Search This Blog

Monday 19 February 2024

అమరావతి ఫైల్స్

 





అమరావతి ఫైల్స్ 1: చంద్రబాబు ఇప్పుడున్న అసెంబ్లీ ,Secretariat, హై కోర్ట్ భవనాలకు తాత్కకాలిక అని ఎందుకు అనాల్సి వచ్చింది ?? అమరావతి భూసేకరణ లో 90% 2015 లోనే పూర్తి అయ్యింది Master plan కూడా 2015 సెప్టెంబర్ కల్లా పూర్తి అయ్యింది కానీ అమరావతి అనుమతులు కావాలి అంటే NGT అనుమతి అవసరం. నార్మల్ గా అయితే అది వెంటనే వచ్చేది కానీ వైసీపీ వాళ్ళు కేసులు వేయించి అనుమతి రాకుండా అడ్డుకున్నారు ఫైనల్ గా NGT అనుమతులు నవంబర్ 17 2017 న వచ్చింది. NGT అనుమతులు లేకుండా రాజధాని కట్టటం కుదరదు. అందుకే ఏపీ ప్రభుత్వం రాజధాని భవనాలు కట్టటానికి "తాత్కాలిక" పెర్మిషన్ తెచ్చుకుంది. master plan ప్రకారం కాకుండా వేరే చోట కట్టటానికి అనుమతులు తెచ్చుకుంది. వైసీపీ వాళ్ళు తాత్కాలిక పేరుతో permanent రాజధాని కట్టేస్తున్నారు అని ఎక్కడ NGT దగ్గర మళ్ళా గొడవచేస్తారో అని .. ప్రాజెక్ట్ మొత్తం తాత్కాలిక అనే పేరుతో చేశారు. అప్పటి ప్రభుత్వం ఇది ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సింది .. ఇవ్వలేదు అసలు అమరావతి రాజధాని పనులు NGT అనుమతి వచ్చిన తరువాత .. January 2018 లో మొదలు అయ్యాయి. మీరు చూస్తున్న భవనాలు అన్ని 15 నెలలలో కట్టేసినవే.
Not only that,adi interim ane name tho chesaru There is difference btw interim and Tatkalika/temporary. YCP publicised it as temporary but they r interim and not temporary which TDP failed to give publicity.


అమరావతి ఫైల్స్ 2 అమరావతి స్మశానం అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు కానీ అమరావతి లో 3 అతి పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు అయ్యాయి అని ఎంత మందికి తెలుసు ఆ మూడిటిలో ఒకటి "India's No:1 Upcoming University" VIT కనీసం రోడ్డు కూడా వెయ్యకుండా జగన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నా .. VIT వాడు బాబుగారి కి ప్రామిస్ చేసినట్టు కట్టుకుంటూ పోతున్నాడు ప్రస్తుతానికి ఆ యూనివర్సిటీ లో 25000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు బాబు గారు Phase 1 లో ఇచ్చిన లాండ్ మొత్తం వాడేసాడు. ఆయన వచ్చి రెండో ఫేస్ మొదలు పెట్టించాలి. కేవలం ఈ University లోనే 60-70000 స్టూడెంట్స్ వుంటారు అమరావతి లో వున్న ఉన్నత విద్యా సంస్థలు అన్ని పూర్తి అయ్యేసరికి .. రెండులక్షల వరకు స్టూడెంట్స్ వుంటారు.

