన్న బంధాన్ని కని  పెట్టారు .

వారు దర్శించిన వాస్త వాలకు అనుగుణం గా కొన్ని అల వాట్లను ప్రజా బాహుళ్యానికి నేర్పారు . అలవాట్లే ఆచారాలుగా , సంప్రదాయాలుగా , వ్రతాలు ,నోములు , పండుగలుగా మనిషి క్షేమానికి  తద్వారా లోక కళ్యాణానికి హేతు వవుతున్నాయి .

శివ రాత్రి రోజున విశ్వ శక్తి   భూ మండల మంతా అత్యంత ఎక్కువ స్థాయి లో విడుదలయ్యే   సమయం . ప్రతి మనిషి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించు కోవాలి .
ఎలా? ఏం చేయాలి ?

How to transform the  human vibrations into divine vibrations ?

పంచ కోశాలను శుద్ది గా ఉంచు కోవటానికి ప్రయత్నం చేయాలి .

·        శరీర శుద్ది కోసం సత్వ గుణ ఆహారాన్ని అతి తక్కువ గా తిని ,

·        మానసిక శుద్ది కోసం ప్రాణా యామం,, భగవన్నామ స్మరణ ,కీర్తన ,మంత్ర జపం ,తద్వారా ధ్యానం ,

·         బుద్ది  శుద్ది కోసం ప్రతి పనీ భగవద్  పరంగా చేయడం -   విధంగా కనీసం శివరాత్రి నాడు చేస్తే అద్భుత ఫలితాలు అంటేమనిషి పరిణామం వేగ వంత మవుతుందని ఋషులు చెప్పారు .

అందుకే , శివరాత్రి ప్రతి మనిషికీ  ఒక అద్భుత అవకాశం
ప్రతి సాధకుడి కీ పరీక్ష
(
మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం ..... 

చిదానందరూపః శివోzహం శివోzహమ్).