Search This Blog

Friday 30 November 2012

Srivatsa Gothram

Number of readers requested to furnish the details about the origin and other details like pravara,surnames under srivatsa gotra. 

Shrivatsa is an ancient auspicious symbol in India. It is a mark on the chest of Vishnu.
Lord Parasurama an avatar of Vishnu was born in this Gotra. 
Sri-Vatsa is a gotra derived from the existing Vatsa gotra. 

Srivatsa Gothram - శ్రీ వత్స గోత్రం .

Pravara -ప్రవర : Bhargava, Chavyana, Aplavana, Ourva, Jamadganya, 



This gotra is present in brahmins & bhatrajus & kshatriyas &.  Khatris (a north-Indian caste),
&  Jha (Brahmins from Mithila) .
  • SOME OF THE Brahmin  SURNAMES UNDER THIS SRIVATSA GOTRA: SamavedamKothapally, Vundi, Tangirala, Tenneti, Yarramilli,Bhamidipati, Bommaraju, ChakravarthyIndragantiGollapinniTiwari, Morusupalli, Kanukolanu ,etc..Among Sri Vaishnavas, I think the most common is "Sri Vatsa Gothram".
  • SOME OF THE BHATRAJU SURNAMES UNDER THIS SRIVATSA GOTRA:athmakuru - aakivedu - aarya - Chennapragada -  Chemakuri --devulapalli -Maalaraju -Machiraju-Munnangi,etc..
  • SURNAMES OF  KSHATRIYAS UNDER THIS SRIVATSA GOTRAMahali&Dalapati . 
  • kshatriyas with this surname are presently resided in kosuru village of divi taluk,movva mandal of krishna dt.

Thursday 29 November 2012

నిత్య పారాయణ స్తోత్ర , మంత్రాలు :

మతమేదైనా మనిషికి మంత్రం ఎంతో ఉపకారం చేస్తుంది. మనస్సుని నిశ్చలపరిచి ,
బుధ్ధిని వివేకవంతం  చేయటానికి , తద్వారా మన కర్మలను ధర్మ బధ్ధం చేసుకొని
కష్టాలనుండి గట్టెక్కడానికి మన రుషులు సూచించిన మార్గాలు -భక్తి ,జ్ఞాన ,
నిష్కామ కర్మ , అష్టాంగ యోగ సాధనలు .
వీటన్నింటిలో అంతర్లీనంగా స్తోత్ర మంత్ర జప ధ్యానం ఉంటుంది .
మంత్రమంటే చాలా మందికి అదోరకమైన అభిప్రాయం ఉంది .
 మన మనస్సు ధ్రుక్పధాన్ని సమూలం గా మార్చి వేసే శక్తి మంత్రానికుంది .
అలాగే మనకు కనిపించే ప్రక్రుతి శక్తులను , మన ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేని
అతీత దైవీ శక్తులను ప్రసన్నం చేసుకోవడానికి స్తోత్ర పారాయణం ఎంతో మంచి కార్యం .

అలాగే అర్ధం తెలుసుకొని చేసే  హనుమాన్ చాలీసా పారాయణం ఎంతో శక్తిమంతమైనది .
 గురు తులసీదాస్ విరచిత  హనుమాన్   చాలీసాని కనీసం రోజుకొక్కసారైనా  పటించండి .