అమరావతి ఫైల్స్ 3 NID : National Institute of Design పురంధేశ్వరి గారు కాంగ్రెస్ కేంద్ర HRD minister of State గా వున్నప్పుడు విజయవాడ కి రెండు కేంద్ర సంస్థలు ఇచ్చారు 1. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) 2. School of Planning and Architecture (SPA) అప్పట్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కనీసం భూమి ఇచ్చే ప్రయత్నం కూడా చెయ్యలేదు. రెండేళ్ల తరువాత SPA అద్దె భవనాలలో మొదలయ్యింది .. NID కి ఆ అదృష్టం కూడా దక్కలేదు ( జగన్ మోహన్ రెడ్డి బయటపడ్డాడు కానీ .. ఏ సీమ రెడ్డి ముఖ్యమంత్రి కూడా విజయవాడ - గుంటూరు ప్రాంతానికి ఏమి చెయ్యలేదు .. ఆ ప్రాంతం చూస్తే సీమ రెడ్లకు అదో రకమైన insecurity) బాబు గారు 2014 లో ముఖ్యమంత్రి అయ్యిన వెంటనే NID temporary campus Nagarjuna University లో ఏర్పాటు చేసి .. 2015 నుంచి మొదటి బ్యాచ్ మొదలు పెట్టించారు. SPA కి కూడా విజయవాడ నడి బొడ్డులో .. polytechnic College లో నిరుపయోగంగా వున్న లాండ్ లో కొంత SPA కి allot చేశారు. Venkaiah Naidu గారు వెంటనే College కట్టటానికి నిధులు ఏర్పాటు చేయించి. రెండు సంవత్సరాలలో పూర్తి చేసేశారు. NID కి అమరావతి లో 50 ఏకరాల లాండ్ ఇచ్చారు. పనులు కూడా మొదలు పెట్టారు. గత ప్రభుత్వం ఆఖరి సంవత్సరంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొంచెం slow చేసింది. ఆ తరువాత ఆ ఇన్స్టిట్యూషన్ గురుంచి అడిగే వాడు లేడు. పని మొదలు పెట్టీ 7 సంవత్సరాలు తరువాత ఇది పరిస్థితి. 👇👇 VIT & NID పనులు ఒకేసారి మొదలు అయ్యాయి. అది ప్రైవేట్ అవ్వటం వల్ల వేగం గా పనులు చేసి .. మొదటి సంవత్సరం లోనే క్లాసులు మొదలు పెట్టీ .. NID కంటే 30 రేట్లు ఎక్కువ కట్టడాలు పూర్తి చేశారు ( ఫోటో అమరావతి ఫైల్స్ 2 పోస్ట్ లో చూడొచ్చు) ప్రభుత్వం రోడ్డు ఇవ్వకపోయినా VIT వాడు ముందుకు వెళ్ళాడు NID కేంద్ర ప్రభుత్వ సంస్థ అందుకే లైట్ తీసుకున్నాడు బాబు రావాలి NID కొత్త campus లో క్లాసులు మొదలు పెట్టాలి.

National Institute of Fashion Technology (NIFT), Central Institute of Tool Design (CITD), Indian Institute of Plantation Management (IIPM) e institutes kuda Central Govt Vijayawada ki allot chesindi vatiki Amaravati, Gannavaram lo land allot chesaru avi jaragaledhu.

Amaravati Files - 4 అమరావతి లో ఉద్యోగులు , IAS / IPS అధికారులు , MLA / MLC లు నివాసాల కోసం కట్టిన ఇళ్లు 75% పూర్తి అయ్యాయి జగన్ మోహన్ రెడ్డి ఆ పనులు ముందుకు తీసుకెళ్లినట్లు అయితే ఇంకో ఆరు నెలలలో పూర్తి అయ్యేవి. మహా అయితే ఇంకో 1000 కోట్లు ఖర్చు అయ్యేవి ఇవి ఉద్యోగులు కి ఇచ్చినట్టు అయితే ప్రభుత్వానికి నెలకి HRA రూపములో 70 కోట్లు మిగిలేవి. ( ఈ 70 కోట్లు లెక్క ఎక్కడ నుంచి వచ్చింది అని మీరు అడగొచ్చు. రెండు రోజులు క్రితం ఏపీ ప్రభుత్వం నెలకి 70 కోట్లు అద్దె CRDA కి చెల్లిస్తునట్టు ఒక GO ఇచ్చింది ) అంటే 50 నెలలో ప్రభుత్వానికి 3500 కోట్లు ఆదాయం వచ్చేది. బిల్డింగ్లు పూర్తి అయ్యేవి. వెయ్యి కోట్లు ఖర్చులకు పోను .. మిగిలిన 2500 కోట్లు తో secretariat భవనాలు కట్టి వుంటే జగన్ కి పేరు కూడా వచ్చేది. వాళ్ళ కాంట్రాక్టర్లకు పనులు కూడా దక్కేవి. కానీ జగన్ మంచి పేరు కంటే అమరావతి నాశనం ఎక్కువ కోరుకున్నాడు ..


Amaravati Files - 5 అమరావతి మునగాలి అంటే ప్రళయం రావాల్సిందే !! అమరావతి announce చేసిన వెంటనే అమరావతి ముంపు ప్రాంతం అని నీలి బ్యాచ్ ప్రచారం మొదలు పెట్టింది అసలు అమరావతి మునుగుతుందా ?? అమరావతి కి రెండు ముంపు ముప్పులు వున్నాయి 1. కృష్ణ నదిలో వచ్చే వరద వల్ల 2. కొండవీటి వాగు వల్ల కొండవీటి వాగు వల్ల వచ్చే ముంపు గురుంచి అమరావతి ఫైల్స్ 6 లో మాట్లాడుకుందాం. ఇప్పుడు కృష్ణ నదిలో వచ్చే వరద వల్ల వచ్చే ముంపు గురుంచి ఇప్పుడు మాట్లాడుకుందాము అమరావతి నగరం కృష్ణా నది ఒడ్డున వుంది. నగరానికి వున్న నాలుగు పక్కలలో ఒక పక్క ( నార్త్) కృష్ణ నది వుంటుంది ( 15km river front వుంటుంది) కృష్ణ నదికి వరదలు వస్తె .. అమరావతి మునాగాలి కదా అనే డౌట్ అందరకీ రావొచ్చు. అమరావతికి ఆనుకుని వున్న కృష్ణ బ్యారేజి లో ఎప్పుడు సముద్ర మట్టం నుంచి 17.3 మీటర్లు ఎత్తులో నీరు నిలువ వుంచుతారు కృష్ణ బ్యారేజి మీద వున్న ఎత్తు సముద్ర మట్టం నుంచి 25 మీటర్లు అమరావతి వైపు వున్న కరకట్ట ఎత్తు సముద్ర మట్టం నుంచి 25 మీటర్లు 2009 లో వచ్చిన 100 సంవత్సరాలలో అతి పెద్ద వరద ఎత్తు 21 మీటర్లు .. అప్పుడు 11 లక్షలు cusecs వరద వచ్చింది. అమరావతి మునగాలి అంటే 25 మీటర్లు కన్నా ఎక్కువ ఎత్తు వరద రావాలి అంటే 25 లక్షలు cusecs వరద రావాలి 11 లక్షలు cusecs వరద శ్రీశైలం నుంచి వదిలినప్పుడే శ్రీశైలం ఏమైపోతుందో అని భయం వేసింది .. 25 లక్షల వరద శ్రీశైలం నుంచి వదలాలి అంటే ... శ్రీశైలం కొట్టుకు పోతుంది .. కింద నాగార్జున సాగర్ కొట్టుకు పోతుంది చెప్పాలి అంటే .. కర్నూల్ నుంచి బంగాళ ఖాతం వరకు మొత్తం వరద మించితే కానీ అమరావతి లోకి చుక్క నీరు అమరావతి లోకి రాదు. అది పరిస్థితి అమరావతి లోకి వరద రావాలి అంటే ప్రళయమే రావాలి కొండవీటి వాగు ముంపు గురుంచి .. చంద్రబాబు క్రైసిస్ నీ oppurtunity గా ఎలా మర్చేసాడో .. అమరావతి ఫైల్స్ 6 లో మాట్లాడుకుందాము
Image