Wednesday 28 November 2012

తెలుగు భా ష పుట్టు పూర్వోత్తరాలు

ద్రావిడులు ప్రోటో ఆస్ట్ర లాయిడ్స్ జాతికి చెందిన వారు . వారు  భారత దేశ ములో అనాదిగా ఉన్న వారా లేదా ఆఫ్రికా ఖండం నుండి వలస వచ్చారా ? అనేది సందేహం.
పురాతన కాలంలో అంటే ఆర్యులు సింధూ మైదానాలకు రాక ముందు ,అనగా ద్రావిడ నాగరికత బాగా వెల్లి విరిసిన మొహంజదారో హరప్పా కాలంలో , ద్రవిడులు మాట్లాడే భాషా సమూహాలన్నింటినీ ( ప్రొటో ద్రావిడ భాషలో  మొత్తం 21 మాండలికాలు ) భాషా శాస్త్ర వేత్తలు 3 భాగాలుగా విభజించారు .
ఆర్యులు ఉత్త భారత సింధు ,గంగా మైదానాలను పూర్తిగా ఆక్రమించుకొన్న తర్వాత ద్రావిడులు వింధ్య పర్వత ,దానిని కూడ దాటి దక్షిణా పధానికి తరలి వచ్చారు .
ద్రావిడ జాతి కి చెందిన ఆంధ్రులు సంచార తెగలుగా తిరుగాడిన  ప్రాంతాలు ముఖ్యంగా దక్కన్ పీట భూమి ,క్రిష్ణా ,గోదావరి నదీ తీర ప్రాంతాలు .
ఆంధ్ర ప్రాంతంలో బతికే  ద్రవిడ తెగలైన దేసి ,నాగ ,యక్ష తెగలన్నీ తెలుగు భాష మాట్లాడే ఆంధ్రులుగా చలామణీ అయ్యారు .
పురాతన ఆంధ్ర ప్రాంతాలు ఏవి ?
తుంగా నది ,అంద్రి (హంద్రి) నదీ తీరాలు   ,వింధ్య ,దక్కన్ పీట భూమి ప్రదేశాలు.
తెలుగు ద్రావిడ భాషా ?
విభక్తులు,ప్రత్యయములు",కర్త- కర్మ-క్రియ పదాల పొందిక -వీటిని బట్టి తెలుగు భాష ద్రవిడ భాషా జాతికి చెందినదని నిర్దారించారు .
క్రీ.శకం 500 ముందు పాక్రుతం రాజ భాషగా ఉండేది . సంస్క్రుతం కావ్య భాషగా ,దేవ భాషగా ఉండేది. గుప్తుల ,పల్లవుల యుద్దాల వల్ల ప్రాక్రుతం కనుమరుగైన తర్వాత ,తెలుగు భాష పై సంస్క్రుత భాష ప్రభావం పడింది .
1000.డి.లో,ఆది కవి నన్నయ్య భారతం తెనిగించిన తర్వాత తెలుగు భాష ప్రాముఖ్యత బాగా పెరిగి సంస్క్రుతాన్ని మించి పోయింది . తెలుగు ,  సంస్క్రుతంలోని  'త త్సమాసాల' ను గ్రహించి తనలో కలుపుకొంది

తెలుగు జాతి  ,తెలుగు భాష  ,తెలుగు ప్రాంతం  ఇప్పుడు 9 కోట్ల మంది  వారసత్వం .
నుడికారం ,మమకారం ,సంప్రదాయం  తేట తెలుగు  భావుకత్వం .
విడదీసి పడ  గొట్టాలని  అధికారం చలాయించాలని  ఉద్యమాలతో పిరి తీసే  నాయకత్వం..


Tuesday 27 November 2012

శబ్ద శాస్త్రం : ( the science of Sound )

శబ్ద శాస్త్రం  : 
వేద ఋషులు శబ్దం ,దాని ధర్మాలు ,ఉపయోగం వీటి గురించి పరిశోధించి , యంత్రాల సాయం లేకుండా మనిషి ఎలా  ఈ శబ్ద శక్తిని వినియోగించుకోవచ్చు అనే విషయం ఆలోచించి  భాషకు ఛందస్సు ,వ్యాకరణం ,శిక్ష ,సంగీతం మున్నగు విధి విధానాలు ఏ ర్పాటు చేశారు.

భాష  ,అది పలికే విధానం ,ఎంత బలంగా ఎక్కడ నొక్కి పలకాలి ,ఎక్కడ దీర్ఘం తీయాలి , అనే నియమాలు మంత్రం శాస్త్రానికి పునాది . 
that's why, irrespective of the meaning of the words, the Mantra must be intoned in the proper way, according to both sound (Varna) and rhythm (Svara). 
నాదం స్వర ,లయ బద్దం ఐతే సంగీతం .
నాదం చందోబద్దం ఐతే మంత్రం.
నాదం మనిషి పలికితే అక్షరం .
శ్రద్ద ,సహనం ,శరణాగతి ఉంటే ప్రతి అక్ష ర మూ మంత్రమే.

సృష్టి ఎలా జరిగింది ? 
ఋషుల ఊ హకు ,అంతర్ యానానికి ,  అందిన సత్యం వివిధ ఉపనిషత్ లలో విశదీ కరించారు .
స్రుష్టి కి ముందు శుద్ద జ్ఞానం (నిర్గుణ బ్రహ్మ)మాత్రమే ఉంది. జ్ఞానానికి  గుణ మేళ నం (త్రిగుణ) కలిగినప్పుడు అనుభుతి తద్వారా శక్తి , శక్తి వివిధ రూపాలైన శబ్దమూ ,కాంతి ఉత్పన్నమై , వాటి నుండి మానసం ఏర్పడింది . మానసం లో కలిగిన సంకల్పమే స్రుష్టి .
 శుద్ద జ్ఞానమూ -->అనుభూతి -->శక్తి -->శబ్దం ->కాంతి->మానసం --> సంకల్పం -->స్రుష్టి .