అమరావతి ఫైల్స్ 6 కొండవీటి వాగు ముంపు - చంద్రబాబు క్రైసిస్ నీ oppurtunity గా ఎలా మార్చేశాడు అమరావతి కి నిజంగా ముంపు ప్రోబ్లం ఏదైనా వుంది అంటే అది కొండవీటి వాగు వల్ల వుంది కొండవీటి వాగు ప్రస్తుత రాజధాని ప్రాంతంలో నెక్కల్లు దగ్గర ప్రవేశించి , శాఖమూరు వరకు తూర్పు దిశగా ప్రయాణించి , అక్కడ నుంచి దక్షిణ దిశగా నీరుకొండ వరకు వెళ్లి .. అక్కడ నుంచి ఈశాన్య దిశగా ప్రయాణించి , ప్రకాశం బ్యారేజి దగ్గర కృష్ణ నదిలో కలుస్తుంది. ప్రస్తుత రాజధాని లో ఆల్మోస్ట్ 25 km ప్రవహిస్తుంది రాజధాని లో ఇంకో వాగు పాలవాగు. ఈ రెండు వాగులు కలిపి రాజధాని ప్రాంతం లో 40 కిలోమీటర్లు పైనే ప్రవహిస్తాయి కొండవీటి వాగు వల్ల మామూలు రోజులలో ముంపు వుండదు .. కానీ కొండవీటి వాగు కు కృష్ణ నదికి ఒకేసారి వరద వస్తేనే ఇబ్బంది. కృష్ణ నది లో వరద వున్నప్పుడు కొండవీటి వాగు వరద వెనక్కి తన్ని .. అమరావతి లో ముంపు ఏర్పడుతుంది అందుకే చంద్రబాబు గారు అన్నిటికన్నా ముందు ఈ problem నీ అడ్రెస్స్ చేశారు. ఆయన కొండవీటి వాగు లిఫ్ట్ కట్టించారు .. కృష్ణ నదికి వరద వచ్చినప్పుడు కొండవీటి వాగు వరదని కృష్ణ నదిలోకి ఎత్తి పోస్తారు అన్నమాట .. అవసరమైతే కొంత వరద నీ గుంటూరు కాలువ లోకి కూడా డైవర్ట్ చేస్తారు. ఇది చెయ్యటం వల్ల కొండవీటి వాగు ముంపు ప్రోబ్లం నీ అమరావతి పనులు మొదలు పెట్టక ముందే solve చేశారు. ఇదే కాకుండా .. కొండవీటి వాగు వెడల్పు నీ 100 మీటర్లు వరకు పెంచుతున్నారు. శాఖమూరు, నీరుకొండ , కృష్ణయ్యపాలెం లో కొండవీటి వాగు మీద బాలన్సింగ్ చెరువులు తవ్వుతున్నారు .. పాలావాగు కూడా వెడల్పు చేస్తారు. కృష్ణ బ్యారేజి లో ఎప్పుడు సముద్రమట్టం నుంచి 17.5 మీటర్ల ఎత్తులో నీళ్ళు వుంటాయి. ఇప్పుడు అమరావతి లో అన్ని వాగులలో కూడా అదే ఎత్తు కి నీళ్ళు నిత్యం వుంటాయి. దీని వల్ల 45 కిలోమీటర్లు బారు waterfront Property Amaravati లో వుంటుంది అమరావతి మొత్తం బోట్లు లో తిరిగి రావొచ్చు. అసెంబ్లీ దగ్గర బోట్ లో బయల్దేరి .. అమరావతి చుట్టు తిరిగి (40km) మళ్లీ అసెంబ్లీ దగ్గరకి రావొచ్చు. ఒక ముంపు ప్రోబ్లం కి సొల్యూషన్ వెతుకుతూ .. 45 కిలోమీటర్లు బారు waterfront real-estate , tourism , navigation వంటి opportunities శృష్టించాడు Chandrababu. మనకి వున్న కుళ్ళు బుద్ది ఒప్పుకోదు కానీ .. అమరావతి తెలుగు జాతికి ఒక గోల్డ్ mine.





Thursday 1 February 2024

Jagannath Rathyatra



Jagannath Rath Yatra is a Hindu festival that celebrates the journey of Lord Jagannath, his brother Lord Balabhadra, and his sister Goddess SubhadraThe festival takes place annually on the second day of the Odia month of Ashadha Shukla Tithi.

During the festival, devotees pull the three deities in three large wooden chariots along the grand avenue to the Gundicha Temple. The deities stay at the temple for a week and then return to the Jagannath temple.The Rathas are huge wooden structures with wheels that are built anew each year. The chariot for Jagannath is about 45 feet high and 35 feet wide, and takes about two months to construct!