శుద్ద జ్ఞానం నుండి అనుభూతి వస్తుంది .
అనుభూతి నుండి శక్తి వస్తుంది.
శక్తి నుండి శబ్దమూ ,శబ్దం నుండి కాంతి , కాంతి నుండి మనస్సూ పుడతాయి .
మనస్సు ఆలొచనల ఉత్పత్తి మరియు ప్రవాహ స్థానం .

శబ్దం నుండి అక్షరం
కాంతి నుండి వర్ణం
ఆలోచన నుండి సంఖ్య

 శబ్దమూ , అంటే అక్షరం
కాంతి , అంటే వర్ణమూ
రెంటి సాయంతో మనస్సుని నియంత్రించుకొంటూ భౌతిక కాన్షస్ నుండి తప్పుకోవడమే మంత్ర పరమార్ధం .
కాన్షస్ నెస్స్ ని భౌతిక స్థాయి నుండి మార్చుకొవడమే సాధన .

సంస్క్రుతంలొ 51 అక్షరాలున్నాయి . ప్రతి అక్షరానికి ఒక అంకె , వర్ణమూ , శబ్దమూ , శక్తీ , తత్వమూ , తన్మాత్ర ఉంటాయి .
అక్షరాలను ఒక క్రమ పద్దతిలొ , రకరకాల స్థాయీలలో , వివిధరీతులలో ,వివిధ బలాలతొ , ఒక ప్రత్యెక రూపాన్ని ఊహిస్తూ పలుకడమే మంత్రం .
మంత్రాన్ని ఒక విధమైన శాస్త్రీయ పద్దతిలొ ఉచ్చరించడాన్ని , అనుష్టానం చేయడాన్ని తంత్రం అంటాం .
పైన చెప్పుకొన్నవన్నీ ఒక బొమ్మ రూపంలో వేయడాన్ని యంత్రం అంటాం .

పరా , పశ్యంతి ,మధ్యమా , వైఖరీ - భిన్న రీతులలో మంత్రాన్ని స్మరించడమే మంత్ర సాధన .
 అధి భౌతిక స్థాయిలకు మన ఎరుక చేరటానికి మంత్రం తాళం చెవిలా పని చేస్తుంది .
 శరీరం , మనస్సు , తర్వాత భావ శరీరం , తర్వాత కారణ శరీరం , పై ఆత్మ సన్నిధి కి మన ఎరుక చేరుకొవడానికి ఒక మార్గం మంత్రం .
అంటేఎరుక ఆత్మగత మవ్వాలంటే ఆరోగ్యమైన శరీరం ,ప్రశాంత మనస్సు , గట్టి సంకల్పం , ఓర్పు ఉండాలి .

బీజాక్షరాలు , ఏ  వాక్య మంత్రాలు ,మంత్ర మాలలు ,మంత్ర సంపుటీకరణలు , నామ మంత్రాలు ,భాషా , వ్యాకరణం , శిక్ష - ఇలాంటి సంగతులు త్వరలో  చెప్పుకొందాం

ఎన్నో సందేహాలకు భగ వద్గీత :

మనిషి మనస్సు ఓ క్షేత్రమని అనుకొంటే, అరిషడ్వర్గాలు కౌరవులుగా ,బుధ్ధి వివేక విచక్షణలు పాండవులుగా జరిగిన ,జరుగుతున్న అంతర పోరాటమే మానసిక అంతర్మధన కురుక్షేత్ర  యుద్దం .


మనిషి మనస్సులో ఇంత చింతన , మోహం , విషాదం ,భయం , పిరికితనం ,బేలతనం , నిరాశ , నిస్ప్రుహ ఎందుకు కలుగుతున్నాయి ?
 మన కర్తవ్యాన్ని ఎందుకు అమలు చేయలేక పొతున్నాము ?
 ఏది ఉచితమో , ఏది అనుచితమో తెలియక ఎందుకు  
గందరగోళ పడుతున్నాము ?
మన స్వ ధర్మాన్ని ఎందుచేత గుర్తించలేక పోతున్నాము ?
అసలు స్వ ధర్మం అంటే ఏమిటి ?
స్వధర్మాన్ని త్యజించడం ఎందుచేత మంచిది కాదు ?
మనస్సు సమస్యలనుండి , బాధ్యతల నుండి తప్పించుకోవాలని ఎందుకు ఆరాటపడుతుంది ?

కాలానికి అతీతముగా ఉండేది ఏది ?
ఏది సత్య మైనది ? అంటే నిరంతరం ఉండేది ఏది ?
ఏది అనిత్యమైనది ? ఏది శాశ్వతమైనది ?
ధీరుల లక్షణాలు ఎలా ఉంటాయి ?
మోక్షానికి అర్హతలు ఏమిటి ?
ఎవరు అజ్ఞాని ?

ఆత్మ లక్షణాలు ఏమిటి ?
పునర్జన్మ ఎలా సంభవిస్తుంది ?

సుఖ దుఖాలను ,జయాపజయాలను , లాభ నష్టాలను సమానముగా స్వీకరించే మానసిక స్థాయి మనిషికెందుకు అవసరం ?
సమత్వ బుధ్ధి  , నిష్కామ కర్మాచరణ నిశ్చల మనస్సుకి దారి తీస్తుంది . 
నమ్మ వచ్చా ?

పరమాత్మ అంటే ఏమిటి ? పరమాత్మ ప్రాప్తి అంటే ఏమిటి ? 
పరమానందం అంటే ఏమిటి?
వేదాలు ఎవరికోసం ?
బ్రహ్మ ఝ్నాని అంటే ఎవరు ?
యోగమంటే సమత్వ భావమేనా ?
ఫలాసక్త్తి తో  కర్మలు చేయ కూడదా  ?
ఇంద్రియ సుఖాలని నిగ్రహించడం వేరు . ఇంద్రియ సుఖములందు ఆసక్తి తొలగిపోవుట వేరు .
విషయాసక్తిని ఎలా తొలగించు కోవాలి ?
 గీత మన సందేహాలను చక్కగా తీర్చుతుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ :
మనిషి వివేకాన్ని ఎలా ఎందుకు కోల్పోతాడు ?
విషయాసక్తి వలన కోరిక ,అది తీర నప్పుడు క్రోధం , క్రోధం వలన వ్యామోహం ,దాని వలన మానసిక చంచలత  ,దాని వలన బుద్ది మందగించి , మనిషి పతనమవుతాడు .
ఇంద్రియ నిగ్రహం ,మనో నిగ్రహం లేని వానికి వివేకం ఉండదు .

Monday 26 November 2012

యోగం అంటే ఏమిటి ?

 భౌతిక ప్రపంచం-( ఇహం)లో , ఏ పదార్ధాలు , ఏ భావాలు ,
 ఏ అనుభూతులు ,ఏ శబ్దాలు , ఏ బింబ ప్రతి బింబాలు ఉన్నాయో  ,
అవన్నీ' మాయ ' వల్ల  కలిగేవి .
భారతీయ వేదాంత తత్వశాస్త్ర సారమే ఈ  ప్రకటన. 

మాయ" అంటే  ఏమిటి ? అన్నింటినీ మనవే అనుకొని ,వాటిని పొందాలని తా పత్రయపడటం,బంధాలు ,ప్రేమలు ,బంధుత్వాలు , ధనము ,కీర్తి ,సుఖ  దుఖాలు  అన్నీ శాశ్వతమని అనుకోవడమే మాయ .(Attachment of all things with 'ego'). 

నేను- నాది అనే సంకుచిత భావనే అహం. 
"నేను ఉన్నాను " అనే స్ఫురణ నే ఆత్మ అంటాం . 
నేను అనే ఉనికి  కేవలం దేహానికి, కుటుంబానికి పరిమితం చేసుకోవడమే అహంకారం.
what is ego?
 
conditioning of the mind faculty with assumptions,presumptions and prejudices.

మరి ఏది సత్యం? 
మాయ కానిది సత్యం .
ఇహానికి చెందనివి ,  పరానికి చెందేవే   అసలైన యదార్ధం .( Real reality ).
అవే   పర బ్రహ్మ ,పరమ సత్యం ,పరమానందం ,పరంధామ ,పరః నాదం (అనాహత నాదం ) .