నీలాద్రి నాథం నమామి నిత్యం నమామి నిత్యం నీలాద్రి నాథం. నీలాద్రి నాథం నమామి నిత్యం నమామి నిత్యం నీలాద్రి నాథం నమీ ప్రణోమి నమస్కరోమి నమీ ప్రణోమి నమస్కరోమి గృణామి నిత్యం నీలాద్రి నాథం. || నీలాద్రినాథం || ఆనందకందం సుచ్ఛందస్యందం పూర్ణారవిందం సదైవ వంద్యం ఆనందకందం సుచ్ఛందస్యందం పూర్ణారవిందం సదైవ వంద్యం నమీ ప్రణోమి నమస్కరోమి నమీ ప్రణోమి నమస్కరోమి ముఖారవిందం సదారవిందం. ||నీలాద్రినాథం|| అశేషతోషం సుహాసవాసం మధుప్రకాశం విషవినాశం అశేషతోషం సుహాసవాసం మధుప్రకాశం విషవినాశం నమీ ప్రణోమి నమస్కరోమి నమీ ప్రణోమి నమస్కరోమి శ్రీశం సురేశం జగదీశ మీశం ||నీలాద్రినాథం|| సదా వసంతం హృది హాసంతం శ్రియలసంతం శుభం స్మరంతం సదా వసంతం హృది హాసంతం శ్రియలసంతం శుభం స్మరంతం నమీ ప్రణోమి నమస్కరోమి నమీ ప్రణోమి నమస్కరోమి సంసారసారం కరుణావతారం. ||నీలాద్రినాథం|| మనోభిరామం నికామకామం స్వయం ప్రమాణం పూర్ణా పురాణం మనోభిరామం నికామకామం స్వయం ప్రమాణం పూర్ణా పురాణం నమీ ప్రణోమి నమస్కరోమి నమీ ప్రణోమి నమస్కరోమి నారాయణాచ్ఛ ప్రణోమి నౌమి. ||నీలాద్రినాథం||
courtesy: Dr. Ruru Kumar Mahapatra wrote this lyric.

Friday 7 July 2023

గోత్ర నామాలు -ప్రవరలు


 భారతీయ సనాతన సాంప్రదాయమున దైవ లేక గురు సముఖమున తమ వంశ - వంశ మూల పురుషుల పరిచయమును ఋషి-గోత్ర ప్రోక్తము గా చేసుకునే విధానము ఉన్నది.

గోత్రము అంటే ? -సమూహము ను గుర్తించే విధానమే గోత్రం. అది ఆలమంద కావచ్చు, మానవ సమూహాలు కావచ్చు!

సనాతన కాలములో గోవులే సొమ్ములు,సంపదలు. అలాగే సంతానమే సౌభాగ్యం. భూమిని దున్ని , పాలిచ్చి  ,పాడిపంటలకు మనిషికి చేదోడుగా మెసలే గోజాతికి ,  సుఖసంతోషాలను ఇచ్చే సంతానానికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చి కాచుకొనేవారు.  గోవులను ,గోశాల లను, వాటిల్లో వచ్చే సమస్యలను ,అలాగే మానవ సమూహాలఆరోగ్య మును , అది వ్యాధులను , మానసిక సమస్యలను పారద్రోలే శాస్త్రవేత్తలు,సామాజిక వేత్తలనే ఆనాడు ఋషులుగా కొలిచేవారు. ఆయా ఋషుల పేరిట ఆయా సమూహాల ను గుర్తు పెట్టుకునేవారు. ఆ గుర్తే గోత్రమైనది.  

'గోత్రం' అంటే అనేక అర్థాలు ఉన్నాయని శ్రీ సూర్యాయాంధ్ర నిఘంటువు (పేజీ. 734) వివరిస్తోంది. వాటిలో 1. వంశం, 2. గుంపు, సమూహం, 3. పేరు, 4. గొడుగు, 5. బాట అనేవి ఇక్కడ పేర్కొవచ్చు. వీటిలో ఏదైనా ఇక్కడి సందర్భానికి సరిపోతుంది.