మాయ' మిధ్య అని ,పరబ్రహ్మామ్  అనే విషయమే నిజమైన సత్యమని ఎవరు చెప్పారు ? 
అది  మనం నమ్మి ఈ జీవితంలోని సుఖ దుఖాలను వదిలివేయాలా?
సంసారం బండి చక్రం లాగా తిరిగే చావు పుట్టుకల పరంపర. సంసారాన్ని వదలమని ఎవరూ  చెప్పరు .సుఖం కలిగినప్పుడు సంతోషంలో  , దుఖం వచ్చినప్పుడు విచారంలో మునిగి  క్రుంగి పోకుండా ,సుఖ దుఖాలను సమానంగా సమ భావనతో అనుభవించమని , అలాంటి సమ తుల్య మానసిక స్థితి లేని వారు సంపూ ర్ణ శరణాగతి తో దేవుని పైనో లేదా గురువు పైనో భారం వేసి లేదా కర్మ ఫలాపేక్ష లేకుండా ధర్మ విహిత భాధ్యతలను ,కర్మలను చేయమని , జరిగే సంఘటనలను ,జీవితాన్ని సాక్షీ భావంతో చూడటం అలవాటు చేసుకోవాలని , ఇలా
 సంసారాన్ని ఈదమని వేద ఉపనిషత్  ఋషులు , శ్రీ కృష్ణుడు చెప్పారు .
 అంటే , మనిషి ,మానసిక పరి పుష్టత ,ప్రశా మ్ తత ,ఆనందం తో
 జీవనం సాగించాలని , జీవితాలను సంతోషంగా  మానేజ్ చేసుకోవటానికి రుషు లిచ్చిన ఫార్ములా .

మనం కష్టాలు సుఖాలు అనుకోనేవన్నీ ఇతరులు  అంటే  సంఘం దృష్టిలో కొలుస్తాము .
 కనీస అవసరాలైన తిండి ,బట్ట ,నీడ ,రక్షణ ప్రతి   మానవుడికి అందే అవకాశం ప్రక్రుతి పరంగా  ఎప్పుడూ ఉంటుంది .
కానీ , డబ్బు , కీర్తి ,అధికారం ,అప కీర్తి , దరిద్రం , అందం , అనాకారి త్వం ,సౌకర్యాలు ,బానిసత్వం ,ఓటమి ,విజయం , - ఇవన్నీ ఇతరుల అభిప్రాయాలతో ,పోలికతో ముడి పడి  ఉన్న విషయాలు .
అందుకే  దేశ  కాల మాన స్థితుల బట్టి మారే ఈ విషయాలను ఎక్కువగా పట్టించు కోవద్దు ,  మనస్సు  వికలం చేసుకోవద్దు అని గీతలో చెప్పారు .

అంటే ,సంఘ అభిప్రాయాలకు విలువ ఇవ్వ నక్కర లేదా ? సంఘంతో పని లేకుండా మన ఇష్ట మొచ్చిన ట్లుగా ప్రవర్తించ వచ్చా ?
అలా అని .కాదు . కష్ట  నష్టాల లో మన మానసిక స్థితిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో  గీత చెప్పింది . సంఘాన్ని గౌరవించమని చెప్పింది . నీ మనస్సు ని   సదా  సంతోషంగా ఎలా ఉంచు కోవాలో చెప్పింది . సంఘానికి , దాని రక్షణకు మనిషి ఎప్పుడూ పాటు పడాలి .నువ్వు సంఘానికి ఏమి ఇస్తావో ,సంఘం కూడా అదే నీకు ఇస్తుంది . కాబట్టి మనిషి ఎప్పుడూ ఇతరులకు మంచే చేయాలి .

భౌతిక పరమైన వన్నీ మిధ్య అనీ , ఆత్మ ఎల్లప్పుడూ శాస్వతంగా ఉంటుమ్ దనేది  
ఎలా నిరూపిస్తారు ? 
  మిధ్య ప్రపంచానికి ,నిజమైన పరా ప్రపంచానికి  వారధి వేయ టా న్నే యోగం అని అంటారు .
 వారధిని ఎలా కట్టాలి ?
how to expand the consciousness from the finite to infinite?
how to strike rhythm between individual and cosmic vibration?

శబ్దం తో నా? రూపం తో నా? భావం తో నా? కర్మ తోనా?
శబ్దం ద్వారా అంటే మంత్ర సాధన / మంత్ర యోగం.
రూపం అంటే విగ్రహారాధన భక్తీ యోగం .
భావం అంటే జ్ఞాన యోగం.
నిష్కామ కర్మ ద్వారా అంటే కర్మ యోగం .

అన్ని యోగ మార్గాలు ఆరంభం లో భిన్నంగా ఉన్నా ,
చివరి దశలో అన్నీ ఒకే విధంగా ఉంటాయి .
ఇది సాధకులందరూ  గుర్తు పెట్టు కోవలసిన విషయం .