'గోత్రం' అనే పదం 'గౌః' అనే సంస్కృతపదం నుంచి ఆవిర్భవించింది. 'గౌః' అంటే గోవులు, ఆవులు అని అర్థం. 'గోత్ర' అనే సంస్కృత పదానికి 1. భూమి, 2 గోవుల సమూహం అని రెండు అర్థాలు ఉన్నాయి.

  • గోత్రం అనే పదం వేదాలకు వ్యాఖ్యానాలవంటివైన బ్రాహ్మణాలలో ఎక్కడా కానరాదు. 

వేర్వేరు మందలకు చెందిన గోవులు కలిసిపోవటం వల్ల తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించడానికి, అవసరమైన సందర్భాలలో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దలు ఉండేవారు. వీరిని వారి వారి నైతిక, ఆధ్యాత్మిక విలువల ఆధారంగా 'పర్యవేక్షకులు'గా ఎంచుకునేవారు. ఒక మందకు లేదా 'గోత్రాని'కి ఇలా అధినాయకత్వం వహించేవారిని 'గోత్రపతులు' అనేవారని, ఇటువంటి వారిలో సుప్రసిద్ధులైన వారిలో భరద్వాజుడు, శాండిల్యుడు, కాశ్యపుడు వంటి వారు ఉండేవారనీ, వారే క్రమంగా 'ఋషులు'గా గౌరవం పొందారనీ స్వామి భాస్కరానంద తమ 'Essentials of Hinduism' అనే పుస్తకంలో వివరించారు. (Pub. Sri Ramakrishna Mutt, Mylapore, Chennai, 1998, p.22)

ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి, వారంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల వంటి వారే కాబట్టి, సరైన జన్యువులతో వంశం సరిగ్గా వృద్ధి చెందేందుకు 'సగోత్రీకుల'ను వివాహం చేసుకోరాదన్న నిబంధన సమాజంలో ఏర్పడింది. వివాహసంబంధాల కోసం మన గోత్రం కాని ఇతర గోత్రీకులకై అన్వేషించడం వెనుక ఇంత సశాస్త్రీయమైన కారణం ఉందన్నమాట!

జన్యుశాస్త్రం అనేది ఒకటి ఉంటుందనీ, దానివెనుక ఇంత కథ ఉంటుందనీ పశ్చిమ దేశాల శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే మన వాళ్లు గ్రహించిన శాస్త్రీయమైన అంశాలివి!!

పురుషోత్తమ్‌ పండిట్‌ తను రాసిన 'గోత్రప్రవర మంజరి'లో మొత్తం 3 కోట్ల గోత్రాలు ఉన్నాయని అంచనా వేశారు. 

గోత్రం అంటే అభిజనం. ఏఏ మహాత్ములు నీ వంశంలో పుట్టారో ఆ వివరాలే- ఆ మహాత్ముల స్మరణే గోత్రం' అంటారు ద్విసహస్రావధాని, అవధాన సహస్రఫణి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మగారు. 

'బ్రాహ్మణుల గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి. ఉదా. ఆత్రేయస-భారద్వాజస-కౌశికస- ఇట్లా. ఇతరుల గోత్రాలన్నీ ప్రాయశః ప్రకృతి గోత్రాలు. ఉదా. మద్దిపాల, పైడిపాల, చెట్లపాల, చెరకుపాల, కుంభాల - ఇట్లా. పురుషుడు (భగవంతుడు), - ప్రకృతీ రెండూ కలిస్తేనే పరమేశ్వరుడు పూర్ణుడు. ఎక్కువతక్కువలకిక్కడ తావు లేదు' అంటారు శ్రీ మాడుగులవారు!

అసలు ఈ గోత్రాల గొడవ అంతా మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశాలకే పరిమితమై ఉండేదనీ, బ్రాహ్మణులను అనుసరించే ఇతర కులాలూ గోత్రాలను పట్టించుకోవడం ఆరంభమయిందనీ కొందరు అంటారు. 

బౌద్ధమత సంబంధమైన సాహిత్యంలో ఒక క్షత్రియుడు తమ పురోహితుల గోత్రాన్ని స్వీకరించాలన్న సాక్ష్యాలు అనేకం కానవస్తాయని కరందికర్‌ తమ 'Hindu Exogamies' (page 229)లో పేర్కొన్నారు. అంటే, ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై, తర్వాత క్రమంగా ఇతరులు వారిని అనుసరించటంతో, ఇతర కులాలకూ గోత్రాలు వ్యాపించాయి. అందుకే, ఇప్పటికీ కొన్ని ఇతర కులాలవారిలోనూ బ్రాహ్మణ గోత్రాలు కానవస్తుంటాయి.

గోత్రము అనే పదంలో గో అంటే గోవు(గురువు,భూమి, వేదముల స్వరూపము), త్ర అంటే రక్షించుట అని అర్ధం. ఆటవిక జీవనానన్ని గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్ల ఆవువారుకపిలగోవువారు అని, తెల్ల ఆవులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.

 ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, కౌండిన్య అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు. తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.

ఒక్కో మన్వంతరానికి ఈ ఋషులు మారతారు.ప్రస్తుత మన్వంతరానికి, వైవస్వతకు, ఏడుగురు ఋషులు,అత్రి,భృగు,కుత్స,వశిష్ట,గౌతమ,కశ్యప్ మరియు అంగీరస.

అన్ని గోత్రాలు ఈ ఋషుల నుండి ఉద్భవించాయి.

ఒకరి గోత్రం స్పష్టంగా లేనప్పుడు లేదా గోత్రం తెలియనప్పుడు, అతను మానవజాతి మరియు దేవతలకు మూలపురుషుడు కాబట్టి కశ్యప గోత్రాన్ని కేటాయించడం ఆచారం.

'

వారి గోత్రాలు తెలియని వారికి, కుటుంబం అదే జ్ఞానం కోల్పోయినందున లేదా ఒక వ్యక్తి బాల్యంలో అనాథగా మారినట్లయితే - పురోహిత కుటుంబానికి చెందిన గోత్ర మరియు ప్రవర వారి గోత్రం అవుతుంది.

ఆచార్యగోత్రప్రవరణభిజ్ఞస్తు ద్విజః స్వయం |

దత్వాత్మానం తు కస్మైచిత్తద్గోత్రప్రవరో భవేత్ ||

శాస్త్రాలలో ఇవ్వబడిన మరొక పరిష్కారం ఏమిటంటే, కశ్యప గోత్రాన్ని అంగీకరించడం, ఎందుకంటే శ్రుతులు కశ్యపుడిని మొత్తం మానవాళికి పితామహుడిగా ప్రకటించారు.

గోత్రస్యత్వపరిజ్ఞానే కాశ్యపం గోత్రముచ్యతే |

యస్మాదాః శ్రుతిః సర్వాః ప్రజాః కశ్యపసంభవాః ||

క్షత్రియ వర్ణానికి చెందిన వ్యక్తులకు విష్ణు గోత్రాన్ని మరియు వైశ్యులకు జంబు మహర్షి గోత్రాన్ని కేటాయించే పద్ధతి కూడా ఉంది.మరియు శివుడిని ఆరాధించేవారికి శివగోత్రాన్ని కేటాయించే పద్ధతి ఉంది.

తొలుత గోత్రములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూల(తండ్రికి) పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య (సగోత్రీకుల మధ్య) వివాహ సంబంధములు ఉండరాదని, వేరు గోత్రీకుల మధ్య వివాహములు జరపటము మంచిదని వాటి ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాలవారు గోత్రములను ఏర్పరచుకొన్నారు.

బ్రాహ్మణులు వేదవిద్యను అభ్యసించి తాము నేర్చుకున్న వేదమునే యజుర్వేద, ఋగ్వేద అని గోత్రాలను వేదముల పేర్లతో ఏర్పరుచుకొన్నారు. భూములను కలిగిన బోయ/క్షత్రియ జాతివారు భూపతి, మండల, భూపని అనే గోత్రాలను ఏర్పరుచుకున్నారు. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద, ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ బుషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయుడి పేరు మీద గోత్రం ఉంది, ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్లమీదా గోత్రములు ఉన్నాయి

 

ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు వ్యక్తిగతం గా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు...

సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే ! విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆయా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు.

కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను.

గౌతముడు , మరియు ఆపస్తంబుడి ప్రకారము , సగోత్రీయుల మధ్య వివాహాలు కుదరవు....చేసుకోకూడదు... ఎందుకంటే , ఒకే గోత్రములో పుట్టినవారు ఒకే ఇంటీ వారవుతారు. కాబట్టి వారు అన్నా చెల్లెళ్ళో , అక్కా తమ్ముళ్ళో, తంరీ కూతుళ్ళొ , తల్లీ కొడుకుల వరస కలవారొ అవుతారు...

సగోత్రీకులంటే ఎవరు ? నిర్ణయ సింధువు ప్రకారము ,
ఏ రెండు కుటుంబాలకు గానీ " ప్రవర " పూర్తిగా కలిస్తే వారు సగోత్రీకులు అవుతారు. ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,

|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతుఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ..శర్మన్ అహం భో అభివాదయే ||

పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.

గోత్రం వెనుక కూడా సైన్స్ దాగి ఉంది. అది ఏంటంటే.. ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా జీన్ మ్యాపింగ్ అనే పదాన్ని వింటూ ఉంటాం. ఇది ఒక అధునాతన శాస్త్రం. అసలు గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ఈ వ్యవస్థ ఎందుకు ఉన్నది. వివాహంలో దీన్ని చాలా ముఖ్యంగా ఎందుకు భావిస్తారు. కొడుకులకు మాత్రమే గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది.

కూతుర్లకు ఎందుకు రావడం లేదు. వివాహం తర్వాత కుమార్తె గోత్రం అలా ఎందుకు మారుతుంది. గోత్రం అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది. మొదటి పదం గో అంటే ఆవు త్రాహి అంటే కొట్టం. గోత్రము అంటే గోశాల అని అర్థం. జీవ శాస్త్రం పరంగా చూసుకుంటే మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో లైంగిక క్రోమోజోములు ఒకటి తండ్రి నుంచి ఒక తల్లి నుంచి వచ్చే ఒక జత ఉంటుంది. ఈ రెండు క్రోమోజోములు మాత్రమే వ్యక్తి యొక్క లింగనిర్ధారణ చేస్తాయి. గర్భధారణ సమయంలో ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే అమ్మాయి పుడుతుంది అంటారు..

అలాగే ఎక్స్, వై అయితే అబ్బాయి పుడతాడు అని నమ్ముతారు. ఇందులో ఎక్స్ తల్లి నుంచి వై తండ్రి నుంచి తీసుకుంటుంది. స్త్రీలు ఎప్పటికీ వై పొందరు కాబట్టి తన అత్తవారింటి గోత్రం వస్తుంది. అలా తన కూతురు గోత్రం వివాహం తర్వాత మార్పు చెందుతుంది. ఒకే గోత్రానికి చెందిన వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదం ఉంది. గోత్రం ప్రకారం సంక్రమించిన వై క్రోమోజోములు ఒకటీగా ఉండకూడదు ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాల్ని సక్రియం చేస్తుంది. ఈ ప్రపంచంలో వై క్రోమోజోమ్ లేనట్లయితే మగజాతి అంతమవుతుంది. కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి వై క్రోమోజోములు రక్షించడానికి ఉపయోగించే పద్ధతి స్వా గోత్రం.

XY లో – X తల్లి నుండి మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.
ఈ Y ప్రత్యేకమైనది. అది X లో కలవదు. కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు … అలా..).


మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది.


ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి. గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా ఉండకూడదు. ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది. ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి. ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.


కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు.


మన మహా ఋషుల చే సృష్టించబడ్డ అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇది మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు.. మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే “GENE MAPPING” క్రమబద్ధీకరించారు.


అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి .ఇలా వివరణతో సహా చెప్పండి.